జవాబుదారీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం
జనసేనకు ఇచ్చిన ఈ చరిత్రాత్మక విజయం తనపై మరింత బాధ్యత పెంచిందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తాము ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం.. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పేర్కొన్నారు.
ఆకాశమంత విజయాన్నిచ్చారు
భవిష్యత్తుకు పునాదులు వేసే సమయమిది
జనసేన గెలుపు 5 కోట్ల ప్రజల ఆకాంక్ష
పోటీ చేసిన స్థానాలన్నింటిలోనూ గెలిచి దేశంలోనే జనసేన రికార్డు
పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉద్ఘాటన
ఈనాడు డిజిటల్, అమరావతి: జనసేనకు ఇచ్చిన ఈ చరిత్రాత్మక విజయం తనపై మరింత బాధ్యత పెంచిందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తాము ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం.. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పేర్కొన్నారు. ఎన్డీయే అఖండ విజయం సాధించిన తర్వాత మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ‘జగన్, వైకాపా నాయకులతో నాకు వ్యక్తిగత శతృత్వం లేదు. వారిని హింసించడం కోసం నాకు ప్రజలు ఈ విజయాన్నివ్వలేదు. ఇది పార్టీ శ్రేణులంతా గుర్తుంచుకోవాలి. 5 కోట్ల ప్రజల భవిష్యత్తుకు పునాదులు వేసే సమయమిది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి మనం అన్ని విధాలుగా నలుగుతూనే ఉన్నాం. ఇక ఆ రోజులకు ముగింపు పలుకుతాం. భవిష్యత్తు తరాల కోసం పనిచేస్తాం’ అని పునరుద్ఘాటించారు.
‘తొలిప్రేమ’ తర్వాత ఇదే నా విజయం
‘నా జీవితంలో సినీరంగంలో ‘తొలిప్రేమ’ తర్వాత ఇదే నా విజయం. నాకు గెలుపు అంతగా తెలియదు. నా జీవితం ఎన్నో దెబ్బలు తింటూ, మాటలు పడుతూ గడిచింది. ఈ రోజు మీరు నన్ను గుండెల్లో పెట్టుకుని జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్ని గెలిపించారు. దేశంలో ఇది మరెవ్వరికీ సాధ్యపడలేదు. ఈ విజయం జనసేనది కాదు.. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష. రైతన్నకు అండగా నిలబడతాం. ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తాం’ అని పేర్కొన్నారు. ఐదేళ్ల అరాచక పాలన నుంచి ప్రజలు మార్పు కోరుకున్నారన్నారు.
అన్ని స్థానాలూ గెలిచినంత బాధ్యత నాపై ఉంది
‘పోటీ చేసింది తక్కువ స్థానాలే అయినా.. రాష్ట్రంలో అన్ని స్థానాలు గెలిస్తే ఎంత బాధ్యత ఉంటుందో అంత బాధ్యత నాపై ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతల్ని పటిష్ఠపరుస్తాం. వ్యవస్థలపై రాజకీయ ప్రమేయం తక్కువ ఉండేలా చేస్తాం. అధికారులకు స్వేచ్ఛ ఇస్తాం. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదు నేను. ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇచ్చిన సీపీఎస్ హామీని తప్పకుండా నెరవేరుస్తా. మెగా డీఎస్సీ విడుదల చేస్తాం. యువత నైపుణ్యాలకు తగిన ఉపాధి కల్పించే బాధ్యత నాది’ అని తెలిపారు.
ఇల్లు అలకగానే పండగ కాదు
‘డబ్బు, పేరు కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. ఎవరూ లేని వారికి అండగా ఉండటానికే నేను రాజకీయాల్లోకి వచ్చా. 2019 ఎన్నికల్లో నేను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడినప్పుడు, ఇప్పుడు పార్టీ అన్ని స్థానాలు గెలిచినప్పుడూ నా మానసిక స్థితిలో మార్పు లేదు. అంతే ధైర్యంతో ఉన్నా. ఈ గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది. అహంకారం కాదు. గెలవగానే అందరూ అభినందనలు చెబుతున్నారు.. ఇల్లు అలకగానే పండగ కాదు. పనిచేయడంలో చూపిస్తాం. ధర్మో రక్షతి.. రక్షితః అనే సూక్తిని నేను బలంగా నమ్ముతా. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గెలిపించింది నన్ను కాదు.. 5 కోట్ల మంది ఆంధ్రుల్ని గెలిపించారు. అందరికీ కృతజ్ఞతలు. తెదేపా నేత వర్మకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్డీయేకు ఆకాశమంత విజయాన్నిచ్చారు. మీ ఇంట్లో ఒకడిగా ఉంటూ పని చేస్తా’ అని పవన్ హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.