దశాబ్దాలుగా సంకీర్ణ వెలుగులు!
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు కేంద్రంలో వరుసగా మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టింది. ఇది సంకీర్ణ ప్రభుత్వం.
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు కేంద్రంలో వరుసగా మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టింది. ఇది సంకీర్ణ ప్రభుత్వం. సొంతంగా మెజార్టీ రాకపోవడంతో.. ప్రస్తుతం తెలుగుదేశం, జేడీయూ తదితర మిత్రపక్షాల మద్దతుపై కమలదళం ఆధారపడక తప్పని పరిస్థితి. మన దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం కొత్తేమీ కాదు. గతంలో పలువురు కీలక నేతల నాయకత్వంలో ఇలాంటి సర్కార్లు పాలనాపగ్గాలు చేపట్టాయి. ఆ దాఖలాలను పరిశీలిస్తే..
మొరార్జీ దేశాయ్
(1977 మార్చి - 1979 జులై)
దేశంలో తొలి ప్రధాన సంకీర్ణ సర్కారు 1970ల్లో ఏర్పాటైంది. ఆత్యయిక స్థితి తర్వాత 1977 మార్చిలో లోక్సభ ఎన్నికలు జరిగాయి. అంతకంటే కేవలం రెండు నెలల ముందే.. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని గద్దె దింపాలన్న పట్టుదలతో జనసంఘ్, కాంగ్రెస్ (ఒ), భారతీయ లోక్దళ్, సోషలిస్టు పార్టీ, స్వతంత్ర పార్టీ, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ఏకమై జనతా పార్టీగా అవతరించాయి. జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో ఎన్నికల బరిలో దిగిన ఆ పార్టీకి 270 సీట్లు వచ్చాయి. ఉత్తర్ప్రదేశ్, బిహార్, హరియాణా, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో దాని ప్రభంజనం కనిపించింది. ఫలితంగా కేంద్రంలో జనతా పార్టీ (విపక్ష పార్టీల సంకీర్ణం) ప్రభుత్వం ఏర్పాటైంది. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ 153 సీట్లకు పరిమితమైంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లోనే హస్తం పార్టీకి ఊరడింపు దక్కింది.
చరణ్ సింగ్
(1979 జులై - 1980 జనవరి)
సైద్ధాంతిక విభేదాలకు రాజకీయ కారణాలూ తోడవడంతో జనతా పార్టీ రెండేళ్లలోనే చీలిపోయింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన చరణ్సింగ్ జనతా పార్టీ నుంచి బయటకు రావడంతో మొరార్జీ దేశాయ్ ప్రధాని పదవికి రాజీనామా చేయక తప్పలేదు. అనంతరం జనతాపార్టీ (సెక్యులర్), కాంగ్రెస్ (యుఆర్ఎస్), కాంగ్రెస్ (ఐ) మద్దతుతో చరణ్సింగ్ 1979 జులై 28న ప్రధాని పీఠమెక్కారు. కానీ ఆత్యయిక స్థితి సమయంలో చర్యలకు సంబంధించి ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్గాంధీలపై నమోదైన క్రిమినల్ అభియోగాలను కొట్టివేయాలన్న డిమాండ్కు తలొగ్గకపోవడంతో ప్రభుత్వానికి కాంగ్రెస్ (ఐ) తన మద్దతు ఉపసంహరించుకుంది. ఫలితంగా కేవలం 23 రోజుల్లోనే చరణ్సింగ్ ప్రభుత్వం కూలిపోయింది.
వి.పి.సింగ్
(1989 డిసెంబరు - 1990 నవంబరు)
1980లు, 90ల్లో పలు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ సంఖ్యాబలం 197కు పడిపోయింది. రామ జన్మభూమి ఉద్యమం ఊపుతో బరిలో దిగిన భాజపా 85 సీట్లు గెల్చుకుంది. వామపక్షాలకు 33 స్థానాలు దక్కాయి. భాజపా బయటి నుంచి మద్దతివ్వడంతో- వి.పి.సింగ్ (జనతాదళ్) నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ సర్కారు ఏర్పాటైంది. కాంగ్రెస్ (ఎస్), తెలుగుదేశం, డీఎంకే, అసోం గణ పరిషద్ అందులోని భాగస్వామ్య పక్షాలు.
చంద్రశేఖర్
(1990 నవంబరు - 1991 జూన్)
దేవీలాల్తో కలిసి చంద్రశేఖర్ జనతాదళ్ను చీల్చడంతో.. వి.పి.సింగ్ నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం పడిపోయింది. కాంగ్రెస్తో జట్టు కట్టి.. 1990 నవంబరు 10న చంద్రశేఖర్ ప్రధానిగా ప్రమాణం చేశారు. అయితే దిల్లీలోని రాజీవ్గాంధీ నివాసంలో ఇద్దరు హరియాణా పోలీసులు నిఘా వేశారన్న ఆరోపణల నేపథ్యంలో హస్తం పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఏడు నెలల్లోనే చంద్రశేఖర్ సర్కారు కూలిపోయింది.
హెచ్.డి.దేవేగౌడ
(1996 జూన్ - 1997 ఏప్రిల్)
పి.వి.నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్న తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా, థర్డ్ ఫ్రంట్ మధ్య త్రిముఖ పోరు కనిపించింది. థర్డ్ ఫ్రంట్కు జనతాదళ్ సారథ్యం వహించింది. సమాజ్వాదీ పార్టీ, తెదేపా, డీఎంకే, అసోం గణ పరిషద్, అఖిల భారత ఇందిరా కాంగ్రెస్ (తివారీ), వామపక్షాలు, తమిళ్ మాణిల కాంగ్రెస్, జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫెరెన్స్, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ అందులోని భాగస్వామ్య పక్షాలు. ఎన్నికల్లో భాజపాకు 161, కాంగ్రెస్కు 140 సీట్లు వచ్చాయి. జనతాదళ్ 46 సీట్లకు పరిమితమైంది. మొత్తంగా థర్డ్ ఫ్రంట్కు 136 సీట్లు దక్కాయి. ప్రధానిగా వాజ్పేయీ ప్రమాణం చేసినా.. బల నిరూపణలో విఫలమవడంతో 13 రోజుల్లోనే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం కాంగ్రెస్, థర్డ్ఫ్రంట్ మద్దతుతో దేవేగౌడ 1996 జూన్ 2న ప్రధాని పీఠమెక్కారు. యునైటెడ్ ఫ్రంట్గా పిలిచిన ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ వెలుపలి నుంచే మద్దతిచ్చింది.
ఐ.కె.గుజ్రాల్
(1997 ఏప్రిల్ - 1998 మార్చి)
యునైటెడ్ ఫ్రంట్ సర్కారుకు కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో.. విశ్వాస పరీక్షలో నెగ్గలేక దేవేగౌడ 1997 ఏప్రిల్ 11న రాజీనామా చేశారు. అనంతరం- దేవేగౌడ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన ఐ.కె.గుజ్రాల్.. జ్యోతిబసు, లాలూప్రసాద్ యాదవ్, కృష్ణకాంత్ తదితర నేతల అండతో ప్రధాని పదవిని చేపట్టారు. ఆయన సర్కారు (యునైటెడ్ ఫ్రంట్-2)కు కాంగ్రెస్ వెలుపలి నుంచి మద్దతిచ్చింది. తిరిగి అది తన మద్దతు ఉపసంహరించుకోవడంతో ఏడు నెలలకే గుజ్రాల్ సర్కారు పడిపోయింది.
ఆ తర్వాత 1998 నుంచి 2004 వరకు వాజ్పేయీ ప్రధానిగా భాజపా నేతృత్వంలో ఎన్డీయే సర్కారు, 2004-2014 మధ్య మన్మోహన్సింగ్ ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ-1, 2 ప్రభుత్వాలు దేశాన్ని పాలిచాయి. 2014 నుంచీ మోదీ నేతృత్వంలో ఎన్డీయే సర్కారు కొనసాగుతోంది.
నెహ్రూ.. రెండు సంకీర్ణాలు!
స్వాతంత్య్రానికి పూర్వం కూడా 1946లో అత్యంత సంక్లిష్టమైన సంకీర్ణాన్ని మన దేశం చూసింది. కాంగ్రెస్-ముస్లింలీగ్ కలసి ఏర్పాటుచేసిన సంకీర్ణమది. బ్రిటిష్ గవర్నర్ జనరల్ అధ్యక్షుడిగా, జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యక్షుడిగా ఏర్పడ్డ ఆ ప్రభుత్వంలో కాంగ్రెస్ నుంచి వల్లబ్భాయ్ పటేల్, రాజేంద్రప్రసాద్, జగ్జీవన్ రామ్ తదితర దిగ్గజ నేతలు ఉన్నారు. కీలకమైన ఆర్థిక శాఖను లీగ్కు (లియాఖత్ అలీఖాన్కు) కేటాయించారు. మథాయ్ నుంచి ఆర్థిక శాఖను లియాఖత్కు అప్పగించడం, ఆయనేమో తన అనుమతి లేకుండా అటెండర్ను కూడా నియమించటానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేయటం వివాదాలకు కారణమైంది. అన్నింటికీ సర్దిచెబుతూ నెహ్రూ సంకీర్ణాన్ని నడిపించారు. 1947లో స్వాతంత్య్రం తర్వాత తన సారథ్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వంలోనూ నెహ్రూ సంకీర్ణ ధర్మాన్ని పాటించారు. 1946 తాత్కాలిక ప్రభుత్వంలోని సగం మందిని కొనసాగిస్తూ... కాంగ్రెసేతర నాయకులకు, తనను గట్టిగా విమర్శించేవారికి కూడా కేబినెట్లో చోటు కల్పించారు. అంబేడ్కర్ (న్యాయశాఖ), ఆర్.కె.షణ్ముఖం చెట్టి (ఆర్థికశాఖ), శ్యాంప్రసాద్ ముఖర్జీ (పరిశ్రమలు) తదితర దిగ్గజాలు అందులో ఉన్నారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!