అమాత్యులు అంతా తామై..
పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ రాష్ట్రంలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు నియోజకవర్గాల ఇన్ఛార్జులు తీవ్రంగా శ్రమించారు.
చెమటోడ్చిన కాంగ్రెస్ ఇన్ఛార్జులు
పక్కా ప్రణాళికతో మంత్రులు, ఎమ్మెల్యేలకు ముందుగా బాధ్యతలు
ఖమ్మంలో విజయానంతరం ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటకు వస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి
రామసహాయం రఘురాంరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు
ఈనాడు, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ రాష్ట్రంలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు నియోజకవర్గాల ఇన్ఛార్జులు తీవ్రంగా శ్రమించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 8 లోక్సభ నియోజకవర్గాల్లో నెగ్గింది. 2014 ఎన్నికల్లో 2; 2019లో మూడు సీట్లు గెలిచింది. ఈసారి ఎక్కువ చోట్ల గెలవాలనే వ్యూహంతో ముందుగానే ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలను మొత్తం 17 నియోజకవర్గాలకు ఎన్నికల ఇన్ఛార్జులుగా అధిష్ఠానం నియమించింది. మంత్రులకు కీలక స్థానాల బాధ్యతలను అప్పగించింది. మంత్రులు గట్టిగా కృషిచేసిన చోట్ల కాంగ్రెస్కు భారీగా ఓట్లు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్కు సమన్వయకర్తలను సైతం విడిగా నియమించింది. వీరిపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఇన్ఛార్జులుగా ఉన్న మంత్రులు, ఇతర నేతలు మండుటెండలను సైతం లెక్కచేయకుండా మండలాలవారీగా పార్టీ శ్రేణులను సమన్వయపరిచి ముందుకు నడిపించారు. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ స్థానాల్లో 2 నుంచి 5.59 లక్షల దాకా మెజార్టీలు రావడానికి అక్కడి నియోజకవర్గాల ఇన్ఛార్జులే కీలకంగా పనిచేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.
శ్రేణులను ఏకతాటిపై నడిపించి
- ఖమ్మం స్థానానికి నామినేషన్ల చివరిరోజు వరకూ అభ్యర్థిని ప్రకటించలేదు. అయినా అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అహర్నిశలు కృషిచేశారు.
- నల్గొండలో సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్కు పార్టీ టికెట్ ఇచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డి నల్గొండలో పార్టీని ఏకతాటిపై నడిపించి రికార్డుస్థాయి మెజార్టీ సాధించేందుకు కృషిచేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ నల్గొండలో రాష్ట్రంలోకెల్లా అత్యధిక మెజార్టీ వస్తుందనే ధీమా సైతం వ్యక్తం చేశారు.
- మహబూబాబాద్ స్థానానికి ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ గెలుపునకు శ్రమించడంతో భారీ మెజార్టీ సాధించింది. పూర్తిగా గిరిజన ప్రాంతాలున్న ఇక్కడ పార్టీ ప్రచారాన్ని పెద్దయెత్తున నిర్వహించి వ్యూహాత్మకంగా విజయం కోసం పనిచేశారు.
- పెద్దపల్లి ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి డి.శ్రీధర్బాబుతోపాటు అక్కడి ఎమ్మెల్యేలు పార్టీని గెలిపించేందుకు తీవ్రంగా కృషిచేశారు. అభ్యర్థి వంశీకృష్ణకు రాజకీయ అనుభవం లేకపోవడంతో విజయానికి అంతా తామై పాటుపడ్డారు.
- పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి అభ్యర్థిగా ఉన్న నాగర్కర్నూల్కు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇన్ఛార్జిగా పనిచేశారు. భాజపా నుంచి గట్టి పోటీ ఎదురైనా క్షేత్రస్థాయిలో వ్యూహాత్మక ప్రచారం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
- కరీంనగర్కు అభ్యర్థిని ప్రకటించడంలో ఆలస్యం జరిగింది. అప్పటికే అక్కడ భాజపా, భారాస అభ్యర్థులు సుడిగాలి ప్రచారం చేశారు. అయినా ముమ్మరంగా ప్రచారం చేసి 3.59 లక్షలకు పైగా ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచామని ఆ స్థానానికి ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వర్గీయులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం