సంక్షిప్తవార్తలు(12)
టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఈ నెల 11న ఎన్నుకొని.. ఆ తీర్మానాన్ని గవర్నర్కు పంపనున్నట్లు తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు.
11న టీడీఎల్పీ.. 12న ప్రమాణ స్వీకారం
తెదేపా సీనియర్నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి
ఈనాడు డిజిటల్, అమరావతి: టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఈ నెల 11న ఎన్నుకొని.. ఆ తీర్మానాన్ని గవర్నర్కు పంపనున్నట్లు తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు. చంద్రబాబును కలిసిన అనంతరం ఉండవల్లి నివాసం బయట ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ, ఒడిశా సీఎంల ప్రమాణస్వీకార కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. ఇంత ఘోరమైన ఓటమి చవిచూశాక కూడా వైకాపా నేతల తీరు మారలేదని మండిపడ్డారు.
- ఎన్డీయే ఇంత భారీ విజయం సాధించడానికి ప్రజల్లో ఉన్న కసే కారణమని విశాఖ ఎంపీగా ఎన్నికైన భరత్ తెలిపారు. చంద్రబాబుతో సమావేశం కావడం ఆనందంగా ఉందని గుంటూరు ఎంపీగా ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అనేక సమస్యల పరిష్కారానికి కేంద్రం అండగా నిలవనుందని విజయనగరం ఎంపీగా ఎన్నికైన కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.
రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి
చంద్రబాబుకు తెలంగాణ సీఎం ఫోన్
అభినందనలు తెలిపిన రేవంత్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: ఏపీలో ఘన విజయం సాధించిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని రేవంత్ కోరారు. గురువారం మధ్యాహ్నం మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ ఫలితాలపై సమీక్ష జరిగింది. ఇదే సమావేశం నుంచి రేవంత్రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు.
దిల్లీకి తెదేపా అధినేత
గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి దిల్లీ బయల్దేరి వెళ్లారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి వాహనశ్రేణిలో విమానాశ్రయం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఎన్డీయే ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు), పుట్టా మహేశ్యాదవ్ (ఏలూరు), వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (నెల్లూరు), కేశినేని చిన్ని (విజయవాడ), మాగుంట శ్రీనివాసులురెడ్డి (ఒంగోలు), భరత్ (విశాఖపట్నం), దగ్గుమళ్ల ప్రసాదరావు (చిత్తూరు), అప్పలనాయుడు (విజయనగరం)తో పాటు ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి (నూజివీడు), సత్యకుమార్ (ధర్మవరం), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు)తో కలిసి హస్తినకు బయల్దేరి వెళ్లారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ
ఎన్డీయే పక్షాల సీఎంలూ హాజరు
ఈనాడు, అమరావతి: చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ సహా ఎన్డీయే పక్షాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్కుమార్ గురువారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చి, ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్ల గురించి చర్చించారు.
అవకాశాలను సద్వినియోగం చేసుకోండి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విజయవాడ(అలంకార్ కూడలి), న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే కూటమి నేతలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభినందనలు తెలిపారు. ఈ మేరకు గురువారం తెదేపా అధినేత నారా చంద్రబాబుకు లేఖ రాశారు. కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. ‘కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులోనూ మీరు కీలక భూమిక పోషించనున్నారు. భాజపాకు పూర్తిస్థాయి మెజారిటీ లేనందున.. తెదేపా, జేడీయూలపై ఆధారపడి ఆ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్రానికి వచ్చిన మంచి అవకాశం ఇది. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఏపీని అన్ని విధాలుగా అన్యాయం చేసింది. ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కింది. విభజన హామీలను అమలు చేయలేదు. ఇప్పుడు ఎన్డీయేలో కీలకంగా వ్యవహరించే అవకాశం మీకు వచ్చినందున.. విశాఖ ఉక్కును రక్షించాలి. ప్రత్యేక హోదా తీసుకురావాలి. విభజన హామీలను అమలు చేసేలా చూడాలి’ అని రామకృష్ణ ఆ లేఖలో కోరారు.
ఆ అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు
తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు
ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపాతో అంటకాగి, నిబంధనలకు తిలోదకాలిచ్చిన కొందరు అవినీతి అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు హెచ్చరించారు. డిప్యుటేషన్పై వచ్చి, ఇప్పుడు పారిపోవాలని చూస్తున్న కొందరు ఉన్నతాధికారుల ప్రయత్నాలకు కళ్లెం వేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 1,800 మంది టీచర్ల అక్రమ బదిలీల్ని అడ్డుకున్నట్లు తెలిపారు. మంగళగిరిలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక దస్త్రాలు ధ్వంసం చేయాలని చూస్తున్నారు. 300 మంది స్టాఫ్నర్సుల పోస్టింగుల్లోనూ అవినీతి జరిగినట్టు తెలిసింది. వెంటనే వాటికి అడ్డుకట్టపడింది’’ అనిఅశోక్బాబు తెలిపారు.
ఓడినా.. వైఖరి మార్చుకోని జగన్
భాజపా నేత సత్యకుమార్
ఈనాడు, అమరావతి: ఘోరంగా ఓడిపోయిన జగన్ తన వైఖరి మార్చుకోకుండా ప్రజలపై నిందలు వేయడం దారుణమని ధర్మవరం నుంచి భాజపా ఎమ్మెల్యేగా గెలిచిన సత్యకుమార్ మండిపడ్డారు. పరాజయంతో తాడేపల్లికి మాత్రమే పరిమితమైన జగన్.. సంక్షేమ పథకాలు ఇచ్చాను కదా అని ప్రజలను నిందించడం తగదని విమర్శించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సత్యకుమార్ గురువారం విలేకర్లతో మాట్లాడారు. ‘జగన్రెడ్డి.. అన్ని వర్గాలను మోసం చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి అరాచక పాలన సాగించారు. ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు దిగడమే కాకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. 2024 ఎన్నికలు వైకాపాకు చెంపపెట్టులాంటివి’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఏర్పాటులో జనసేన అధినేత పవన్కల్యాణ్ తీసుకున్న నిర్ణయం గొప్పదని వ్యాఖ్యానించారు.
డీకే అరుణ విజయానికి రేవంత్ సహకారం
భారాస నేతలు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపణ
ఈనాడు, హైదరాబాద్: మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో భాజపా అభ్యర్థి డీకే అరుణ విజయానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకరించారని భారాస నేతలు జి.దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లను రేవంతే భాజపాకు బదిలీ చేయించారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ 30 వేలకు పైగా మెజారిటీ తెచ్చుకుందని, ఈ ఎన్నికల్లో అది 22వేలకు తగ్గిపోయిందని, కాంగ్రెస్ పార్టీ ఓట్లను రేవంతే భాజపాకు బదిలీ చేయించారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో గురువారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘సిద్దిపేటలో హరీశ్రావు భాజపాకు ఓట్లు బదిలీ చేయించారని సీఎం రేవంత్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవానికి ఓట్లు బదిలీ చేసింది సీఎం, మంత్రులు, విప్లే. భారాసను విమర్శించడం మాని.. ఎందుకు 8 సీట్లను కోల్పోయామో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు’’ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్కు మద్దతు ప్రకటించిన మహారాష్ట్ర స్వతంత్ర ఎంపీ
దిల్లీలో గురువారం మల్లికార్జున ఖర్గేకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న విశాల్ పాటిల్
దిల్లీ: మహారాష్ట్రలోని సాంగ్లీ నుంచి స్వతంత్ర సభ్యునిగా లోక్సభకు ఎన్నికైన విశాల్ పాటిల్ గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి పార్టీకి తన మద్దతు ప్రకటించారు. పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీలతోనూ ఆయన భేటీ అయ్యారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంత్దాదా పాటిల్కు ఆయన మనవడు.
రేపు సీడబ్ల్యూసీ భేటీ
దిల్లీ: లోక్సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలను విశ్లేషించడానికి ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ’ (సీడబ్ల్యూసీ) శనివారం సమావేశం కాబోతోంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహిస్తారు. 2019 ఎన్నికల్లో 52 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ ఈసారి 99 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో పదేళ్ల విరామం తర్వాత కాంగ్రెస్కు లోక్సభలో ప్రతిపక్ష హోదా లభించబోతోంది.
సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో భారాస మద్దతుదారుల పైచేయి
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో భారాస మద్దతుదారులు అత్యధికంగా 9 డైరెక్టర్ స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్, భాజపా మద్దతుదారులు, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో డైరెక్టర్ స్థానంలో విజయం సాధించారు. పార్టీలకతీతంగా జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 12 డైరెక్టర్ స్థానాలకు 61 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. సిరిసిల్లలో గురువారం నిర్వహించిన ఎన్నికల్లో 6,177 మంది ఓటర్లకు గాను 4,760 (77%) మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు గెలుపొందిన అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసి.. అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహిస్తామని ఎన్నికల అధికారి రామకృష్ణ తెలిపారు. కాగా, డైరెక్టర్లుగా గెలిచిన భారాస మద్దతుదారులు ఎమ్మెల్యే కేటీఆర్ను కలిసేందుకు హైదరాబాద్కు తరలివెళ్లారు.
ప్రజాసమస్యలపై దృష్టి సారించాలి: ప్రభాకర్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పాలన, ప్రజా సమస్యలపై సీఎం రేవంత్రెడ్డి దృష్టిసారించాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ సూచించారు. రైతులు కల్తీ విత్తనాలతో, కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేశారు. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభాకర్ మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు