పిన్నెల్లిని తప్పించే కుట్రలో అధికారులూ భాగస్వాములా?
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై వెంటనే కేసు పెట్టకుండా, అరెస్టు చేయకుండా ఆయన పారిపోయేందుకు అధికార యంత్రాంగమే అవకాశం కల్పించిందా? కేసు పెట్టడంలో జాప్యం చేయడంతోపాటు ఉద్దేశపూర్వకంగానే ఎఫ్ఐఆర్లో మొదట ఆయన పేరు చేర్చలేదా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
ఎమ్మెల్యే పిన్నెల్లి పేరు మొదటే ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదు?
సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు గ్రామంలోని పోలింగ్ బూత్లో
ఈవీఎంను ధ్వంసం చేస్తున్న వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
పోలింగ్ బూత్ నుంచి బయటకు వెళుతూ నంబూరి శేషగిరిరావును హెచ్చరిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి
ఈనాడు, అమరావతి: ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై వెంటనే కేసు పెట్టకుండా, అరెస్టు చేయకుండా ఆయన పారిపోయేందుకు అధికార యంత్రాంగమే అవకాశం కల్పించిందా? కేసు పెట్టడంలో జాప్యం చేయడంతోపాటు ఉద్దేశపూర్వకంగానే ఎఫ్ఐఆర్లో మొదట ఆయన పేరు చేర్చలేదా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో క్షేత్రస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు అందరు అధికారుల ప్రమేయముందన్న అనుమానాలు వస్తున్నాయి. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్వో)గా వ్యవహరించిన పల్నాడు జిల్లా సంయుక్త కలెక్టర్ శ్యామ్ప్రసాద్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నెల 13న సంఘటన జరిగితే 20వ తేదీ వరకు ఎమ్మెల్యే పేరును నిందితుల జాబితాలో చేర్చకపోవడం ఆర్వో నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే, పోటీలో ఉన్న అభ్యర్థి మధ్యాహ్నం సమయంలో పోలింగ్ సిబ్బందితో సహా అందరూ చూస్తుండగా ఈవీఎంను ఎత్తి నేలపై విసిరికొడితే గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని కేసు పెట్టడాన్నిబట్టే అధికారులు ఎమ్మెల్యేకు ఎంత అనుకూలంగా పనిచేశారో అర్థమవుతోంది. ప్రతి పోలింగ్ కేంద్రంలోను వెబ్క్యాస్టింగ్ అందుబాటులో ఉన్నప్పుడు ఈవీఎంను ఎవరు ధ్వంసం చేశారో సీసీ టీవీ ఫుటేజీ చూసి తేలిగ్గా కనిపెట్టొచ్చు! సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆర్వో, బందోబస్తులో ఉన్న పోలీసు అధికారులు చేయాల్సిన పనే అది. కానీ ఆర్వో, పోలీసు అధికారులు ఈ విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిని సర్వీసు నుంచి డిస్మిస్ చేయవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఫిర్యాదు చేయడానికి రెండు రోజులా?
పోలింగ్ కేంద్రంలో 13న మధ్యాహ్నం రామకృష్ణారెడ్డి ఈవీఎంను, వీవీప్యాట్ను ధ్వంసం చేసిన సంఘటనలు సీసీ టీవీలో రికార్డు అవడంతో పాటు అక్కడి పోలింగ్ సిబ్బందీ సెల్ఫోన్లో బంధించారు. కానీ ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయలేదు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అక్కడ పోలింగ్ అధికారి విషయాన్ని తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఆయనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ ఎమ్మెల్యేపై భయభక్తులతో ఫిర్యాదు చేసేందుకు పోలింగ్ అధికారి ముందుకు రాలేదు. గుర్తుతెలియని వ్యక్తులు కంట్రోల్ ప్యానల్, వీవీ ప్యాట్ యంత్రాలను ధ్వంసం చేయడం వల్ల రూ.2వేల నష్టం వాటిల్లిందని స్థానిక వీఆర్వో జానయ్య ఈ నెల 15న ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సహా ఎవరి పేర్లూ దీనిలో ప్రస్తావించలేదు.
అధికారులకు విధులేంటో తెలియదా?
మాచర్ల నియోజకవర్గంలో బందోబస్తు పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఐజీ కేడర్లో ఉన్న పోలీసు అధికారి శ్రీకాంత్ వెళ్లారు. ఆయన దృష్టికీ రాలేదా? వస్తే ఎందుకు పట్టించుకోలేదు? జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘ఈవీఎంల ధ్వంసం, పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు సృష్టించిన వారిపై చర్యల కోసం సీసీటీవీ ఫుటేజీని పోలింగ్ జరిగిన మర్నాడే పోలీసులకు అందజేశాం’ అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా బుధవారం విలేకరులకు చెప్పారు. అప్పుడు ఎమ్మెల్యే పేరు మొదటే ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదు? ఎమ్మెల్యేపై భయభక్తులతో, ఆయన కుట్రలకు సహకరించే ఉద్దేశంతోనే అలా వ్యవహరించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పాలన యంత్రాంగాన్ని నడిపే అత్యున్నత స్థాయి అధికారే వైకాపాకు మేలు చేసేలా వ్యవహారాలు నడిపేటప్పుడు కిందిస్థాయి అధికారులు ఆయన బాటలో నడవడంలో ఆశ్చరమేముందన్న విమర్శలూ ఉన్నాయి.
సీసీటీవీ ఫుటేజీ బయటకు రాకపోతే..!
సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం హుటాహుటిన స్పందించడంతో ఎమ్మెల్యే పేరును నిందితుల జాబితాలో చేర్చారు. లేకపోతే ఆ నిజాన్ని సమాధి చేసేసేవారని, ఎమ్మెల్యే పారిపోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదన్న విమర్శలొస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు