గంగా డెల్టాలో తృణమూల్ ఆధిపత్యం
పశ్చిమ బెంగాల్లోని గంగా పరీవాహక ప్రాంతంతోపాటు జంగల్ మహల్, ఉత్తర బెంగాల్లలో తృణమూల్ ఆధిపత్యం ప్రదర్శించింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఈ ప్రాంతాల్లోని 29 లోక్సభ నియోజకవర్గాల్లో 18 గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని గంగా పరీవాహక ప్రాంతంతోపాటు జంగల్ మహల్, ఉత్తర బెంగాల్లలో తృణమూల్ ఆధిపత్యం ప్రదర్శించింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఈ ప్రాంతాల్లోని 29 లోక్సభ నియోజకవర్గాల్లో 18 గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఉత్తర బెంగాల్లోని కొంత ప్రాంతంతోపాటు మతువా, దక్షిణ బెంగాల్లలో భాజపా సత్తా చాటింది. లోక్సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ మొత్తం 42లో 29 స్థానాలను గెలుచుకుని పట్టు నిరూపించుకున్న సంగతి తెలిసిందే.
- గంగా డెల్టాలోని ఉత్తర, దక్షిణ పరగణాలు, కోల్కతా, హుగ్లీ, హావ్డా జిల్లాల్లోని 16 సీట్లలో 14 చోట్ల తృణమూల్ విజయం సాధించింది.
- బసీర్హట్లో భాజపా తరఫున పోటీ చేసిన సందేశ్ఖాలీ బాధితురాలు రేఖా పాత్ర ఓడిపోయారు. ఈ ప్రాంతంలో దాని ప్రభావం కనిపించలేదు.
- అటవీ ప్రాంతమైన జంగల్ మహల్లోని పశ్చిమ జిల్లాల్లో తృణమూల్, భాజపా సమాన విజయాలను సాధించాయి. ఈ ప్రాంతంలోని బంకూరా సీట్లో కేంద్ర మంత్రి సుభాశ్ సర్కార్ ఓడిపోయారు.
- ఉత్తర బెంగాల్లోని 8 సీట్లలో ఆరింటిని భాజపా కైవసం చేసుకుంది.
- దక్షిణ బెంగాల్లో ముస్లింల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో తృణమూల్ భారీ విజయాలను నమోదు చేసింది.
- మైనారిటీ ఓట్లలో డివిజన్ తేవడంద్వారా ఉత్తర బెంగాల్లో భాజపా పట్టు సాధించింది.
యూపీలో 8 చోట్ల అసెంబ్లీ ఉప ఎన్నికలు!
లఖ్నవూ: ఉత్తర్ ప్రదేశ్లో 8 మంది ఎమ్మెల్యేలు లోక్సభకు ఎన్నిక కావడంతో వారి స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పేలా లేవు. రాజకీయంగా అత్యంత కీలకమైన ఈ రాష్ట్రంలో 13 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు పోటీ చేశారు. వారిలో 8 మంది విజయం సాధించారు.
- గెలిచిన ఎమ్మెల్సీల్లో మంత్రిగా ఉన్న జితిన్ ప్రసాద ఉన్నారు. ఆయన పీలీభీత్ నుంచి గెలిచారు. హాథరాస్ నుంచి మరో మంత్రి అనూప్ ప్రధాన్ విజయం సాధించారు.
- పరాజయం పాలైన రాష్ట్ర మంత్రుల్లో దినేశ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు. ఆయన రాయ్బరేలీలో రాహుల్ గాంధీ చేతిలో ఓటమి పాలయ్యారు. డింపుల్ యాదవ్ చేతిలో మరో మంత్రి జయ్వీర్ సింగ్ ఓడిపోయారు.
- ఈ ఎన్నికల్లో గెలిచిన సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు(4)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
29న దిల్లీ జంతర్మంతర్లో మహిళా ధర్నా
మహిళా రిజర్వేషన్ చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందినా మోదీ ప్రభుత్వం అమలు చేయనందుకు, ఈ చట్టంలో ఓబీసీ వర్గాల మహిళలను చేర్చనందుకు నిరసనగా ఈ నెల 29న దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.