సంక్షిప్త వార్తలు (10)
భారాసకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి తెలిపారు.
కాంగ్రెస్కు కిషన్రెడ్డి బ్రాండ్ అంబాసిడర్: జగ్గారెడ్డి
హైదరాబాద్, న్యూస్టుడే: భారాసకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి తెలిపారు. శుక్రవారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్కు కిషన్రెడ్డి బ్రాండ్ అంబాసిడర్గా మారారని, భాజపాలో ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోకి వస్తారని భావిస్తున్నామన్నారు. ప్రభుత్వాలను పడగొట్టడంలో భాజపా నేతలు ప్రొఫెసర్లు కానీ, రాష్ట్రంలో ఎన్ని కుట్రలు చేసినా తమ ప్రభుత్వాన్ని పడగొట్టలేరని స్పష్టం చేశారు.
ముస్లిం రిజర్వేషన్లపై తప్పుడు ప్రకటనలు చేస్తే పిటిషన్ వేస్తా: షబ్బీర్ అలీ
హైదరాబాద్, న్యూస్టుడే: ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ.. మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీమంత్రి షబ్బీర్అలీ విమర్శించారు. రిజర్వేషన్లపై తప్పుడు ప్రకటనలు చేస్తే సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్ వేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముస్లిం రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని, దీనిపై మోదీ, అమిత్షా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఈ లేఖలోని అంశాలను అధ్యయనం చేసిన తర్వాత మోదీ వైఖరిలో మార్పు వస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు షబ్బీర్అలీ పేర్కొన్నారు.
తీన్మార్ మల్లన్నకు సీపీఎస్ సంఘం మద్దతు
ఈనాడు, హైదరాబాద్: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించినట్లు పేర్కొన్నారు.
భారాస నేతలనే అలా అన్నాను: మంత్రి తుమ్మల
ఈనాడు, హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన సమావేశాల సందర్భంగా రైతులను విమర్శించారంటూ మాజీ మంత్రి హరీశ్రావు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులను తాము దేవుళ్లుగా భావిస్తున్నామన్నారు. అన్నదాతలకు అన్ని విధాలు మేలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై భారాస నేతలు మొరుగుతున్నారని తాను ఖమ్మం జిల్లా సభల్లో విమర్శించానని మంత్రి స్పష్టం చేశారు.
మహేశ్వర్రెడ్డిపై కేసులు అన్యాయం: భాజపా
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను భాజపా శాసనసభాపక్ష నేతగా మహేశ్వర్రెడ్డి ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని భాజపా ఎమ్మెల్యేలు శుక్రవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఆధారాలతో అక్రమాలను బయటపెడితే సమాధానం చెప్పకుండా కేసులు పెట్టించడం దారుణమన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భాజపా ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పాటిల్, పాల్వాయి హరీశ్బాబు, ధన్పాల్ సూర్యనారాయణలు పేర్కొన్నారు. ప్రభుత్వ అక్రమాలను ఎండగట్టడం కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
వైకాపా హయాంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
తిరుపతి(నగరం), న్యూస్టుడే: వైకాపా హయాంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యంగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. తిరుపతిలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘స్థానిక పద్మావతి యూనివర్సిటీ ఆవరణలో చంద్రగిరి కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నానికి పోలీసుల వైఫల్యమే కారణం. శాంతిభద్రతలను కాపాడలేని పోలీసులు యూనిఫాం ధరించేందుకు అనర్హులు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారిపోవడంలోనూ ఖాకీల పాత్ర ఉంది. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఈసీ విఫలమైంది. ఓటేసేందుకు డబ్బులు ఇవ్వాలంటూ కొన్నిచోట్ల ప్రజలు బహిరంగంగా ధర్నాకు దిగడం హాస్యాస్పదం’ అని రామకృష్ణ పేర్కొన్నారు.
విజయం కూటమిదే: పురందేశ్వరి
ఈనాడు-అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించబోతున్నట్లు పలు విశ్లేషణలు తేటతెల్లం చేస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. వెబ్ మాధ్యమం ద్వారా శుక్రవారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఓట్ల లెక్కింపునకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ఎన్నికల్లో మాదిరిగానే కౌంటింగ్ ప్రక్రియలోనూ అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
బ్రిటిషర్ల తరహాలో మోదీ సర్కారు దోపిడీ
బ్రిటిషర్ల తరహాలో మోదీ సర్కారు మన దేశ జలాలు, అడవులు, భూములను గత పదేళ్లు దోచుకుంది. భారత సంపదను ధనవంతులైన తన స్నేహితులకు ప్రధాని అప్పగించారు. మేం బ్రిటిషర్లను ఎదుర్కొన్నవాళ్లం. భాజపాకు భయపడం. కాంగ్రెస్ ఎప్పుడూ హిందువులు, ముస్లింలను ఏకం చేస్తుంటుంది. మోదీ మాత్రం వారిని విడగొడుతుంటారు.
మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు (ఝార్ఖండ్ లోని దేవ్ ఘర్ లో ర్యాలీలో..)
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు ఇండియా కూటమితో ముప్పు
విపక్ష ఇండియా కూటమి ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, అత్యంత వెనుకబడినవర్గాల ప్రజలకు వ్యతిరేకం. ఈ వర్గాల రిజర్వేషన్ ను లాగేసుకొని ముస్లింలకు కేటాయించాలని ఆ కూటమి భావిస్తోంది. తద్వారా ముస్లింలను సంతృప్తిపరచాలని చూస్తోంది. దానికి ఓటు వేయొద్దు. భాజపాకు మద్దతుగా నిలవండి. మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయితే.. భారత్ ప్రపంచంలోకెల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది.
జె.పి.నడ్డా, భాజపా అధ్యక్షుడు (ఉత్తర్ప్రదేశ్ లోని కుశినగర్ లో మాట్లాడుతూ..)
అసత్యాలు ప్రచారం చేయడానికి దేవుడు భూమిపైకి పంపిస్తాడా?
తనను దేవుడే భూమిపైకి పంపించాడని, తనకు జీవ సంబంధిత తల్లిదండ్రులు లేరని మోదీ అంటున్నారు. నేనొక ప్రశ్న అడగాలనుకుంటున్నా. అల్లర్లు సృష్టించడానికి, ప్రచార ప్రకటనలతో అసత్యాలు వ్యాప్తి చేయడానికి, ఎన్నార్సీ ద్వారా ప్రజలను జైలుపాలు చేయడానికి దేవుడు ఎవరినైనా భూమిపైకి పంపిస్తాడా? ఎన్నికల్లో ఓటమి భయం కారణంగా భాజపా నేతలు నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు.
మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం (బెంగాల్లోని మథురాపూర్లో ప్రసంగిస్తూ..)
పూర్తి ఆరోగ్యంగా ఉన్నా
నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా. కొన్ని నెలలుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా. నేను అనారోగ్యంగా ఉన్నట్లు భాజపా చెబుతుతోంది. ఆ పార్టీ నేతల అబద్ధాలకు ఓ హద్దు ఉండాలి.
నవీన్ పట్నాయక్ , ఒడిశా సీఎం (భువనేశ్వర్లో విలేకర్లతో మాట్లాడుతూ..)
బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసుల సమస్యలు పరిష్కరించండి
డీజీపీకి తెదేపా నేతలు ఇక్బాల్, ఎంఎస్ బేగ్ వినతి
పోలీసుల సమస్యలు పరిష్కరించాలని డీజీపీ హరీశ్కుమార్ గుప్తాకు వినతిపత్రం అందజేస్తున్న తెదేపా నాయకులు మహ్మద్ ఇక్బాల్, ఎంఎస్ బేగ్
ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్నికలకు సంబంధించి బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసుల సమస్యల్ని పరిష్కరించాలని డీజీపీ హరీశ్కుమార్గుప్తాకు తెదేపా నేతలు మహ్మద్ ఇక్బాల్, ఎంఎస్ బేగ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో శుక్రవారం డీజీపీకి వినతిపత్రం అందజేశారు. ‘అలవెన్సులు సకాలంలో అందించాలి. మెరుగైన సౌకర్యాలు కల్పించాలి’ అని కోరారు.
పిన్నెల్లి అరాచకాలకు గిరిజనులు బలి
తెదేపా ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధారునాయక్
ఈనాడు డిజిటల్, అమరావతి: మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలకు గిరిజనులు బలయ్యారని తెదేపా ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధారునాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్ రోజు కొత్తపుల్లారెడ్డిగూడెంలోని 8 మంది గిరిజన ఏజెంట్లపై పిన్నెల్లి అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారని శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మూడు పోలింగ్ బూత్లలో ఏజెంట్లుగా కూర్చున్న గిరిజనులపై కర్రలు, కత్తులు, రాడ్లతో దాడి చేశారు. కేతావత్ రేఖ్యానాయక్ కడుపులో పొడవడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది’ అని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.