ఉద్యమ గడ్డపై పట్టెవరికి?
ఝార్ఖండ్లోని కీలక ప్రాంతాలైన రాజధాని సహా నాలుగు నియోజకవర్గాల్లో ఈ నెల 25వ తేదీన పోలింగ్ జరగనుంది. రాజధాని రాంచీ కేంద్రంగానే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరగడం విశేషం.
ఝార్ఖండ్లోని 4 స్థానాలకు రేపు పోలింగ్
బరిలో 93 మంది అభ్యర్థులు
ప్రధాన పోటీ జాతీయ కూటముల మధ్యే!
ఈనాడు ప్రత్యేక విభాగం
ఝార్ఖండ్లోని కీలక ప్రాంతాలైన రాజధాని సహా నాలుగు నియోజకవర్గాల్లో ఈ నెల 25వ తేదీన పోలింగ్ జరగనుంది. రాజధాని రాంచీ కేంద్రంగానే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరగడం విశేషం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక అసెంబ్లీకి ఒకలా, లోక్సభకు మరోలా ఇక్కడ తీర్పు వెలువడుతోంది. జాతీయ స్థాయిలో హిందుత్వ, మోదీ ప్రభావం అధికంగా కనిపిస్తూ ఉంటుంది. రాంచీ, జంశెద్పుర్, ధన్బాద్, గిరిడీహ్లలో జరగనున్న ఎన్నికల్లో మొత్తం 93 మంది బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ ఎన్డీయే, ఇండియా కూటముల మధ్యే సాగుతోంది. భాజపా కూటమిలో ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్యూ) ప్రధాన భాగస్వామికాగా.. ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఉన్నాయి. రాష్ట్రంలో ఇండియా కూటమి ప్రభుత్వమే ఉంది.
ధనాధన్ ధోనీ సొంత నేల
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సొంత ఊరు రాంచీ. దీంతోపాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన గోండా కొండలు, బిర్సా బయోలాజికల్ పార్కు తదితరాలు ఉన్నాయి. ఝార్ఖండ్ రాజధాని అయిన రాంచీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కేంద్ర స్థానంగా నిలిచింది. ఇక్కడ ఎస్టీలు 35.7 శాతం, ముస్లింలు 12.7శాతం ఉంటారు.
2014, 2019లలో భాజపా విజయం సాధించింది. ఈసారి భాజపా తరఫున సంజయ్ సేథ్, కాంగ్రెస్ నుంచి యశస్వినీ సహాయ్, బీఎస్పీ తరఫున మనోజ్ కుమార్ పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో భాజపా గెలిచినా ఈ సారి గట్టి పోటీ నెలకొంది. మోదీ, రామ మందిరంపై భాజపా ఆధారపడుతోంది. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొన్న జేఎంఎం నేత హేమంత్ సోరెన్ను అరెస్టు చేయడంతో కొంత సానుభూతి రావొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతోపాటు రాష్ట్రంలో అధికారంలో ఉండటం ఆ కూటమికి కలిసివచ్చే అంశం.
టాటా నగరం
పార్శీ వ్యాపారవేత్త జంశెద్జీ నషార్వాంజీ టాటా పేరుతో ఏర్పాటైన జంశెద్పుర్ను టాటా నగర్ అని కూడా పిలుస్తారు. ఇది పారిశ్రామిక నగరంగా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకుంది. 1907లో తొలిసారిగా ఇక్కడ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (టిస్కో) ఏర్పాటైంది. ఆ తర్వాత టాటాకు చెందిన అనేక కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇక్కడ ఎస్టీలు 28.5%, ముస్లింలు 8.9%, ఎస్సీలు 5% ఉన్నారు.
2014, 2019లలో ఇక్కడి నుంచి భాజపా నేత బిద్యుత్ బరన్ మహతో గెలిచారు. హ్యాట్రిక్ సాధించేందుకు మరోసారి ఆయనే పోటీ చేస్తున్నారు. జేఎంఎం తరఫున సమీర్ కుమార్ మొహంతి, బీఎస్పీ తరఫున ప్రణవ్ కుమార్ మహతో తలపడుతున్నారు. మోదీ ప్రభావంతోపాటు బిద్యుత్కు స్థానికంగా ఉన్న బలం భాజపాకు సానుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్, జేఎంఎంల ఓట్ల బదిలీ సాఫీగా సాగితే ఇండియా కూటమి గట్టెక్కే అవకాశాలూ లేకపోలేదు.
జైనుల పవిత్ర స్థలం
జైనుల పవిత్ర స్థలం గిరిడీహ్లోనే ఉంది. ఇక్కడి పార్శ్వనాథ్ ఆలయానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. రాజకీయంగానూ ఈ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానముంది. బొగ్గు, ఇనుప ఖనిజ ఆధారిత పరిశ్రమలు కూడా అధికంగానే ఉన్నాయి. అయినా నిరుద్యోగం, వలసలే ఇక్కడ ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కుర్మీలు 18%, ముస్లింలు 16.2%, ఎస్సీలు 14.7%, ఎస్టీలు 10.2% ఉన్నారు.
2014లో భాజపా, 2019లో ఏజేఎస్యూ ఇక్కడ విజయం సాధించాయి. ఈసారి ఏజేఎస్యూ తరఫున మరోసారి చంద్ర ప్రకాశ్ చౌధరి, జేఎంఎం నుంచి మధుర ప్రసాద్ మహతో, బీఎస్పీ తరఫున కమల్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ప్రధాన కూటముల అభ్యర్థులిద్దరినీ ఝార్ఖండీ భాషా ఖత్లాన్ సంఘర్ష్ సమితి నేత జైరాం మహతో సవాలు చేస్తున్నారు. వీరంతా కుర్మీ నేతలే కావడంతో వారి ఓట్లు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఎన్డీయే కోటను బద్దలు కొడతానని మధుర ప్రసాద్ అంటున్నారు. మరోవైపు జైరాం ర్యాలీలకు భారీగా జనం హాజరవుతున్నారు. యువనేతగా ఈ ప్రాంతంలో ఆయన పట్టు సాధించారు. దీంతో ముక్కోణపు పోటీలో విజేత ఎవరనేది జూన్ 4 న తేలనుంది.
బొగ్గు గనుల రాజధాని
దేశ బొగ్గు గనుల రాజధానిగా ధన్బాద్కు పేరు. ఈ ప్రాంతంలో అనేక బొగ్గు గనుల పరిశ్రమలున్నాయి. దీంతోపాటు భారీ పరిశ్రమలకు, వాణిజ్యానికి కేంద్రంగా నిలుస్తోంది. ధన్బాద్ చుట్టూ 112 బొగ్గు గనులున్నాయి. 2.75 కోట్ల టన్నుల బొగ్గును ఇవి ఏటా ఉత్పత్తి చేస్తాయి. దామోదర్, జామురియా నదులు ఇక్కడ ప్రవహిస్తాయి. ఇక్కడ 65శాతం పట్టణ ప్రాంత ఓటర్లుంటారు. ఎస్సీలు 16%, ఎస్టీలు 8%, ముస్లింలు 14% ఉంటారు. ఉత్తర్ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి గనుల్లో పనిచేసేవారు అధికంగా ఉంటారు.
2014, 2019లలో మోదీ ప్రభంజనం కారణంగా భాజపా విజయం సాధించింది. ఈసారి భాజపా తరఫున దులు మహతో, కాంగ్రెస్ నుంచి అనుపమా సింగ్, బీఎస్పీ నుంచి మోహన్ సింగ్ పోటీ చేస్తున్నారు. మరోసారి మోదీ, రామ మందిరం ప్రభావంతో గెలవాలని భాజపా చూస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?