గిరిజనం ఎటంటే అటే!
పశ్చిమ బెంగాల్లో గిరిజనుల ఆధిపత్యమున్న ప్రాంతంలోని 8 నియోజకవర్గాల్లో శనివారం ఆరో విడతలో భాగంగా పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో ఇక్కడ పైచేయి సాధించిన భాజపా మరోసారి పట్టుకు ప్రయత్నిస్తోంది.
పశ్చిమ బెంగాల్ ఆరో విడతలో 8 నియోజకవర్గాల్లో నేడే పోలింగ్
గత ఎన్నికల్లో 5 గెలిచిన భాజపా
మళ్లీ పట్టుకు ప్రయత్నం
అడ్డుకోవాలని తృణమూల్ పోరాటం
పశ్చిమ బెంగాల్లో గిరిజనుల ఆధిపత్యమున్న ప్రాంతంలోని 8 నియోజకవర్గాల్లో శనివారం ఆరో విడతలో భాగంగా పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో ఇక్కడ పైచేయి సాధించిన భాజపా మరోసారి పట్టుకు ప్రయత్నిస్తోంది. 2019లో ఈ 8లో ఐదింటిని భాజపా గెలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ 3 చోట్ల విజయం సాధించింది. మళ్లీ తమదే ఆధిపత్యమని భాజపా అంటుండగా.. ఈసారి పరిస్థితుల్లో మార్పు వచ్చిందని తృణమూల్ చెబుతోంది. 8 నియోజకవర్గాల్లో మొత్తం 79 మంది పోటీ చేస్తున్నారు. భాజపా, తృణమూల్ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇండియా కూటమీ బరిలో ఉంది.
- ఝార్ఖండ్, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న కొన్ని నియోజకవర్గాలు ఒకప్పుడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ఉండేవి.
- ముండా వర్గానికి చెందిన గిరిజనులు పురూలియా, మేదినీపుర్లలో ఉంటారు.
- బాంకుఢా, పురూలియా, మేదినీపుర్ నియోజకవర్గాల్లో సంతాల్ గిరిజనులు అధికంగా ఉంటారు.
- పురూలియా మైదాన ప్రాంతాల్లో ఓరాన్ (కురుఖ్) గిరిజనులు ఉంటారు.
హ్యూయాన్ త్సాంగ్ దర్శించిన స్థలం
చైనా పర్యాటకుడు హ్యూయాన్ త్సాంగ్ సందర్శించిన స్థలమే తామ్లుక్. గతంలో దీనిని తామ్రలిప్తి అని పిలిచేవారు. బంగాళాఖాతానికి దగ్గరగా ఉన్న ఈ నియోజకవర్గం రూప్నారాయణ్ నదీ తీరాన ఉంది. గతంలో కాంగ్రెస్, లెఫ్ట్ ఆధిపత్యం చెలాయించిన ఈ సీట్లో ప్రస్తుతం తృణమూల్ హవా కొనసాగుతోంది. ఈ నియోజకవర్గంలో ముస్లింలు 15శాతం ఉంటారు.
2014, 2019లలో తృణమూల్ ఇక్కడ విజయం సాధించింది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి అభిజీత్ గంగోపాధ్యాయ ఈసారి భాజపా తరఫున, యువనేత దేబాంశు భట్టాచార్య తృణమూల్ నుంచి, సయాన్ బెనర్జీ సీపీఎం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ తృణమూల్ అంతకంతకూ బలపడుతోంది. 2016 ఉప ఎన్నికలో వామపక్షం 5 లక్షల ఓట్లను సాధించింది. ఆ తర్వాత క్రమంగా పట్టు కోల్పోతోంది. తృణమూల్ నుంచి భాజపాలో చేరిన సువేందు అధికారి కుటుంబానికి ఈ ప్రాంతంలో గట్టి పట్టుంది.
సైద్ధాంతిక పోరుకు వేదిక
కంగస్బాతీ నదీతీరాన ఉన్న మేదినీపుర్ రాజకీయ సైద్దాంతిక పోరుకు వేదిక. లెఫ్ట్ దిగ్గజ నేత ఇంద్రజిత్ గుప్తా ఇక్కడి నుంచే ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు. విద్యా కేంద్రమైన మేదినీపుర్లో అక్షరాస్యత అధికం. బెంగాలీ, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, మార్వాడీ మాట్లాడతారు.
లెఫ్ట్నకు ఆధిపత్యం ఉన్న ఈ సీట్లో 2014లో తృణమూల్, 2019లో భాజపా గెలిచాయి. ఈసారి అగ్నిమిత్ర పాల్ (భాజపా), జూన్ మలియా (తృణమూల్), బిప్లవ్ భట్టా (సీపీఐ) పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన దిలీప్ ఘోష్ను బర్ధమాన్ దుర్గాపుర్కు భాజపా మార్చింది. అగ్నిమిత్ర ఫ్యాషన్ డిజైనర్కాగా.. జూన్ మలియా నటి. మరోసారి విజయం సాధించేందుకు భాజపా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మోదీ ప్రభావం అధికంగా పనిచేసే అవకాశముంది.
ఫార్వర్డ్బ్లాక్ కంచుకోట
ఒకప్పటి ఫార్వర్డ్ బ్లాక్కు కంచుకోట పురూలియా. కసల్ నదీతీరాన ఈ నియోజకవర్గం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ఒకసారి గెలవగా.. సీపీఎం అడుగుపెట్టలేదు. పూరూలియాలో అక్షరాస్యత 65%.
2014లో తృణమూల్, 2019లో భాజపా ఇక్కడ విజయం సాధించాయి. ఈసారి భాజపా తరఫున సిటింగ్ ఎంపీ జ్యోతిర్మయి సింగ్ మహతో, తృణమూల్ నుంచి రాష్ట్ర మంత్రి శాంతిరాం మహతో, కాంగ్రెస్ అభ్యర్థిగా నేపాల్ చంద్ర మహతో బరిలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో భాజపా స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. దీంతో మరోసారి గెలుస్తామనే ధీమాతో ఉంది.
వ్యవసాయాధారితం
కోల్కతాకు 160 కిలోమీటర్ల దూరంలో ఉండే కాంథీ నియోజకవర్గంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఉప్పు ఉత్పత్తి అధికంగా జరుగుతూ ఉంటుంది. అత్యంత వెనుకబడిన జిల్లాలో ఇది ఒకటి. 2008లో ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచీ తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తూ వస్తోంది.
ఈసారి భాజపా నుంచి సౌమేందు అధికారి, తృణమూల్ నుంచి ఉత్తమ్ బారిక్, కాంగ్రెస్ నుంచి ఊర్వశి బెనర్జీ తలపడుతున్నారు. ఈ ప్రాంతంలో పట్టున్న అధికారి కుటుంబం దూరం కావడం తృణమూల్కు ప్రతికూలం.
ఘన చరిత్ర
ఘన చరిత్ర, సాంస్కృతిక వారసత్వం కలిగిన ఘాటాల్ 2008లో నియోజక వర్గాల పునర్విభజన తర్వాత ఏర్పాటైంది. ఇక్కడ ఖాదీ ఉత్పత్తులు, టస్సర్ సిల్క్, బెల్ల తయారీ పరిశ్రమలున్నాయి.
2014, 2019లలో తృణమూల్ విజయం సాధించింది. ఈసారి భాజపా తరఫున హిరణ్మయ్ ఛటోపాధ్యాయ, తృణమూల్ నుంచి దీపక్ అధికారి, సీపీఐ నుంచి తపన్ గంగూలీ పోటీ చేస్తున్నారు. దీపక్ బెంగాలీ సినీ నటుడు. కరోనా సమయంలో ఆయన నియోజకవర్గంలో ప్రజలకు విస్తృత సేవలందించారు. దీంతో మళ్లీ ఆయనకే మమత టికెటిచ్చారు. హిరణ్మయ్ కూడా సినీ నటులే కావడం గమనార్హం. దీంతో పోరు ఆసక్తికరంగా మారింది.
బెంగాలీ హిందూ సొసైటీ
బెంగాలీ హిందూ సొసైటీకి ప్రాతినిధ్యం వహించే ఝాఢ్గ్రామ్ నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వు అయింది. బెంగాల్లో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతంలో వ్యవసాయమే జీవనాధారం. అయితే ఇక్కడ అక్షరాస్యత 80శాతం ఉండటం విశేషం. 94శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో ఉంటారు. ఎస్టీలు 25.7%, ఎస్సీలు 18.2% ఉంటారు.
2014లో తృణమూల్, 2019లో భాజపా ఇక్కడ గెలిచాయి. ఈసారి భాజపా నుంచి ప్రణత్ టుడు, తృణమూల్ నుంచి కాళీపాద సరెన్, సీపీఎం తరఫున సోనామణి టుడు బరిలోకి దిగారు. గత ఎన్నికల నుంచి భాజపా పట్టు సాధించడంతో మరోసారి గెలుస్తామన్న ధీమా ఆ పార్టీలో వ్యక్తమవుతోంది.
సంగీత ఝరి
పెయింటింగ్స్, సంగీతానికి కేంద్ర స్థానం బాంకుఢా. ఆధునిక బెంగాలీ కళకు, నిర్మాణ శైలికి ఇది అద్దం పడుతుంది. పర్యాటకులూ భారీగా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ అక్షరాస్యత 86శాతం.
2014లో తృణమూల్, 2019లో భాజపా గెలిచాయి. ఈసారి భాజపా నుంచి మరోసారి కేంద్ర మంత్రి సుభాష్ సర్కార్ బరిలో దిగారు. అరూప్ చక్రవర్తి (తృణమూల్), నీలాంజన్ దాస్గుప్తా (సీపీఎం) పోటీలో ఉన్నారు. ఇక్కడా భాజపా ఆధిపత్యమే కనిపిస్తోంది. తృణమూల్ ఎంతమేరకు పోటీ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఆలయాలకు నిలయం
టెర్రాకోటా మట్టితో నిర్మించిన మధ్యయుగంనాటి ఆలయాలకు బిష్ణుపుర్ ప్రసిద్ధి. ఎస్సీలకు రిజర్వు చేసిన ఈ నియోజకవర్గంలో అలనాటి నిర్మాణ శైలులు ఎన్నో కనిపిస్తాయి.
2014లో తృణమూల్, 2019లో భాజపా విజయం సాధించాయి. ఈ రెండుసార్లూ రెండు పార్టీల తరఫున సౌమిత్రా ఖాన్ గెలిచారు. ఆయనే మరోసారి భాజపా తరఫున బరిలో నిలిచారు. తృణమూల్ నుంచి సుజాతా మండల్, సీపీఎం అభ్యర్థిగా శీతల్ చంద్ర పోటీ చేస్తున్నారు. సౌమిత్రా ఖాన్కు స్థానికంగా ఉన్న బలం, మోదీ ప్రభావంతో గెలుస్తామని భాజపా భావిస్తోంది.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!