సంక్షిప్త వార్తలు (6)
ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఒడిశాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి భువనేశ్వర్కు బయలుదేరారు.
ఒడిశా ఎన్నికల ప్రచారానికి భట్టి
హైదరాబాద్, న్యూస్టుడే: ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఒడిశాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి భువనేశ్వర్కు బయలుదేరారు. గురువారం ఉదయం భువనేశ్వర్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి భద్రలోక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. గత వారం రోజులుగా భట్టి పంజాబ్లోని ఫరీద్కోట్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. తిరిగి రాత్రి ఒడిశా వెళ్లారు.
పీసీసీ లీగల్సెల్ కన్వీనర్గా ఇనాయతుల్లా
హైదరాబాద్, న్యూస్టుడే: పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్గా హైదరాబాద్కు చెందిన న్యాయవాది మహ్మద్ ఇనాయతుల్లా నియమితులయ్యారు. ఈ మేరకు పీసీసీ లీగల్ సెల్ ఛైర్మన్ పొన్నం అశోక్గౌడ్ బుధవారం ఆయన నియామకాన్ని ప్రకటించారు.
ఫోన్ ట్యాపింగ్లో అరెస్టైన అధికారుల సర్వీసు రద్దు చేయాలి
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన అధికారుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతోపాటు వారి సర్వీసును రద్దు చేయాలని పీసీసీ అధికార ప్రతినిధులు చనగాని దయాకర్గౌడ్, మహ్మద్రియాజ్లు సీఎం రేవంత్రెడ్డిని కోరారు. వారు బుధవారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
‘ఇండియా’ ఓటమి తర్వాత ఈవీఎంలపై నిందలే
ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి కూడా లేరు. ఓట్ల లెక్కింపు జరిగే రోజు మధ్యాహ్నం ఇద్దరు యువరాజులు (రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్) మీడియా సమావేశం ఏర్పాటుచేస్తారు. ఈవీఎంలలో లోపాలు ఉన్నాయని, తమ ఓటమికి అవే కారణమని నిందిస్తారు. ఇది పక్కా. దీనిలో ఎలాంటి మార్పు ఉండదు. రాహుల్బాబాకి 40 సీట్లు కూడా రావు. మరో యువరాజుకు 4 సీట్లు వస్తాయి. యూపీలో ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు కరెంటుకూ దిక్కు ఉండేది కాదు. భాజపా వచ్చి ఎన్నింటినో మెరుగుపరిచింది.
ఉత్తరప్రదేశ్లోని వేర్వేరు బహిరంగ సభల్లో కేంద్ర మంత్రి అమిత్షా
ప్రాయశ్చిత్తం కోసం కన్యాకుమారికి వెళ్తే మంచిదే
వివేకం అంటే ఏమిటో అర్థం చేసుకోని వ్యక్తి ఏం ధ్యానం చేయగలరు? కన్యాకుమారిలోని వివేకానంద శిలాస్మారకం వద్ద ధ్యానం కోసం వెళ్తున్నది ప్రాయశ్చిత్తం కోసమైతే మాత్రం మంచిదే. వివేకానందుని బోధనల నుంచి స్ఫూర్తి పొందడానికి వెళ్లినా మంచిదే. 60 నెలలు అధికారమిస్తే సరికొత్త దేశాన్ని చూపిస్తామని 120 నెలలు పాలించి కూడా సాధించిందేమీ లేకపోవడం వల్లనే ముజ్రా, మంగళసూత్ర, ఓట్ జిహాద్ అని ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు.
చండీగఢ్లో విలేకరులతో రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్
భాజపా మళ్లీ నెగ్గితే భూములు లాక్కొంటుంది
కేంద్రంలో మరోసారి భాజపా ప్రభుత్వం ఏర్పడితే రైతులు, ఆదివాసీల భూముల్ని లాక్కొంటుంది. దానికోసం చట్టం చేస్తుంది. ఇండియా కూటమిని గెలిపిస్తే రికార్డుస్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తుంది. రైతు రుణాలను మాఫీ చేస్తుంది. అగ్నివీర్ పథకాన్ని రద్దుచేస్తుంది.
యూపీలోని ఛోటేలాల్ ఖర్వార్ సభలో సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్
వైకాపా ప్రభుత్వంలో విచ్చలవిడిగా భూ మాఫియా
భాజపా నేత లంకా దినకర్ ధ్వజం
విశాఖపట్నం (పెదవాల్తేరు), న్యూస్టుడే: భూ మాఫియాను విచ్చలవిడిగా ప్రోత్సహించిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. విశాఖలోని భాజపా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పవర్ ప్రాజెక్టుల పేరుతో సీఎం జగన్ భూ సంతర్పణలు చేశారని ఆరోపించారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండో సోలార్ సంస్థలకు భారీఎత్తున భూములు కట్టబెట్టారని మండిపడ్డారు. ఎంఓయూలు చేయకుండా జీవోలు జారీచేసిన ఘనత జగన్ సర్కారుదేనన్నారు. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో 32 వేల ఎకరాలను నామమాత్రపు ధరలకు ఇచ్చారని.. రూ.500 కోట్లకు మించి టర్నోవర్ లేని సంస్థలకు రూ.వేల కోట్ల విలువచేసే భూములు ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. దీనిపై ఆడిట్ చేయాలని డిమాండు చేశారు.
వారణాశిలో ఏపీ భాజపా నేతల విస్తృత ప్రచారం
ఈనాడు డిజిటల్, అమరావతి: వారణాశి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రధాని మోదీ ప్రచార బృందంలో.. రాష్ట్రానికి చెందిన విష్ణువర్థన్రెడ్డి, మాధవ్, తపనాచౌదరి, శివన్నారాయణ, నవనీత్ ఉన్నారు. గత 12 రోజులుగా వారు వారణాశిలో ప్రచారం చేస్తున్నారు. స్థానికంగా స్థిరపడ్డ తెలుగువారితో భేటీ అవుతూ.. భాజపాకు ఓటేయాలని కోరుతున్నారు.
‘ఓటమి భయంతోనే ఎన్నికల సంఘంపై సజ్జల ఆరోపణలు’
ఈనాడు డిజిటల్, అమరావతి: ఓటమి భయంతోనే ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘గత ఐదేళ్లుగా వైకాపా నాయకులు అరాచక పాలన సాగించారు. వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారు. తమకు వ్యతిరేక గాలి వీస్తుండటంతో వైకాపా నేతలు ఎన్నికల సంఘాన్ని, ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తున్నారు. ఇప్పటికే ప్రజలు వైకాపాకు వ్యతిరేకంగా ఓట్లేశారు’ అని భానుప్రకాశ్రెడ్డి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి