సరైన సమయంలో.. సరైన నిర్ణయం
వైకాపా మునుగుతున్న నావ అని గమనించి కొందరు.. తమ సిటింగ్ స్థానాల్లో టికెట్ ఇవ్వకుండా అవమానించారని ఇంకొందరు.. జగన్ నియంతృత్వ ధోరణిని వ్యతిరేకించి మరికొందరు ఆ పార్టీని వీడి, వేరే పార్టీల్లో చేరారు.
వైకాపాలో ఇమడలేక తెదేపా, జనసేనల్లో చేరిక
విజయబావుటా ఎగరేసిన నాయకులు
ఈనాడు, అమరావతి: వైకాపా మునుగుతున్న నావ అని గమనించి కొందరు.. తమ సిటింగ్ స్థానాల్లో టికెట్ ఇవ్వకుండా అవమానించారని ఇంకొందరు.. జగన్ నియంతృత్వ ధోరణిని వ్యతిరేకించి మరికొందరు ఆ పార్టీని వీడి, వేరే పార్టీల్లో చేరారు. ఆ నిర్ణయమే వారిని ఇప్పుడు విజయతీరాలకు చేర్చింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని అనిపించేలా చేసింది. వైకాపా నుంచి తెదేపాలో చేరిన మంత్రి, కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనంతపురం జిల్లాలోని గుంతకల్లు నుంచి పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి (నెల్లూరు జిల్లా ఆత్మకూరు), మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (నెల్లూరు గ్రామీణ) ఇప్పుడు తెదేపాలో చేరి, విజయభేరి మోగించారు. ఆనం వైకాపాలో ఎమ్మెల్యే ఉండగానే అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా నేదురుమల్లి రామ్కుమార్రెడ్డిని నియమించారు. ఆయన రాజ్యాంగేతర శక్తిగా నియోజకవర్గంలో అధికారాన్ని చలాయించారు. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆనం ముఖ్యమంత్రి జగన్ను కలిసి మాట్లాడినా, జిల్లాకు వచ్చినప్పుడు వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి స్పందనా లేకపోయింది. ప్రశ్నించినందుకు ఆయన్ను వేధించారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం, అభివృద్ధి గురించి అడిగారని కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయించి ఆయన్ను బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నించారు. కోటంరెడ్డి, ఆనం తిరగబడ్డారని వారిపై అనర్హత వేటు వేయించారు.
సిటింగ్ స్థానాన్ని కాదని..
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్దన్నారని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సత్యవేడులో సిటింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు జగన్ టికెట్ నిరాకరించారు. పొగబెట్టేందుకు మొదట తిరుపతి లోక్సభ స్థానానికి మార్చారు. ఆయన ససేమిరా అన్నారు. దీంతో సత్యవేడులో కొత్త అభ్యర్థిని ప్రకటించేశారు. అవమానభారంతో ఆదిమూలం తెదేపాలో చేరి, ఇప్పుడు అదే సత్యవేడులో మళ్లీ గెలిచారు. ఆదిమూలం గెలవలేరనే మారుస్తున్నామని జగన్ అంటే.. ఆయన తెదేపాలో చేరి అక్కడే గెలిచి చూపించారు. మాజీ మంత్రి, బీసీ నేత కొలుసు పార్థసారథికి మంత్రి పదవినివ్వకుండా, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించకుండా, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా జగన్ అవమానించారు. ‘పెనమలూరు ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. మా నాయకుడు జగన్కే నా మీద ప్రేమ లేదు’ అని పార్థసారథి వాపోయారు. అవమానభారంతో వైకాపాను వీడి తెదేపాలో చేరారు. మైలవరం నియోజకవర్గంలో సామాజిక మాధ్యమాల్లో తనపై సొంత పార్టీ నేతలతోనే దుష్ప్రచారం చేయించడాన్ని ప్రశ్నించిన వసంత వెంకట కృష్ణప్రసాద్కూ తర్వాత వేధింపులు తప్పలేదు. దీంతో ఆయనా తెదేపాలో చేరారు. పార్థసారథి నూజివీడులో, మిగిలినవారు సొంత నియోజకవర్గాల్లో ఇప్పుడు తెదేపా తరఫున విజయభేరి మోగించారు. 2019లో వైకాపా తరఫున గన్నవరంలో పోటీ చేసి, తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీ చేతిలో ఓటమి చెందిన యార్లగడ్డ వెంకట్రావు తర్వాత కూడా అదే నియోజకవర్గంలో వైకాపా బాధ్యుడిగా పని చేశారు. ఎమ్మెల్యే వంశీ వైకాపా పంచన చేరడంతో ఈసారి ఆ పార్టీ టికెట్ ఆయనకే దక్కింది. ఇన్నాళ్లూ వ్యయప్రయాసలకోర్చి పార్టీని కాపాడుకున్న తనను మోసం చేశారని వెంకట్రావు వైకాపాను వీడి, తెదేపాలో చేరారు. వంశీపై గెలిచి, ప్రతీకారం తీర్చుకున్నారు.
ఎంపీలు కూడా..
వైకాపా నుంచి తెదేపాలో చేరిన ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసరావుపేట), మాగుంట శ్రీనివాసులురెడ్డి (ఒంగోలు) ఇప్పుడు అవే స్థానాల్లో తెదేపా అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు. మరో వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆ పార్టీకి రాజీనామా చేసి తెదేపాలో చేరారు. ఇప్పుడు ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. వైకాపా రాజ్యసభ మాజీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కూడా పార్టీలో తనకు పొగబెడుతున్నారని, తెదేపాలో చేరారు. ఈ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా సైకిల్ గుర్తుపై గెలిచారు.
కూటమిని వీడి..పరాజయం పాలై
మరోవైపు విజయవాడ తెదేపా ఎంపీ కేశినేని నాని ఎన్నికల ముందు వైకాపాలో చేరారు. ఇప్పుడు అదే స్థానం నుంచి వైకాపా తరఫున పోటీ చేసి కూటమి అభ్యర్థి, సొంత తమ్ముడు కేశినేని శివనాథ్ చేతిలో పరాజయం పాలయ్యారు.
వైఎస్ కుటుంబ సన్నిహితుడైనా..
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. వారింటి మనిషిగా ఉంటారు. అలాంటి నాయకుడికీ వైకాపాలో అవమానాలు తప్పలేదు. ప్రతిపక్ష నేతలను తిట్టాలని చెప్పడమే కాకుండా. ఎప్పుడు కలిసినా ఏం తిట్టడం లేదు, లెక్క చూస్తున్నానని జగన్ తనను హెచ్చరించారని బాలశౌరి వాపోయేవారు. తెలంగాణ ముఖ్యమంత్రి దిల్లీలో ఒకసారి అందరు ఎంపీలకు విందునివ్వగా తమ అనుమతి లేకుండా ఆ విందుకు హాజరయ్యారని బాలశౌరిపై జగన్ మండిపడ్డారు. మరోవైపు ఆయన సిటింగ్ సీటును మరొకరికి ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారు. అలాంటి పరిస్థితుల్లో వైకాపాలో కొనసాగలేక బయటకొచ్చిన బాలశౌరి జనసేనలో చేరి మచిలీపట్నం నుంచి మళ్లీ గెలిచారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కూడా సిటింగ్ సీటు ఇవ్వకుండా అవమానించడంతో జనసేనలో చేరారు. తిరుపతి నుంచి జనసేన తరఫున భారీ మెజారిటీతో విజయ ఢంకా మోగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం