ఎన్డీయే కూటమికి 55.28% ఓట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి 55.28 శాతం ఓట్లు సాధించగా.. వైకాపా 39.37 శాతానికే పరిమితమైంది.
వైకాపాకు 39.37 శాతం
15.91 శాతం మేర వ్యత్యాసం
వైకాపా కంటే కూటమికి 53,72,166 ఓట్లు అధికం
సొంతంగా 45.60 శాతం ఓట్లు సాధించిన తెదేపా
వైకాపా కంటే 6.23 శాతం అధికం
జనసేనకు 6.85 శాతం, భాజపాకు 2.83 శాతం ఓట్లు
ఓట్ల శాతం కొద్దిగా పెరిగినా.. ఎక్కువ స్థానాలు దక్కించుకున్న జనసేన, భాజపా
గతం కంటే 10.58 శాతం ఓట్లు, 140 స్థానాలు కోల్పోయిన వైకాపా
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి 55.28 శాతం ఓట్లు సాధించగా.. వైకాపా 39.37 శాతానికే పరిమితమైంది. ఎన్డీయే కూటమి, వైకాపా మధ్య ఓట్ల వ్యత్యాసం 15.91 శాతముంది. విడివిడిగా చూస్తే తెదేపా 45.60 శాతం, జనసేన 6.85 శాతం, భాజపా 2.83 శాతం ఓట్లు సాధించాయి. తెదేపా, వైకాపా మధ్య ఓట్ల తేడా 6.23 శాతంగా ఉంది. కూటమిలోని మూడు పార్టీలు కలిపి 1,86,56,300 ఓట్లు దక్కించుకోగా.. వైకాపా 1,32,84,134 ఓట్లు సాధించింది. వైకాపా కంటే కూటమి 53,72,166 ఓట్లు అధికంగా సాధించింది.
గత ఎన్నికల కంటే తెదేపాకు 6.43 శాతం ఓట్లు, 112 సీట్లు అధికం
- తెదేపా గత ఎన్నికల్లో 39.17 శాతం ఓట్లు దక్కించుకోగా... ఈసారి 45.60 శాతం ఓట్లు సాధించింది.
- గత సారి కంటే 6.43 శాతం ఓట్లు, 112 సీట్లు అధికంగా దక్కించుకుంది.
- 2019లో 175 స్థానాల్లో పోటీ చేసి 23 స్థానాలకే పరిమితమైన తెదేపా.. ఈసారి 144 స్థానాల్లోనే బరిలో దిగి 135 స్థానాలు సాధించింది. పోటీ చేసిన వాటిల్లో కేవలం 9 మినహా మిగతావన్నీ గెలిచింది.
జనసేనకు 1.25 శాతం ఓట్లు పెరిగాయ్.. 20 సీట్లు అదనంగా దక్కాయ్
- జనసేన గత ఎన్నికల్లో 5.60 శాతం ఓట్లు దక్కించుకోగా.. ఈసారి 6.85 శాతం ఓట్లు సాధించింది.
- గత సారి కంటే 1.25 శాతం ఓట్లే అధికంగా సాధించినప్పటికీ... సీట్ల పరంగా చూస్తే 20 స్థానాలు అదనంగా దక్కించుకోగలిగింది.
- 2019లో 132 స్థానాల్లో పోటీ చేసి ఒకే ఒక్క సీటుకు పరిమితం కాగా.. ఈసారి 21 స్థానాల్లోనే పోటీ చేసి 100 శాతం స్ట్రైక్ రేట్తో అన్ని స్థానాల్లోనూ విజయం దక్కించుకుంది.
భాజపా ఓట్ల శాతం 1.99 మేర పెరుగుదల.. 8 స్థానాల్లో విజయం
- భాజపా గత ఎన్నికల్లో 0.84 శాతం ఓట్లు సాధించగా... ఈసారి 2.83 శాతం ఓట్లు దక్కించుకుంది.
- 2019 కంటే భాజపాకు 1.99 శాతం మేర ఓట్లు అధికంగా లభించాయి.
- 2019లో 173 స్థానాల్లో పోటీ చేసిన భాజపా ఒక్క సీటూ దక్కించుకోలేదు. ఈసారి మాత్రం 10 స్థానాల్లో పోటీచేసి 8 స్థానాలు సాధించింది.
- 2014లో పొత్తుల్లో భాగంగా 4 సీట్లే సాధించిన భాజపా.. ఈసారి మాత్రం అంతకంటే రెట్టింపు స్థానాలు దక్కించుకోగలిగింది.
10.58 శాతం ఓట్లు, 140 స్థానాలు కోల్పోయిన వైకాపా
- 2019లో 49.95 శాతం ఓట్లు సాధించిన వైకాపా.. ఈసారి ఏకంగా 10.58 శాతం ఓట్లు కోల్పోయి 39.37 శాతానికి పరిమితమైంది.
- గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైకాపా.. ఈసారి ఏకంగా 140 స్థానాలు కోల్పోయి 11 సీట్లకే పరిమితమైంది.
- 2014లో 44.86 శాతం ఓట్లు వైకాపాకు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి ఆ పార్టీ ఓట్ల శాతం 5.49 శాతం మేర తగ్గింది.
- 2014లో వైకాపాకు 67 స్థానాలు లభించాయి. అప్పటితో పోలిస్తే ఈసారి 56 స్థానాలను కోల్పోయింది.
2014 కంటే ఎన్డీయే కూటమికి 8.49 శాతం ఓట్లు అధికం
- 2014లో తెదేపా, భాజపా, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. ఎన్డీయే కూటమికి 46.79 శాతం ఓట్లు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి ఎన్డీయే కూటమి 8.49 శాతం మేర అధికంగా ఓట్లు సాధించింది.
- 2019లో తెదేపా, భాజపా, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. అప్పట్లో తెదేపా 39.17 శాతం, జనసేన 5.60 శాతం, భాజపా 0.84 శాతం ఓట్లు సాధించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
హామీల అమలుపై చిత్తశుద్ధి ఏదీ?
ప్రగతి పట్టని, సరైన దిశానిర్దేశం లేని, హామీల అమలుపై చిత్తశుద్ధి లేని బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి