పవన్ శక్తి... వర్మ యుక్తి
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ను పిఠాపురంలో ఎలాగైనా ఓడించాలని జగన్ కంకణం కట్టుకున్నా... అందుకు దీటైన వ్యూహంతో జనసేనాధిపతి విజయం సాధించారు.
లోకల్ ఎజెండాతో ఆకట్టుకున్న జనసేన అధినేత
పిఠాపురంలో కలిసి కదిలిన మూడు పార్టీలు
ఈనాడు, కాకినాడ: జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ను పిఠాపురంలో ఎలాగైనా ఓడించాలని జగన్ కంకణం కట్టుకున్నా... అందుకు దీటైన వ్యూహంతో జనసేనాధిపతి విజయం సాధించారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయమై మొదటి నుంచి సస్పెన్స్ కొనసాగింది. చివరకు దత్తాత్రేయ జన్మస్థలమైన పిఠాపురాన్ని ఆయన ఎంచుకున్నారు. అక్కడ తెదేపా అభ్యర్థిత్వం ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ అప్పటికే పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దాంతో సాక్షాత్తూ తెదేపా అధినేత చంద్రబాబు జోక్యం చేసుకుని వర్మతో మాట్లాడి ఒప్పించారు. పిఠాపురం నియోజకవర్గ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న వర్మ... పవన్కల్యాణ్ తరఫున ప్రచారంతోపాటు పోలింగు నిర్వహణలోనూ కీలకపాత్ర పోషించారు. జనసేన, తెదేపా, భాజపా శ్రేణులు ఒక్కటై పనిచేయడం, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగడంతోపాటు సామాజిక సమీకరణాలూ కలిసి రావడంతో పవన్కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం అందుకున్నారు.
అక్కడే మకాం... జనంతో మమేకం
ఎన్నికల షెడ్యూలు వచ్చిన తర్వాత పవన్కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోనే మకాం చేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో గృహ ప్రవేశం చేసి, అక్కడి నుంచే కార్యకలాపాలు సాగించారు. ఈ నివాసంలోనే ఉగాది వేడుకలనూ జరుపుకొన్నారు. అక్కడి నుంచే రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ప్రచారానికి వెళ్లి వచ్చారు. మధ్యలో రోడ్షోలతో ప్రజలతో మమేకమవుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు. స్థానిక ఎజెండాతో జనం ముందుకొచ్చారు. పిఠాపురం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని, ఉప్పాడను ఏళ్లుగా వేధిస్తున్న సముద్రం కోత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చారు. ప్రతి మండలంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని, ఏలేరు, సుద్దగడ్డ జలాశయాలను ఆధునీకరిస్తామని, పిఠాపురాన్ని సీడ్ హబ్గా మార్చడంతోపాటు సెరీ, హర్టీకల్చర్ రైతులను ఆదుకుంటామన్నారు. పట్టు రైతులకు ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు. రైతులను రోడ్డున పడేసిన ఎస్ఈజెడ్లో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. గొల్లప్రోలు సంతను అభివృద్ధి చేస్తానన్నారు. ఇలా పలు హామీలతో కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకు చేరువయ్యారు. నియోజకవర్గంలోని రెండు పట్టణాలు, 52 గ్రామాల ప్రజలకు చేరువయ్యేలా రోడ్షోలు, బహిరంగ సభలు నిర్వహించారు.
వర్మ కుటుంబ సభ్యులకూ ప్రాధాన్యం
మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్కల్యాణ్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. ప్రతి పర్యటనలోనూ ఇద్దరూ కలిసే పాల్గొనడంతో రెండు పార్టీల శ్రేణుల మధ్య సమన్వయం సాధ్యపడింది. పవన్కల్యాణ్ సైతం వర్మతోపాటు ఆయన కుటుంబ సభ్యులకూ అత్యంత ప్రాధాన్యమిచ్చారు. పిఠాపురంలో వర్మ ప్రాధాన్యాన్ని అడుగడుగునా ప్రస్తావించారు. జనసేన ప్రధాన కార్యదర్శి, పవన్ సోదరుడు కొణిదెల నాగబాబు సైతం ఇక్కడే మకాం చేసి అన్ని వ్యవహారాలూ స్వయంగా చూసుకున్నారు. మరోవైపు జగన్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. పవన్కల్యాణ్ను ఓడించే బాధ్యతలను మిథున్రెడ్డికి అప్పగించారు. మద్యం, డబ్బులతో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అన్ని ప్రాంతాలకు వైకాపా సీనియర్ నాయకులను ఇన్ఛార్జులుగా నియమించి, పర్యవేక్షించారు. ఆఖరికి చివరిరోజు వైకాపా అభ్యర్థి వంగా గీత గెలిస్తే ఉప ముఖ్యమంత్రిని చేస్తానని కూడా జగన్ ప్రకటించారు. ఇవేమీ పవన్కల్యాణ్ విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. నాగబాబు భార్య పద్మజ, కుమారుడు వరుణ్ తేజ్, మేనల్లుళ్లు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, జనసేన స్టార్ క్యాంపెయినర్లు జానీ మాస్టర్, హైపర్ ఆది, శ్రీను, జబర్దస్త్ టీం సభ్యులు ప్రచారంలో పాల్గొని జోష్ నింపారు. పవన్కల్యాణ్కు మద్దతుగా చిరంజీవి సతీమణి సురేఖ, తనయుడు రామ్చరణ్ పిఠాపురం రావడం శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!