గుబాళించని గులాబీ
లోక్సభ ఎన్నికల్లో భారాస పార్టీ పత్తా లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన భారాస.. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ప్రభావం చూపలేకపోయింది.
ఒక్క లోక్సభ సీటూ దక్కని భారాస
14 చోట్ల మూడో స్థానానికే పరిమితం
రెండు సీట్లలోనే రెండో స్థానం
అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు లోక్సభ స్థానాల్లో ఆధిక్యం..
ఇప్పుడు ఆ ఏడింటిలోనూ భాజపా విజయం
ఈనాడు - హైదరాబాద్
లోక్సభ ఎన్నికల్లో భారాస పార్టీ పత్తా లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన భారాస.. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ప్రభావం చూపలేకపోయింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి భారాస ఏ రౌండ్లోనూ ఆధిక్యం కనబర్చలేకపోయింది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఒక్క సీటునూ గెలుచుకోలేక చతికిలపడింది. కేవలం ఖమ్మం, మహబూబాబాద్లలో మాత్రమే రెండో స్థానం పొందింది. 14 సీట్లలో మూడో స్థానం, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో నాలుగో స్థానానికి పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తీవ్ర నైరాశ్యంలో ఉన్న భారాస పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడం పెద్ద ఎదురుదెబ్బే. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటును కూడా గెలుచుకోకపోవడం ఇదే తొలిసారి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ఓటమి పాలైనా.. కనీసం 39 స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదాలో నిలిచింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి.. స్థానాల పరిధిలో తన ఆధిక్యాన్ని చాటింది. లోక్సభ ఎన్నికల్లో ఈ ఏడు స్థానాల్లో కూడా ఉనికిని చాటుకోలేకపోయింది. అవన్నీ భాజపా గెలుచుకొంది. భారాసకు కంచుకోటగా భావించే మెదక్ పార్లమెంటు స్థానంలోనైనా గెలుస్తామని ఆశించినా.. అది కూడా భంగపాటే అయింది. ఈ ఎన్నికల్లో జాతీయస్థాయిలో కేసీఆర్ పాత్ర ఏమీ ఉండదనే భావనతో పార్టీ శ్రేణులు కూడా భారాస అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోలేదని అర్థమవుతోంది. కాంగ్రెస్, భాజపాలకు తామే బలమైన ప్రత్యామ్నాయమనే విశ్వాసాన్ని పార్టీ శ్రేణుల్లో నింపడంలో భారాస అధిష్ఠానం విఫలమైంది. పార్లమెంటులో ప్రశ్నించే తెలంగాణ గొంతుకను గెలిపించాలని ఆ పార్టీ చేసిన విజ్ఞప్తిని ప్రజలు తిరస్కరించారు.
ఆదిలోనే నీరుగారిన పోరు
పార్లమెంటు ఎన్నికల్లో భారాస మొదటి టికెట్ను సిటింగ్ ఎంపీ రంజిత్రెడ్డికి ప్రకటించారు. కానీ ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత వరంగల్ టికెట్ను అరూరి రమేశ్కు ఇస్తామంటే ఆయన వద్దని భాజపాలో చేరారు. కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు టికెట్ ఇస్తే.. ఆమె వెంటనే కాంగ్రెస్లో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పక్షాన సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా నిలబడ్డారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా బయటకు వెళ్లిపోతారనే ప్రచారం జోరుగా సాగడం పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేసింది. లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అభద్రతా భావం కొట్టుమిట్టాడింది. అధిష్ఠానం దీన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసినా అప్పటికే ఆలస్యమైంది. కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయం భారాసనే అనే విశ్వాసాన్ని.. పార్టీలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో పెంపొందించలేకపోయారు. దీంతో ఎన్నికల పోరు మొదలుకాకముందే భారాస పోటీలో లేకుండా పోయిందని విశ్లేషకులు చెబుతున్నారు.
కేసీఆర్ బస్సుయాత్ర చేసినా...
భారాసకు ఎంపీ సీట్లు ఇచ్చినా.. రాష్ట్రానికి ప్రత్యేకంగా లబ్ధి చేకూర్చేది ఏమీ లేదనే భావనతో ఓట్లు వేశారని తెలుస్తోంది. దీంతో జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే కాంగ్రెస్, భాజపాల వైపు మొగ్గుచూపారు. అసెంబ్లీ ఎన్నికలైన మూడున్నర నెలలకే పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో.. పార్టీని పునరుత్తేజం చేయడంలో భారాస అధిష్ఠానానికి తగినంత సమయం లభించలేదనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 16 రోజులపాటు కేసీఆర్ బస్సు యాత్రతో విస్తృత ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని స్థానాల్లో భారాస ఎమ్మెల్యేలు గెలిచినా.. పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు ‘కారు’కు బదులు కమలం వైపు మొగ్గు చూపారు.
పూర్తి పరాజయం ఇదే తొలిసారి
భారత రాష్ట్ర సమితి (నాటి తెరాస) పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా పార్లమెంటులో ప్రాతినిధ్యం కోల్పోయింది. 23 ఏళ్ల పార్టీ చరిత్రలో ఇంతటి పరాభవం ఎప్పుడూ చవిచూడలేదు. ఏ ఎన్నికల్లో పోటీ చేసినా సున్నా ఫలితాల వంటి చేదు అనుభవం ఎదురుకాలేదు. ఎంపీటీసీ మొదలు.. ఎంపీ వరకు ఏ ఎన్నికలు జరిగినా ఎంతో కొంత విజయమే దక్కింది తప్ప.. పూర్తి ఓటమి పొందిన చరిత్ర లేదు. లోక్సభ ఎన్నికలనే పరిగణనలోకి తీసుకుంటే..
- 2001లో ఆవిర్భవించిన తెరాస.. 2004 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో జట్టు కట్టి బరిలో దిగింది. ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేసి.. అయిదు చోట్ల విజయం సాధించింది. ఆనాడు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో గెలిచిన కేసీఆర్.. తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అదే స్థానంలో 2006, 2008 ఉప ఎన్నికలు రాగా.. రెండుసార్లూ ఆయన విజయం సాధించారు.
- 2009 లోక్సభ ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా.. తెరాస తొమ్మిది స్థానాల్లో పోటీ చేసి రెండింట గెలిచింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో 17 లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేసి 11 చోట్ల నెగ్గింది. ఆనాడు కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో.. మెదక్ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ గులాబీ పార్టీయే గెలిచింది.
- 2014లో వరంగల్ లోక్సభ సభ్యునిగా గెలిచిన కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో.. 2015లో జరిగిన ఉప ఎన్నికలోనూ ‘కారు’ జోరు చూపి విజయం సాధించింది.
- 2019 లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో పోటీ చేసి 9 చోట్ల గెలిచింది. తాజాగా 17 స్థానాల్లో ఒక్కటీ గెలవలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు