మూడు ముక్కలాటకు.. చావుదెబ్బ?
రాజధానిగా అమరావతికి మద్దతిస్తున్నామంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో డ్రామాలాడిన జగన్ను మూడు ప్రాంతాల ఓటర్లు చావుదెబ్బ కొట్టారు.
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కటీ గెలవని దుస్థితి
విశాఖ, కర్నూలు జిల్లాల్లోనూ తిరస్కరించిన ఓటర్లు
అక్కడ అసాధారణ మెజార్టీతో కూటమి అభ్యర్థుల విజయం
విశాఖలో శ్రీభరత్కు 5.04లక్షలు, గుంటూరులో పెమ్మసానికి 3.45లక్షల ఆధిక్యం
ఈనాడు, అమరావతి: రాజధానిగా అమరావతికి మద్దతిస్తున్నామంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో డ్రామాలాడిన జగన్ను మూడు ప్రాంతాల ఓటర్లు చావుదెబ్బ కొట్టారు. రాజధానికి భూములిచ్చిన రైతుల్ని వెంటాడి వేధించడమే కాకుండా.. న్యాయం అడిగిన మహిళలపై క్రూర చేష్టలతో, అసభ్యంగా తూలనాడి, మానసికంగా శారీరకంగా హింసించినందుకు ఫలితం ఏమిటో తెలియజెప్పారు. అమరావతి ప్రాంతంలోని ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 33 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కచోటా విజయం సాధించలేకపోయారు. విశాఖకు వచ్చేస్తున్నానంటూ మూడుముక్కలాట ఆడిన ఆయనకు.. మీ అవసరం లేదని అక్కడి ఓటర్లు తేల్చిచెప్పారు. కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన ఉమ్మడి విశాఖపట్నం, న్యాయరాజధానిగా ప్రకటించిన కర్నూలులోనూ జగన్ ప్రజల విశ్వసనీయత కోల్పోయారు. 151 స్థానాల్లో వైకాపా అభ్యర్థుల్ని గెలిపించి అధికారం అప్పగిస్తే.. దక్కినవాటితో సంతృప్తి పడకుండా దగాకోరు రాజకీయం చేశారు. తమకు ఎదురే లేదన్నట్లు అహంకారంతో వ్యవహరించారు. అందుకే.. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. విశాఖపట్నంలో లోక్సభ అభ్యర్థి శ్రీభరత్ 5.04 లక్షల భారీ మెజారిటీతో వైకాపాను మట్టికరిపించారు. అనకాపల్లి లోక్సభ స్థానంలో భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ 2.90 లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాజధాని ప్రాంతంలోని గుంటూరు లోక్సభ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ 3.45 లక్షల ఆధిక్యంతో గెలుపొందగా.. విజయవాడ నుంచి కేశినేని శివనాథ్(చిన్ని) 2.82 లక్షలు, నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు 1.60 లక్షల మెజార్టీతో గెలుపొందారు. కర్నూలు తెదేపా తరఫున లోక్సభకు పోటీచేసి గెలిచిన బస్తిపాటి నాగరాజు 1.11 లక్షల ఆధిక్యం సాధించారు.
రాజధాని రైతుల్ని వేధించి.. మహిళల్ని హింసించి..
ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మొత్తం 33 అసెంబ్లీ స్థానాలకు గాను.. గత ఎన్నికల్లో 30 అసెంబ్లీ స్థానాలు వైకాపాకు దక్కాయి. ఎన్నికల్లో గెలిచాక గుంటూరు పశ్చిమ నుంచి మద్దాళి గిరిధర్, గన్నవరం నుంచి వల్లభనేని వంశీమోహన్ వైకాపాలో చేరారు. విజయవాడ లోక్సభ స్థానం నుంచి గెలిచిన కేశినేని నాని 2024 ఎన్నికల ముందు వైకాపా తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ తరఫున బరిలో నిలిచారు. కానీ, అధికారంలోకి వచ్చాక రాజధాని ప్రాంతంలో సాగుతున్న అభివృద్ధి పనుల్ని జగన్ నిలిపేయించారు. శాసనరాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ నిరసనలకు దిగిన రాజధాని ప్రాంత రైతులపై ప్రభుత్వం పోలీసు బలగాల్ని ప్రయోగించి కుళ్లబొడిపించింది. ఇళ్లపై దాడులు చేయించి, అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెట్టింది. న్యాయం కోరుతున్న మహిళలపై లాఠీఛార్జి చేయించి.. వారిని అమానుషంగా హింసించింది. ఆందోళన చేస్తున్న రైతులు, ఇతర వర్గాల వారిని వాహనాల్లో ఎక్కించి ఎక్కడెక్కడో పోలీస్స్టేషన్లకు తరలించింది. ఎస్సీ, ఎస్టీ రైతులపైనే ఎస్సీ కేసులు పెట్టించారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల రైతులు, సాధారణ ప్రజలు ఎక్కడికక్కడే ఆందోళనలు చేయగా.. అధికారబలంతో ప్రభుత్వం వారిపై విరుచుకుపడింది. ఇవన్నీ రెండు జిల్లాల ప్రజల్లో తీవ్ర అసహనానికి కారణమయ్యాయి. ఐదేళ్లపాటు ప్రజలు వీటన్నింటినీ మౌనంగా భరించిన ప్రజలు.. రెండు జిల్లాల పరిధిలో వైకాపా ఉనికి లేకుండా తీర్పు ఇచ్చారు. 29 చోట్ల తెలుగుదేశం, రెండు చోట్ల జనసేన, రెండు చోట్ల భాజపా అభ్యర్థులు గెలుపొందారు.
విశాఖ, కర్నూలులోనూ ఘోర పరాజయమే
కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంలోనూ.. వైకాపా అలజడులు సృష్టించింది. భారీ ఎత్తున భూముల కబ్జా చేసింది. ప్రభుత్వస్థలాలు తనఖా పెట్టింది. లులు వంటి సంస్థలను, ఐటీ పరిశ్రమల్ని తరిమేసింది. రుషికొండకు గుండుకొట్టి ప్యాలెస్లు నిర్మించారు. ఎన్నికల్లో గెలిచాక.. అక్కడే ప్రమాణస్వీకారం చేస్తామని జగన్ చెప్పిన మాటలనూ అక్కడి ప్రజలు నమ్మలేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో 11 చోట్ల విజయం సాధించింది. ఈ దఫా రెండు స్థానాలతో సరిపెట్టారు. ఎనిమిది చోట్ల తెదేపా, నాలుగు చోట్ల జనసేన, ఒక స్థానంలో భాజపా అభ్యర్థులు గెలుపొందారు.
న్యాయరాజధానిగా ప్రకటించిన కర్నూలుకూ వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేదు. భవనాలు నిర్మించి.. కొన్ని సంస్థలనే అక్కడకు తరలించారు. రెండు రోజుల కిందట కూడా ఏపీఈఆర్సీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లో మొత్తం స్థానాల్ని దక్కించుకున్న వైకాపా.. ఈ దఫా కర్నూలుకు దూరంగా ఉన్న రెండు నియోజకవర్గాల్లోనే గెలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్