చండీగఢ్లో హోరాహోరీ
కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్లో సార్వత్రిక సమరం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత మనీశ్ తివారీ బరిలో దిగగా.. భాజపా సిటింగ్ ఎంపీని పక్కనపెట్టి సంజయ్ టండన్కు టికెట్ కేటాయించింది.
మనీశ్ తివారీకి గట్టి సవాల్ విసురుతున్న సంజయ్ టండన్
కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్లో సార్వత్రిక సమరం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత మనీశ్ తివారీ బరిలో దిగగా.. భాజపా సిటింగ్ ఎంపీని పక్కనపెట్టి సంజయ్ టండన్కు టికెట్ కేటాయించింది. దాదాపుగా పోటీ అంతా వీరిద్దరి మధ్యే కేంద్రీకృతమైంది. ‘బయటి వ్యక్తి’ అంటూ తివారీపై సంజయ్ విమర్శలు గుప్పిస్తుండగా.. స్థానిక సమస్యలు సహా ఏ అంశంపైనైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని కాంగ్రెస్ నేత ప్రకటించారు. వారిద్దరి మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో చండీగఢ్ పోరు వేడెక్కింది.
సంజయ్: స్థానిక సమస్యలు తెలుసంటూ..
చండీగఢ్ భాజపా సిటింగ్ స్థానం. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించిన కిరణ్ ఖేర్ను కాదని ఈసారి సంజయ్కి పార్టీ టికెట్ ఇచ్చింది. ఛత్తీస్గఢ్ మాజీ గవర్నర్ బలరామ్జీదాస్ టండన్ కుమారుడీయన. ప్రస్తుతం చండీగఢ్ భాజపా అధ్యక్షుడిగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో జోరుగా పర్యటిస్తున్న సంజయ్.. చండీగఢ్ ప్రగతి కోసం తనకు ఓటేయాలని కోరుతున్నారు. మనీశ్ తివారీని రాజకీయ పర్యాటకుడిగా అభివర్ణిస్తున్నారు. తివారీ గతంలో లుధియానా, ఆనంద్పుర్ సాహిబ్ ఎంపీగా పనిచేసిన సంగతిని గుర్తుచేస్తూ.. వాటిలో అభివృద్ధి పనులేవీ చేయకపోవడం వల్లే మరోసారి సీటు మారారని విమర్శిస్తున్నారు. 2029 లోక్సభ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఓటర్లకు ఆయన ముందే చెప్పాలంటూ ఎద్దేవా చేస్తున్నారు. తివారీ తనను తాను జాతీయ స్థాయి నేతగా చెప్పుకొంటుంటారని.. కానీ లుధియానా, ఆనంద్పుర్ సాహిబ్ల్లోని కాంగ్రెస్ అభ్యర్థులు ఆయన్ను కనీసం ప్రచారానికి పిలవకపోవడం అసలు పరిస్థితిని తెలియజేస్తోందని పేర్కొంటున్నారు. చండీగఢ్లో ఎన్ని సెక్టార్లు, గ్రామాలు ఉన్నాయో కూడా తివారీకి తెలియదని సంజయ్ అంటున్నారు. స్థానిక అంశాలపై తనకు పట్టు ఉందని చెబుతూ.. హౌజింగ్ బోర్డు సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. అయితే స్థానికంగా కొందరు భాజపా నేతల నుంచి ఆయనకు ఆశించిన మద్దతు లభించడం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తివారీ: ఇక్కడే పుట్టి పెరిగానంటూ..
చండీగఢ్లో గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి పరాజయం పాలైన కేంద్ర మాజీ మంత్రి, స్థానిక మాజీ ఎంపీ పవన్ కుమార్ బన్సల్ ఈసారీ టికెట్ ఆశించారు. కానీ ఆనంద్పుర్ సాహిబ్ ఎంపీగా ఉన్న మనీశ్ తివారీని పార్టీ ఇక్కడికి పంపి టికెట్ ఇచ్చింది. తివారీ చండీగఢ్లోనే పుట్టి పెరిగినా.. లుధియానా, ఆనంద్పుర్ సాహిబ్ల నుంచి ఇంతకుముందు ఎంపీగా గెలిచారు. తనను బయటి వ్యక్తిగా భాజపా నేతలు పేర్కొంటుండటాన్ని ఆయన తప్పుబడుతున్నారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై తనతో బహిరంగ చర్చకు రావాలంటూ సంజయ్కి సవాలు విసురుతున్నారు. 2029 తర్వాత కూడా తాను చండీగఢ్లోనే కొనసాగుతానని స్థానికులకు హామీ ఇస్తున్నారు. విపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ప్రస్తుతం ఆయనకు మద్దతు ప్రకటించాయి. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆప్ కూటమి మంచి ఫలితాలు దక్కించుకోవడం సానుకూలాంశం. చండీగఢ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, రెండుసార్లు మేయర్గా పనిచేసిన సుభాష్ చావ్లా పార్టీని వీడటం, టికెట్ దక్కకపోవడంతో బన్సల్ అసంతృప్తికి లోనవడం తివారీకి ప్రతికూలాంశాలు. అయితే బన్సల్ తనకు మద్దతిస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు ఆయన చెబుతున్నారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!