లోకేశ్‌ను కలిసిన నిఖిల్, బండ్ల గణేశ్‌

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో సినీనటుడు నిఖిల్, నిర్మాత బండ్ల గణేశ్‌ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వీరితోపాటు పలువురు తెదేపా, భాజపా ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు లోకేశ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.

Updated : 08 Jun 2024 05:52 IST

ప్రజాప్రతినిధులు, నేతలతో సందడిగా ఉండవల్లి నివాసం 

ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో సినీనటుడు నిఖిల్, నిర్మాత బండ్ల గణేశ్‌ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వీరితోపాటు పలువురు తెదేపా, భాజపా ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు లోకేశ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. యువగళం పాదయాత్రతో తెదేపా సహా కూటమి అభ్యర్థులను ఘనవిజయం వైపు నడిపించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 2 వేల మంది కార్యకర్తలు, ప్రజలు లోకేశ్‌ను కలిసేందుకు వచ్చారు. లోకేశ్‌ను కలిసిన వారిలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎంఎస్‌ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, వంగలపూడి అనిత, కొండయ్యయాదవ్, తిప్పేస్వామి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, చింతకాయల విజయ్, బండారు శ్రావణిశ్రీ, భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని