నల్గొండ గడ్డ.. కాంగ్రెస్ అడ్డా
బలమైన నాయకత్వం..క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, రెండు లోక్సభ స్థానాల పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను పన్నెండింటిలో పార్టీ ఎమ్మెల్యేలే ఉండటం..వెరసి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ సిటింగ్ స్థానాలను అధికార కాంగ్రెస్ నిలబెట్టుకుంది.
ఉమ్మడి జిల్లాలో పట్టు నిలుపుకొన్న అధికార పార్టీ
ఉత్తమ్, కోమటిరెడ్డి సోదరుల అండ
నల్గొండ, భువనగిరి సిటింగ్ స్థానాలు కైవసం
గణనీయంగా తగ్గిన భారాస ఓట్లు
నల్గొండ ఎంపీగా గెలుపొందినట్లు రఘువీర్కు గుర్తింపు పత్రాన్ని అందిస్తున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన.
చిత్రంలో ఎమ్మెల్యేలు బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి
ఈనాడు, నల్గొండ: బలమైన నాయకత్వం..క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, రెండు లోక్సభ స్థానాల పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను పన్నెండింటిలో పార్టీ ఎమ్మెల్యేలే ఉండటం..వెరసి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ సిటింగ్ స్థానాలను అధికార కాంగ్రెస్ నిలబెట్టుకుంది. నల్గొండలో ఉత్తమ్, కోమటిరెడ్డితోపాటు సీనియర్ నేత జానారెడ్డి ప్రచారాన్ని ముందుండి నడిపించగా.. భువనగిరిలో రాజగోపాల్రెడ్డి అంతా తానై స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో పార్టీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నలుగురు నేతలు నియోజకవర్గాల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయడంతోపాటు సమీక్షలు నిర్వహించి క్షేత్రస్థాయి ప్రచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఇతర పార్టీల నుంచి కీలక నేతలను చేర్చుకుంటూనే.. ఎప్పటికప్పుడు కార్యకర్తలను గెలుపు వైపు కార్యోన్ముఖులను చేశారు. ఫలితంగా నల్గొండలో 60.5 శాతం ఓట్లు సాధించడం ద్వారా 5.59 లక్షల మెజారిటీతో కుందూరు రఘువీర్ గెలుపొందగా..భువనగిరిలో 2.22 లక్షలకు పైగా మెజార్టీతో చామల కిరణ్కుమార్రెడ్డి విజయం సాధించారు. 2009 నుంచి నల్గొండలో వరుసగా నాలుగోసారి కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించగా, 2008లో ఏర్పాటైన భువనగిరిలో కాంగ్రెస్ మూడోసారి గెలుపొందడం ద్వారా నల్గొండ గడ్డ కాంగ్రెస్కు అడ్డా అని మరోసారి నిరూపితమైంది. గతంలో నల్గొండ, భువనగిరి స్థానాల నుంచి ప్రస్తుత మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
నాయకుల సమన్వయం.. జానారెడ్డి చాతుర్యం
ఎన్నికలకు ముందే నల్గొండ స్థానానికి మంత్రి ఉత్తమ్, భువనగిరికి మంత్రి వెంకట్రెడ్డిలను ఏఐసీసీ ఇన్ఛార్జులుగా నియమించింది. అనంతరం భువనగిరికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డికి సమన్వయ బాధ్యతలు అప్పగించింది. బలమైన నాయకులున్నా..అంతర్గత విభేదాలతో రచ్చకెక్కే ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలను ఈ ఎన్నికల్లో సమన్వయం చేసే బాధ్యతలను సీనియర్ నేత జానారెడ్డి భుజాన వేసుకున్నారు. రెండింటిలోనూ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచే ముమ్మర ప్రచారం నిర్వహించింది. భువనగిరి పరిధిలో సీఎం రేవంత్రెడ్డి రోడ్షోతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇవన్నీ సత్ఫలితాలనిచ్చాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు కలిపి కాంగ్రెస్కు 7,66,069 ఓట్లు రాగా, ప్రస్తుతం రఘువీర్కు 7,84,337 ఓట్లు వచ్చాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో సూర్యాపేట మినహా అన్ని అసెంబ్లీ స్థానాల్లో భారాస అభ్యర్థులు ఓట్ల పరంగా రెండో స్థానం దక్కించుకోగా, భాజపా అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ప్రస్తుతం భారాస ఓట్లు గణనీయంగా తగ్గిపోగా, భాజపా ఇప్పుడు రెండో స్థానంలోకి రావడం గమనార్హం.
కలిసి పనిచేశాం.. రికార్డు మెజార్టీ సాధించాం
మంత్రి కోమటిరెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి
నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్టుడే: కలిసి పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. నల్గొండ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ను 5,59,905 ఓట్ల మెజార్టీతో, భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిని 2,22,170 ఓట్ల మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. నల్గొండలోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద వారిరువురూ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యేలందరూ సమష్టిగా పనిచేసి అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించారన్నారు. దేశవ్యాప్తంగా అత్యధిక మెజార్టీ సాధించిన అతి తక్కువ మందిలో రఘువీర్ ఉండటం నల్గొండకే గర్వకారణమన్నారు. కాంగ్రెస్తో కలిసి వచ్చిన పార్టీల సహకారమూ అభ్యర్థులకు కలిసివచ్చిందన్నారు. అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. రఘువీర్ మాట్లాడుతూ.. తన విజయం కాంగ్రెస్ శ్రేణులందరి విజయంగా అభివర్ణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి