హిందీ బెల్ట్లో నయా గేమ్ఛేంజర్లు!
హిందీ బెల్ట్లోని కీలక రాష్ట్రాలైన బిహార్, యూపీల్లో యువ నేతలు జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేయగల స్థాయిలో బలపడ్డారు. వారసత్వం వీరికి లాంచ్ప్యాడ్గా ఉపయోగపడ్డా.. ఇప్పటివరకు చెప్పుకోదగిన స్థాయిలో విజయాలు సాధించలేదు.
హిందీ బెల్ట్లోని కీలక రాష్ట్రాలైన బిహార్, యూపీల్లో యువ నేతలు జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేయగల స్థాయిలో బలపడ్డారు. వారసత్వం వీరికి లాంచ్ప్యాడ్గా ఉపయోగపడ్డా.. ఇప్పటివరకు చెప్పుకోదగిన స్థాయిలో విజయాలు సాధించలేదు. తాజా ఎన్నికల ఫలితాలు వీరికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం తీసుకొచ్చాయి.
వ్యూహం మార్చి.. బాబాయ్ను బుజ్జగించి..
ఉత్తర్ప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేశ్ ఈసారి ఎన్నికల్లో సత్తా చాటారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ.. రాష్ట్రంలో సొంతంగా 37 స్థానాలను దక్కించుకున్నారు. ఫలితంగా ఇక్కడ ఎన్డీఏ సీట్ల సంఖ్య 62 నుంచి 33కు పడిపోయింది. గతంలో ములాయం జీవించి ఉన్నప్పుడు అఖిలేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో సొంత బాబాయ్ శివ్పాల్ యాదవ్ నుంచి తిరుగుబాటును ఎదుర్కొన్నారు. ఫలితంగా పార్టీ ఓట్లు చీలి కీలక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2022 ఎన్నికల ముందు శివ్పాల్ను ఎట్టకేలకు పార్టీలోకి తీసుకొచ్చిన ఆ ఏడాదే ములాయం మరణించారు. ఆ తర్వాత ఈ ఎన్నికల్లో 37 చోట్ల విజయాలు నమోదు చేసి పార్లమెంటులో పార్టీని మూడో స్థానంలో నిలబెట్టారు. ఇండియా కూటమిలో ఇప్పుడు సమాజ్వాదినే రెండో అతిపెద్ద భాగస్వామి. ఫలితంగా తమది ఇక ఏమాత్రం ఒక ప్రాంతానికి పరిమితమైన పార్టీ కాదని రుజువు చేసుకున్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించనున్నారు.
తేజస్వికి దూకుడెక్కువ..
ఇండియా కూటమికి హిందీ రాష్ట్రం బిహార్లో అండగా నిలిచిన నాయకుడు తేజస్వీ యాదవ్. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకెళ్లడం, అనారోగ్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీని ఇప్పుడు తేజస్వీనే నడిపిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి గణనీయమైన సీట్లు తీసుకొచ్చి రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. కానీ, నీతీశ్ కుమార్ ఎన్డీఏలో చేరడంతో ఆ పదవిని కోల్పోయారు. ఇండియా కూటమిలో చేరి.. బలంగా పోరాడారు. ఈసారి వెన్నెముక గాయంతో బాధపడుతున్నా.. వీల్ఛైర్లో ఉండే ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి, మిత్రపక్షాలకు కలిపి ఈసారి 9 సీట్లు తీసుకురావడంలో విజయం సాధించారు. ఇప్పుడు ఇండియా కూటమిలో తేజస్విది కీలక పాత్రగా మారింది.
మోదీ నమ్మినబంటుగా చిరాగ్
బిహార్ నుంచే జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకంగా మారిన మరో నేత లోక్ జన్శక్తి అధినాయకుడు చిరాగ్ పాస్వాన్. తండ్రి రాంవిలాస్ పాస్వాన్ నీడన రాజకీయాలు మొదలుపెట్టారు. కానీ తండ్రి 2020లో మరణించారు. అదే సమయంలో పార్టీ విషయంలో తన బాబాయ్ పశుపతి కుమార్ పారస్తో విభేదాలు రావడంతో భాజపా ఇద్దరికీ సమదూరం పాటించింది. ఈ సమయంలో తన రాజకీయ అస్థిత్వం కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. బిహార్ ఫస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో ఎన్డీఏ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇచ్చారు. అతడి నిరీక్షణ ఫలించింది. ఎన్నికలకు ముందు భాజపా చిరాగ్ పక్షం వహించాలని నిర్ణయించింది. ఆయన నేతృత్వంలోని ఎల్జేపీకి 5 ఎంపీ స్థానాలను కేటాయించింది. చిరాగ్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని ఐదు చోట్లా విజయం సాధించారు. ఇప్పుడు భాజపా మ్యాజిక్ మార్కును అందుకోవడంతో.. ఎన్డీఏలో కీలకంగా మారారు.
ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం