వారసులు.. ఇటు గెలుపు.. అటు ఓటమి!
వారసులను రాజకీయాల్లోకి తీసుకురావాలని భావించడం సర్వసాధారణమే. కానీ, వారిని గెలిపించుకుని చట్టసభల్లోకి పంపడం అంత సులభం కాదు.
కూటమిలో పోటీచేసిన వారసుల ఘనవిజయం
జగన్ సోదరి, మేనమామ ఓటమి
బొత్స కుటుంబం ఘోర పరాజయం
ధర్మాన సోదరుల పరిస్థితీ ఇంతే
భూమన, చెవిరెడ్డి, పేర్ని వారసులూ ఇంటికే
వైకాపా అభ్యర్థులకు చేదు అనుభవాలు
ఈనాడు, అమరావతి: వారసులను రాజకీయాల్లోకి తీసుకురావాలని భావించడం సర్వసాధారణమే. కానీ, వారిని గెలిపించుకుని చట్టసభల్లోకి పంపడం అంత సులభం కాదు. అందులోనూ కూటమి ప్రభంజనం సృష్టించిన వేళ... తెదేపా నుంచి పోటీ చేసిన పలువురి కుటుంబసభ్యులు సునాయాసంగా విజయ తీరాలు చేరుకుంటే.. అదే సమయంలో వైకాపా నుంచి దిగ్గజాలు అనుకున్న నేతల వారసులు చతికిలపడ్డారు. తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడి కుమార్తె యనమల దివ్య కాకినాడ జిల్లా తుని, దివంగత వరుపుల రాజా సతీమణి సత్యప్రభ ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థులుగా గెలుపొందారు. సత్యప్రభ భర్త వరుపుల రాజా 2019 ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఈయన గత మార్చి నెలలో గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.
- తెదేపా అధినేత చంద్రబాబు కుప్పంలో, ఆయన తనయుడు లోకేశ్ మంగళగిరిలో గెలిచారు.
- చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ హిందూపురంలో విజయం సాధించారు. బాలకృష్ణ మరో అల్లుడు ఎం.శ్రీభరత్ విశాఖ ఎంపీగా గెలిచారు.
- రాజంపేట లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి కిరణ్కుమార్ రెడ్డి ఓడిపోయారు. ఆయన సోదరుడు కిశోర్కుమార్రెడ్డి పీలేరులో తెదేపా నుంచి గెలిచారు.
- టెక్కలిలో కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్నాయుడు విజయం సాధించారు. వాళ్లిద్దరూ బాబాయ్, అబ్బాయ్ అవుతారు.
- అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి తనయుడు జేసీ అస్మిత్రెడ్డి తాడిపత్రి నుంచి గెలిచారు. శ్రీసత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి కోడలు సింధూరరెడ్డి పుట్టపర్తి నుంచి గెలిచారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నుంచి మాజీమంత్రి రామచంద్రారెడ్డి వారసురాలు సవిత గెలిచారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం నుంచి పోటీచేసిన కృష్ణచైతన్యరెడ్డి గెలిచారు. ఈయన తండ్రి పుత్తా నరసింహారెడ్డి తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు.
- డోన్ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి గెలిచారు. ఈయన తండ్రి కోట్ల విజయభాస్కర్రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియ రెండోసారి గెలిచారు. ఈమె తల్లిదండ్రులిద్దరూ ప్రజాప్రతినిధులే. కర్నూలు తెదేపా అభ్యర్థి భరత్ గెలిచారు. ఈయన టీజీ వెంకటేశ్ కుమారుడు. ఎమ్మిగనూరు నుంచి నాగేశ్వరరెడ్డి తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొందారు. ఈయన తండ్రి దివంగత నేత బీవీ మోహన్రెడ్డి.
- విజయనగరంలో కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్గపతిరాజు కుమార్తె పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు తెదేపా తరఫున గెలిచారు.
- రాజమహేంద్రవరం అర్బన్ తెదేపా అభ్యర్థిగా గెలిచిన వాసు.. మాజీ ఎమ్మెల్యే భవాని భర్త.
- అమలాపురం తెదేపా అభ్యర్థిగా గెలిచిన గంటి హరీష్ మాథుర్ దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు
- తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తనయుడు కుమారరాజా పామర్రులో గెలిచారు.
- శింగనమల నుంచి తెదేపా నేత బండారు నారాయణస్వామి మనవరాలు బండారు శ్రావణిశ్రీ తెదేపా తరఫున పోటీచేసి గెలిచారు.
- బొబ్బిలిలో ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు (బేబినాయన) తెదేపా నుంచి గెలిచారు. ఈయన మాజీమంత్రి సుజయ్కృష్ణ రంగారావు సోదరుడు.
- శ్రీకాకుళం జిల్లా పలాసలో తెదేపా తరఫున సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష పోటీచేసి.. మంత్రి సీదిరి అప్పలరాజుపై గెలిచారు.
- సూళ్లూరుపేటలో మాజీమంత్రి నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె నెలవల విజయశ్రీ తెదేపా అభ్యర్థిగా పోటీచేసి కిలివేటి సంజీవయ్యపై గెలిచారు.
- శ్రీకాళహస్తి నుంచి మాజీ మంత్రి, దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల వెంకట సుధీర్రెడ్డి తెదేపా తరఫున గెలిచారు.
- మచిలీపట్నంలో తెదేపా నేత కొల్లు రవీంద్రపై మాజీమంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టూ) పోటీచేసి ఓడిపోయారు.
- చీరాలలో వైకాపా తరఫున ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్ పోటీచేసి ఓడిపోయారు. ఇక్కడ గెలిచిన మాలకొండయ్య... సినీహీరో నిఖిల్కు మామ.
- తాడిపత్రి, ధర్మవరం స్థానాల నుంచి పోటీచేసిన బాబాయ్.. అబ్బాయిలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓడారు.
- గంగాధరనెల్లూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి ఓటమి చవిచూశారు.
ముగ్గురు వియ్యంకుల గెలుపు
భీమిలి, నెల్లూరు నియోజకవర్గాల నుంచి గెలుపొందిన మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ వియ్యంకులు. భీమవరం నుంచి గెలుపొందిన పులపర్తి రామాంజనేయులు కూడా గంటా వియ్యంకుడే.
జగన్, అవినాష్రెడ్డి గెలుపు
పులివెందుల అసెంబ్లీ నుంచి జగన్, ఆయన సోదరుడు వైఎస్ అవినాష్రెడ్డి కడప లోక్సభ నుంచి గెలిచారు. జగన్ మేనమామ పి.రవీంద్రనాధ్రెడ్డి కమలాపురం అసెంబ్లీ, సోదరి షర్మిల కాంగ్రెస్ తరఫున కడప లోక్సభ నుంచి పోటీచేసి ఓడారు.
కుమారుడు ఎంపీ... తండ్రి ఎమ్మెల్యే
కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ స్థానం నుంచి పుట్టా సుధాకర్యాదవ్, ఆయన కుమారుడు మహేశ్ యాదవ్ ఏలూరు లోక్సభ స్థానం నుంచి తెదేపా అభ్యర్థులుగా గెలిచారు.
పెద్దిరెడ్డి కుటుంబసభ్యుల విజయం
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 6,905 ఓట్ల తేడాతో పుంగనూరులో గెలిచారు ఆయన సోదరుడు ద్వారకానాథ్రెడ్డి తంబళ్లపల్లెలో, తనయుడు మిథున్రెడ్డి రాజంపేట లోక్సభస్థానంలో గెలిచారు.
తండ్రీ కుమారుల ఓటమి
తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు ఎంపీ స్థానంలో ఆయన కుమారుడు సునీల్కుమార్ వైకాపా నుంచి పోటీచేసి ఓడారు.
ఒంగోలు వైకాపా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన కుమారుడు, చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి మోహిత్రెడ్డి ఓడిపోయారు.
తండ్రీ కుమార్తెల ఓటమి
ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి లోక్సభ స్థానంలోను, ఆయన కుమార్తె ఈర్లె అనురాధ మాడుగుల అసెంబ్లీ స్థానంలోను వైకాపా తరఫున ఓడిపోయారు.
సోదరుల ఓటమిబాట
అన్నదమ్ములైన ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్ ఇద్దరూ శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల్లో ఓడిపోయారు.
- మంత్రి ఆదిమూలపు సురేష్ కొండపిలోను, ఆయన సోదరుడ[ు సతీష్ కోడుమూరులోను పరాజయం పాలయ్యారు.
- మేకపాటి రాజగోపాలరెడ్డి ఉదయగిరి, ఈయన అన్న కుమారుడు మేకపాటి విక్రమ్రెడ్డి ఆత్మకూరు స్థానాల నుంచి పోటీచేసి ఓడారు.
బొత్స కుటుంబానికి లేదు బోణీ
మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం ఘోర పరాజయం పాలైంది. ఆయన చీపురుపల్లి, తమ్ముడు అప్పలనరసయ్య గజపతినగరం అసెంబ్లీ స్థానాల నుంచి ఓడారు. బొత్స ఝాన్సీలక్ష్మి విశాఖ లోక్సభ స్థానంలో ఓడారు. బొత్స మేనల్లుడు చిన్నశ్రీనుకు వియ్యంకుడైన బడ్డుకొండ అప్పలనాయుడు కూడా నెల్లిమర్లలో ఓడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
హామీల అమలుపై చిత్తశుద్ధి ఏదీ?
ప్రగతి పట్టని, సరైన దిశానిర్దేశం లేని, హామీల అమలుపై చిత్తశుద్ధి లేని బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
-
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
-
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
-
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి