భారాస బలహీనతే భాజపాకు బలమైందా?
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. లోక్సభ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు ఆశించినప్పటికీ రాకపోవడానికి భారాస బలహీనపడి భాజపా ప్రయోజనం పొందడమే కారణంగా భావిస్తోంది.
గట్టిగా కృషి చేసినా రెండంకెల విజయం దక్కకపోవడంపై కాంగ్రెస్లో చర్చ
3, 4 స్థానాలపై ప్రభావం చూపిందని అంచనా
కుమార్తె విజయానికి సంబరపడుతూ.. కడియం కావ్యను ఆప్యాయంగా ముద్దాడుతున్న
ఆమె తండ్రి శ్రీహరి. చిత్రంలో మంత్రి కొండా సురేఖ
ఈనాడు, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. లోక్సభ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు ఆశించినప్పటికీ రాకపోవడానికి భారాస బలహీనపడి భాజపా ప్రయోజనం పొందడమే కారణంగా భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో గెలవడంతోపాటు తొమ్మిది లోక్సభ స్థానాల్లో ఆధిక్యం సాధించిన కాంగ్రెస్ వెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పని చేసింది. పది నుంచి 12 స్థానాల్లో విజయం సాధించవచ్చని భావించింది. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ.పది లక్షల వరకు ఆరోగ్యబీమా, గృహనిర్మాణానికి శ్రీకారం చుట్టడంతోపాటు పలు నియోజకవర్గాల్లో భారాసకు చెందిన నాయకులు చేరడంతో అన్ని చోట్లా గట్టిపోటీ ఇవ్వొచ్చని భావించింది. పార్టీలో ఉన్న బలమైన అభ్యర్థులందరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడంతో, కొన్ని నియోజకవర్గాలకు ఇతర పార్టీల నుంచి తీసుకొని పోటీ చేయించింది. భారాస నుంచి చేర్చుకొని.. సికింద్రాబాద్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను, చేవెళ్లలో ఆ పార్టీ సిటింగ్ ఎంపీగా ఉన్న రంజిత్రెడ్డిని బరిలో నిలిపింది. అలాగే భారాస నుంచే వచ్చిన వికారాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ పట్నం సునీతను మల్కాజిగిరిలో, కడియం కావ్యను వరంగల్లో పోటీకి దింపింది. ఆదిలాబాద్లో ఉపాధ్యాయురాలు, హక్కుల కార్యకర్త అయిన ఆత్రం సుగుణను బరిలోకి దింపి ప్రయోగం చేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికలో తీవ్ర జాప్యం చేసింది. మూడింటికి నామినేషన్ చివరిరోజు అభ్యర్థులను ప్రకటించింది. అయినప్పటికీ ప్రచారాన్ని దీటుగా చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నీ తానై రోజుకు రెండు మూడు నియోజకవర్గాల్లో బహిరంగసభలు, రోడ్షోలలో పాల్గొన్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే తాగునీటి సమస్య, ధాన్యం కొనుగోలు తదితర అంశాలు ముందుకు వచ్చాయి. ఎన్నికల్లో గెలిస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి వెంటనే చేయలేదని విపక్షాలు ఆరోపించడం, అది చర్చనీయాంశంగా మారడంతో ఆగస్టు 15లోగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతి సభలోనూ ఈ అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. అయితే అనేక నియోజకవర్గాల్లో భారాస ఓటు బ్యాంకు గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందని అంతర్గత సర్వేల్లో తేలడంతో కేంద్రీకరణ మరింత ఎక్కువగా పెంచారు. కాంగ్రెస్ అంతర్గత సర్వేల్లో చేవెళ్ల, మహబూబ్నగర్, నిజామాబాద్ లాంటి చోట్ల భారాసకు 15 నుంచి 20 శాతం మధ్యే ఓట్లు వచ్చే పరిస్థితులు కనపడటంతో వాటిపై మరింతగా దృష్టి కేంద్రీకరించినా లాభం లేకపోయింది. భారాస ఓటు బ్యాంకు గణనీయంగా భాజపా వైపు మళ్లడంతోనే మరో మూడు నాలుగు సీట్లు గెలిచే అవకాశం కోల్పోయినట్లు కాంగ్రెస్లో చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ఒకటిన్నర శాతం ఓట్లు కాంగ్రెస్కు పెరిగాయి. అయినా లోక్సభ సీట్ల సంఖ్య పెరగలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 13.9 శాతం ఓట్లు పొందిన భాజపాకు ఈ లోక్సభ ఎన్నికల్లో 35.08 శాతం ఓట్లు వచ్చాయి. ఇలా అదనంగా వచ్చిన ఓట్లు భారాసవేనని కాంగ్రెస్ భావిస్తోంది.
కరీంనగర్లో కాంగ్రెస్కు తగ్గిన ఓట్లు
కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కరీంనగర్ లోక్సభ స్థానంలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే సుమారు రెండు లక్షల ఓట్లు తగ్గాయి. దీనికి కారణం సిటింగ్ ఎమ్మెల్యేలున్న కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కంటే భాజపాకు ఎక్కువ ఓట్లు రావడమే. మహబూబ్నగర్ పరిధిలో కూడా రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇదే పరిస్థితి. ఆదిలాబాద్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానంలో గెలిచి మిగిలిన సెగ్మెంట్లలో మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చింది. మంత్రి సీతక్క అక్కడే మకాం వేసి తీవ్రంగా కృషి చేశారు. రాహుల్గాంధీ, రేవంత్రెడ్డిలు ప్రచారం చేశారు. దీంతో ఇక్కడ ఓట్లు గణనీయంగా పెరిగాయి. అయితే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన చోట భాజపాకు మెజార్టీ రాగా, భారాస ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఆధిక్యం వచ్చింది.
మంత్రుల కృషి ఫలితం..
నల్గొండ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మూడు లక్షల ఓట్ల ఆధిక్యం రాగా, ఇప్పుడు ఏకంగా ఐదున్నర లక్షల ఓట్లకు పైగా మెజార్టీ వచ్చింది. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఈ స్థానానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈయన సొంత నియోజకవర్గం హుజూర్నగర్లో కూడా భారీ మెజార్టీ లభించింది. అలాగే ఖమ్మంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు సెగ్మెంట్లలో కలిపి 2.66 లక్షల ఓట్ల మెజార్టీ వస్తే ఇప్పుడు 4.62 లక్షల ఓట్ల ఆధిక్యం వచ్చింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వియ్యంకుడు రఘురాంరెడ్డికి పట్టుబట్టి టికెట్ ఇప్పించుకోవడంతో పాటు ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా భారీ ఆధిక్యం వచ్చేలా పని చేశారు. ఈ స్థానం పరిధిలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల అసెంబ్లీ స్థానాలు కూడా ఉండటం, వారు కూడా విస్తృతంగా ప్రచారం చేయడం కలిసి వచ్చింది. మహబూబాబాద్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే భారీ మెజార్టీ వచ్చింది. తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జిగా నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించారు. వరంగల్, భువనగిరి, పెద్దపల్లిలలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు మంచి మెజార్టీలు వచ్చాయి. గతంలో తక్కువ వచ్చిన చోట ఇప్పుడు ఓట్లు భారీగా పెరిగినా, అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీలు వచ్చిన చోట మరింత ఎక్కువ ఆధిక్యాలు లభించినా, భాజపా ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న చోట భారాస బలహీనపడి అధికశాతం ఓట్లు కమలానికి వెళ్లడం వల్ల మూడు నాలుగు స్థానాలపై ప్రభావం చూపిందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి