నాడు శపథం.. నేడు విజయపథం
తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అంబటి రాంబాబు మాట్లాడటం, దానికి కొందరు వైకాపా సభ్యులు వంతపాడటం, సభా నాయకుడిగా వారించాల్సిన సీఎం జగన్ వెకిలి నవ్వులతో వారిని ప్రోత్సహించడంతో చంద్రబాబు ఆరోజు తీవ్ర మనస్తాపం చెందారు.
అసెంబ్లీలో నాడు చంద్రబాబుకు తీవ్ర అవమానం
భీషణ ప్రతిజ్ఞ నెరవేర్చుకొని.. సగర్వంగా సభలోకి!
ఇన్నేళ్లూ పరువు కోసం బతికాను. అలాంటిది ఈ రోజు సభలో నా భార్య ప్రస్తావన తెచ్చి అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. ఇలాంటి సభలో నేనుండను. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను. లేకపోతే నాకు రాజకీయాలే వద్దు. మీ అందరికీ ఓ నమస్కారం.’
2021 నవంబరు 19న శాసనసభలో చంద్రబాబు తీవ్ర అవమానభారంతో చేసిన భీషణ ప్రతిజ్ఞ ఇది. ఆ రోజు నుంచీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేదు. ప్రజాక్షేత్రంలోనే వైకాపాపై బదులు తీర్చుకుని, ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడుతున్నారు.
ఈనాడు, అమరావతి: తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అంబటి రాంబాబు మాట్లాడటం, దానికి కొందరు వైకాపా సభ్యులు వంతపాడటం, సభా నాయకుడిగా వారించాల్సిన సీఎం జగన్ వెకిలి నవ్వులతో వారిని ప్రోత్సహించడంతో చంద్రబాబు ఆరోజు తీవ్ర మనస్తాపం చెందారు. ‘నేను ఎమ్మెల్యేగా ఎనిమిదోసారి సభలో అడుగుపెట్టాను. 1978 నుంచి రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ మహానాయకులతో కలసి పనిచేశాను. విపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. రెండున్నరేళ్లుగా వ్యక్తిగతంగా, పార్టీపరంగా అవమానించినా ఎదుర్కొన్నాం. కానీ ఈరోజు నా కుటుంబం, భార్య ప్రస్తావన తెచ్చి, దానిపై నాకు మాట్లాడే అవకాశమివ్వకుండా మైక్ కట్ చేశాక.. ఈ సభలో నేనుండను’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి మళ్లీ ముఖ్యమంత్రయ్యాకే అసెంబ్లీకి వస్తానంటూ సభ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశానికి విషణ్ణ వదనంతో వచ్చిన బాబు.. పొంగుకొస్తున్న దుఃఖాన్ని అదిమి పెట్టుకుంటూ, గద్గదస్వరంతో మాట్లాడారు. ఓ దశలో దుఃఖాన్ని నియంత్రించుకోలేక వెక్కివెక్కి ఏడ్చారు. అంతకుముందు శాసనసభ ఆవరణలోని తన ఛాంబర్లోనూ ఆయన విలపించారు. ‘నా రాజకీయ జీవితంలో ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదు. ఎన్నో సంక్షోభాల్ని హ్యాండిల్ చేశాను. కానీ నా భార్య వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. రాజకీయాలతో సంబంధంలేని నా భార్యను అవమానిస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు నీచంగా మాట్లాడిన ఆ సభ, ఇక ఎంతమాత్రమూ గౌరవ సభ కాదు. అలాంటి కౌరవ సభకు వెళ్లబోన’ని ప్రతినబూనారు. చంద్రబాబు ఉద్వేగాన్ని చూసిన సహచర ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులూ చలించిపోయారు.
ఉండవల్లిలోని నివాసంలో మనవడితో కేక్ కోయిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు. చిత్రంలో వసుంధర, బ్రాహ్మణి, లోకేశ్, భువనేశ్వరి, లోకేశ్వరి
గతంలోనూ ఉమ్మడి ఏపీ, తమిళనాడుల్లో ఇవే దారుణాలు
గతంలో ఎన్టీఆర్, జయలలిత, ఎంజీ రామచంద్రన్ కూడా అసెంబ్లీలో అవమానాలు ఎదుర్కొని మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతామని శపథం చేశారు. చెప్పినట్టుగానే ముఖ్యమంత్రులయ్యాకే అసెంబ్లీ గడప తొక్కారు. 1993 ఆగస్టులో నాటి జమ్మలమడుగు తెదేపా ఎమ్మెల్యే శివారెడ్డిని ప్రత్యర్థులు హత్యచేశారు. దానిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేతగా ఎన్టీఆర్ శాసనసభలో డిమాండ్ చేశారు. నాటి సీఎం కోట్ల విజయభాస్కర్రెడ్డి నిరాకరించడంతో ఎన్టీఆర్ మినహా మిగతా ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. సీట్లోంచి ఎన్టీఆర్ కదలకపోయినా, ఆయనతో సహా తెదేపా ఎమ్మెల్యేలందరినీ సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఆగ్రహించిన ఎన్టీఆర్.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం సభలో అడుగు పెట్టనని ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారు. 1994 ఎన్నికల్లో మళ్లీ గెలిచి ముఖ్యమంత్రిగా సభలో ప్రవేశించారు.
- 1989 మార్చి 25న తమిళనాడు శాసనసభలో అధికార డీఎంకే సభ్యులు ప్రతిపక్ష నేత జయలలిత చీర లాగారు. అవమానానికి గురైన జయలలిత.. సీఎంగానే సభలో అడుగుపెడతానని ప్రతిజ్ఞ చేసి బయటకు వెళ్లారు. 1991లో గెలిచాక సీఎంగా సభలో అడుగుపెట్టారు.
- 1972లో అసెంబ్లీలో డీఎంకే సభ్యులు తనను తీవ్రంగా అవమానించడంతో ఎంజీ రామచంద్రన్ సభకు రానని ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారు. ‘అసెంబ్లీ మరణించింది’ అని ఆనాడు వ్యాఖ్యానించారు. 1977లో మళ్లీ సీఎంగా సభలో అడుగు పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
హామీల అమలుపై చిత్తశుద్ధి ఏదీ?
ప్రగతి పట్టని, సరైన దిశానిర్దేశం లేని, హామీల అమలుపై చిత్తశుద్ధి లేని బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు.