సంక్షిప్త వార్తలు (4)
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఆయన బంధువుల అండతో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో సీఎస్ జవహర్రెడ్డి, తాడేపల్లి పెద్దలు కలిసి రూ.2 వేల కోట్ల విలువైన భూ కుంభకోణానికి పాల్పడ్డారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.
సీఎస్పై ఈసీ విచారణ జరపాలి: బొండా ఉమా
విజయవాడ (చుట్టుగుంట), న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఆయన బంధువుల అండతో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో సీఎస్ జవహర్రెడ్డి, తాడేపల్లి పెద్దలు కలిసి రూ.2 వేల కోట్ల విలువైన భూ కుంభకోణానికి పాల్పడ్డారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విజయవాడలో విలేకర్లతో మాట్లాడారు.
సజ్జల భార్గవ్రెడ్డి ప్రోద్బలంతో చంద్రబాబుపై దుష్ప్రచారం
డీజీపీకి తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ
ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుపై తప్పుడు వార్తలు ప్రచారం చేయడాన్ని సజ్జల భార్గవ్రెడ్డి ప్రోద్బలంతో వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఓ అలవాటుగా మార్చుకుందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా వర్రా రవీంద్రరెడ్డి అనే వ్యక్తి ఎక్స్లో పోస్టులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దురుద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాల్ని అడ్డుకోవాలని కోరుతూ డీజీపీ హరీష్కుమార్గుప్తాకు సోమవారం లేఖ రాశారు. తెదేపా నేతల ప్రతిష్ఠను దిగజార్చేలా, వర్గ విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టే భార్గవ్రెడ్డి, రవీంద్రరెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రవీంద్రరెడ్డి ఎక్స్ ఖాతాలో.. చంద్రబాబు చికిత్స చేయించుకున్నట్లు పెట్టిన మార్ఫింగ్ ఫొటో స్క్రీన్ షాట్ను లేఖకు జత చేశారు.
తెదేపా కార్యకర్తలకు రూ.10 కోట్లతో సంక్షేమ నిధి
-నారాయణ
నెల్లూరు(జడ్పీ), న్యూస్టుడే: తెదేపా విజయానికి కష్టపడిన కార్యకర్తల కోసం రూ.10 కోట్లతో సంక్షేమ నిధిని తమ కుటుంబసభ్యుల సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, నెల్లూరు నగర తెదేపా అభ్యర్థి పొంగూరు నారాయణ ప్రకటించారు. నెల్లూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు నుంచే సుమారు 600 మంది మహిళలతో శాఖను ఏర్పాటు చేశామని తెలిపారు. వీరంతా ఎన్నికల్లో కష్టపడి పనిచేశారన్నారు. మహిళా శక్తి టీమ్ సభ్యులకు ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగంలో వారికి శిక్షణ ఇస్తామని చెప్పారు. శిక్షణ పొందిన వారికి కంపెనీలు, ఆసుపత్రులు, ఇతర వ్యాపార రంగాల్లో ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ అనురాధ, నారాయణ విద్యాసంస్థల జీఎం విజయభాస్కర్రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహిగా ముద్ర వేస్తున్నారు
ప్రజాస్వామ్యంలో మనకు- ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది. విమర్శించే హక్కు కూడా ఉంటుంది. కానీ ప్రస్తుతం సర్కారును విమర్శించిన ప్రతిసారీ దేశద్రోహి అనే ముద్ర వేస్తున్నారు. హిందూ వ్యతిరేకి అంటున్నారు. అంటే మోదీ పాలనలో విమర్శించడం చట్టబద్ధం ఎంతమాత్రమూ కాదు.
శశి థరూర్, కాంగ్రెస్ సీనియర్ నేత (చండీగఢ్లో విలేకర్ల సమావేశంలో..)
మరి మోదీ తబలా వాయిస్తున్నారా?
ఓటుబ్యాంకు ముందు విపక్షాలు ‘ముజ్రా’ చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. మరి ఆయనేం చేస్తున్నారు? తబలా వాయిస్తున్నారా? భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఖాయం. అందుకే అధికార పక్ష నేతలు అవివేకంతో ఏదేదో మాట్లాడుతున్నారు.
రాబ్డీ దేవీ, బిహార్ మాజీ సీఎం (పట్నాలో విలేకర్లతో మాట్లాడుతూ..)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్