ఎన్డీయేలో చంద్రబాబు, నీతీశ్లే కీలకం!
కేంద్రంలో భాజపా నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే కూటమిలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జేడీయూ అగ్రనేత నీతీశ్కుమార్లు కీలకం కానున్నారు.
ఈనాడు, దిల్లీ: కేంద్రంలో భాజపా నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే కూటమిలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జేడీయూ అగ్రనేత నీతీశ్కుమార్లు కీలకం కానున్నారు. భాజపా ఈ ఎన్నికల్లో సొంతంగా 272 మెజార్టీ మార్కు దాటే పరిస్థితి లేనందున కూటమిలో అతి పెద్ద పార్టీలైన తెదేపా, జేడీయూలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. ఇది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్కు మేలుచేసే అవకాశం ఉంది. చంద్రబాబు, నీతీశ్లు గతంలో ఎన్డీయే భాగస్వాములుగా ఉన్నా రాజకీయ వైరుద్ధ్యాల కారణంగా బయటికి వచ్చి ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందే తిరిగి కలిశారు. బిహార్లో భాజపాది పెద్దన్న పాత్ర అయితే, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఆ స్థానంలో ఉంది. అయినప్పటికీ పరస్పర అవగాహనతో ఆయాపార్టీలకు స్థానికంగా ఉన్న బలాబలాల ఆధారంగా సీట్లు సర్దుబాటుచేసుకొని ఎన్నికల గోదాలో దిగాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో తెదేపా, భాజపా రెండూ లాభపడగా, బిహార్లోనూ అదే పరిస్థితి. ప్రస్తుతం ఎన్డీయేలో భాజపా తర్వాత అతి పెద్ద పార్టీలుగా 16 సీట్లతో తెలుగుదేశం, 12 సీట్లతో జేడీయూలు నిలిచాయి. భవిష్యత్తులో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం సుస్థిరంగా సాగాలంటే వీరి మద్దతు అవసరం. ఈ రాజకీయబలాన్ని ఉపయోగించుకొని వారు తమ సొంత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వపరంగా మేలు చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది.
నాడు వాజ్పేయీ హయాంలోనూ.
1999లో వాజ్పేయీ నేతృత్వంలో తొలిసారి ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వంలోనూ చంద్రబాబునాయుడు కీలకపాత్ర పోషించారు. ఆ సమయంలో ఆయన తన రాజకీయపలుకుబడిని ఉపయోగించి హైదరాబాద్కు అంతర్జాతీయ విమానాశ్రయం, ఎంఎంటీస్, హైవేలు తీసుకురాగలిగారు. గత అయిదేళ్ల జగన్ పాలనలో అభివృద్ధికి దూరమైన ఆంధ్రప్రదేశ్ను సరిదిద్దడానికి, పోలవరం, అమరావతిలాంటి ప్రాజెక్టులు పూర్తిచేయడానికి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు చంద్రబాబునాయుడికి ఉపయోగపడే అవకాశం ఉంది. 2014 నుంచి 2018 వరకు ఆయన ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటంవల్లే విభజన చట్టంలోని జాతీయ విద్యాసంస్థలు, పోలవరం నిర్మాణాన్ని కొంతవరకు ముందుకు తీసుకెళ్లగలిగారు. 1999లో వాజ్పేయీ హయాంలో తెదేపా ఎన్డీయే భాగస్వామిగా ఉన్నప్పటికీ మంత్రివర్గంలో చేరలేదు. 2014లో మాత్రం పార్టీ సీనియర్ నేతలు అశోక్గజపతిరాజు, సుజనాచౌదరిలకు మంత్రివర్గంలో చేరారు. ప్రత్యేకహోదా అంశంలో విభేదించి 2018 మార్చిలో ఎన్డీయే కూటమి నుంచి బయటికొచ్చినప్పుడు రాజీనామా చేశారు తప్పితే అప్పటివరకు వారిద్దరూ కేంద్రంలో సఖ్యతతో పనిచేశారు.
రాష్ట్రానికి మేలు
మోదీ ప్రభుత్వంలో అశోక్గజపతిరాజు పౌరవిమానయానశాఖ మంత్రిగా ఉన్నప్పుడే భోగాపురం విమానాశ్రయానికి పర్యావరణ అనుమతులు వచ్చాయి. కర్నూలు ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తయింది. విజయవాడ ఎయిర్పోర్టు, తిరుపతి ఎయిర్పోర్టుల విస్తరణ పనులు మొదలయ్యాయి. ఆర్సీఎస్ ఉడాన్ పథకం కింద కర్నూలు, కడప విమానాశ్రయాల నుంచి రాకపోకలు మొదలయ్యాయి. మరోవైపు సుజనాచౌదరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తూ విభజన చట్టంలో చెప్పిన కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల ఏర్పాటు, నిధుల విడుదల తదితర వ్యవహారాలు చూశారు. ప్రత్యేకహోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉండటంతో అమరావతి, గుంటూరు, విజయవాడల అభివృద్దికి కేంద్రపట్టణాభివృద్ధిశాఖ ద్వారా సుమారు రూ.2,500 కోట్లు విడుదల చేశారు. కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలను స్మార్ట్సిటీలుగా ప్రకటించి నిధులు విడుదల చేయించారు. ఒక్క ప్రత్యేక హోదా అంశం మినహాయిస్తే మిగిలిన పనులు 2014-18 మధ్యకాలంలో కొంత వేగంగానే సాగాయి. కానీ గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకంటే ఎక్కువగా వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో కొత్త ప్రాజెక్టులేవీ రాలేదు. ఇప్పుడు చంద్రబాబునాయుడు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను ఆలంబనగా చేసుకొని ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయడంతోపాటు, కొత్త వాటిని రాష్ట్రానికి తీసుకురావడానికి ఎక్కువ అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం