కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం తథ్యం: లాలు

తనను దైవమే ప్రత్యేక కారణం కోసం పంపించారని ప్రధాని మోదీ పేర్కొనడంపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చురకలు వేశారు.

Published : 29 May 2024 04:23 IST

పట్నా: తనను దైవమే ప్రత్యేక కారణం కోసం పంపించారని ప్రధాని మోదీ పేర్కొనడంపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చురకలు వేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని తెలిపారు. పట్నాలో విలేకరులతో మాట్లాడుతూ...‘ఎన్నికల ఫలితాలు త్వరలోనే మనకు తెలుస్తాయి. దైవదూతనంటున్న ప్రధాని మోదీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం’ అని లాలు అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని