24.37 లక్షల మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్ దోపిడీ
వైకాపా నేతలు అధికారాన్ని అడ్డంపెట్టుకొని నెల్లూరు జిల్లాల్లో క్వార్ట్జ్ ఖనిజాన్ని భారీగా దోచుకున్నారు. ఏకంగా 24.37 లక్షల మెట్రిక్ టన్నుల మేర అక్రమంగా తవ్వి తరలించినట్లు బయటపడింది.
అక్రమంగా తవ్వి.. తరలించిన వైకాపా నేతలు
ఇతర జిల్లాల ట్రాన్సిట్ ఫామ్స్ వినియోగం
కేంద్రానికి సోమిరెడ్డి ఫిర్యాదుతో కదిలిన అధికారులు
275 కేసుల నమోదు, రూ.255.55 కోట్ల జరిమానా
ఈనాడు-అమరావతి, నెల్లూరు: వైకాపా నేతలు అధికారాన్ని అడ్డంపెట్టుకొని నెల్లూరు జిల్లాల్లో క్వార్ట్జ్ ఖనిజాన్ని భారీగా దోచుకున్నారు. ఏకంగా 24.37 లక్షల మెట్రిక్ టన్నుల మేర అక్రమంగా తవ్వి తరలించినట్లు బయటపడింది. పొదలకూరు, సైదాపురం, రాపూరు మండలాల్లో లభించే హైగ్రేడ్ క్వార్ట్జ్ను అనుమతులు లేకుండా తవ్వకాలు చేయడంతోపాటు దాన్ని చైనాకు ఎగుమతి చేసి భారీగా వెనకేసుకున్నారు. చైనాలో మెట్రిక్ టన్నుకు రూ.30 వేల వరకు ధర పలుకుతుండటంతో అంతా కలిసి దోపిడీ చేశారు. పొదలకూరు మండలంలో పలుచోట్ల అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో ఈ దందా సాగింది. సైదాపురం, రాపూరు మండలాల్లోని ఇతర వైకాపా నేతలు సైతం ఇష్టానుసారం తవ్వకాలు సాగించారు. జిల్లాలో ఎవరు తవ్వి, తరలించినా.. వారి నుంచి మెట్రిక్ టన్నుకు రూ.7 వేలు చొప్పున మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ముక్కుపిండి వసూలు చేశారు. తనకు కప్పం కడితే చాలు, ఎంత తవ్వుకున్నా.. ఎవరూ అడ్డుకోకుండా ఆయన దందా నడిపించారు.
మరోవైపు పొదలుకూరు మండలంలోని రుస్తుం మైన్స్ లీజు గడువు ముగియగా, లీజుదారుడు దాన్ని రెన్యువల్ చేయాలని దరఖాస్తు చేశారు. ఆ అనుమతులు రాకుండానే కాకాణి గోవర్ధన్రెడ్డి అందులోకి అక్రమంగా చొరబడి, తన మనుషుల ద్వారా నిరాటంకంగా తవ్వకాలు సాగించారు. నెల్లూరు జిల్లాలోని క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రుస్తుం మైన్స్లో కాకాణి గోవర్ధన్రెడ్డి దౌర్జన్యంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి జిల్లా కలెక్టర్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, గనుల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారెవరూ స్పందించలేదు. రుస్తుం మైన్స్ వద్ద కాకాణి దౌర్జాన్యానికి నిరసనగా రెండు రోజులపాటు సత్యాగ్రహ దీక్ష కూడా చేశారు. చివరకు వైకాపా నేతల దోపిడీ తారస్థాయికి చేరడంతో సోమిరెడ్డి కేంద్ర గనుల శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని కేంద్రం నుంచి రాష్ట్ర గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఏప్రిల్ ఒకటి నుంచి మే నెలాఖరు వరకు గనుల శాఖ అధికారులు తనిఖీలు చేయగా, ఇంతకాలం సాగిన దోపీడీ బట్టబయలైంది. బాధ్యులపై 275 కేసులు నమోదు చేయడంతోపాటు ఏకంగా రూ.255.55 కోట్ల జరిమానా విధించారు.
అంతటా అక్రమాలే..
- అధికారుల తనిఖీల్లో అనేక అక్రమాలు బయటపడ్డాయి. 14 మినరల్ డీలర్ లైసెన్స్దారుల (ఎండీఎల్స్) వద్ద 20,635 మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్ అక్రమంగా ఉన్నట్లు గుర్తించారు.
- మినరల్ డీలర్ లైసెన్సుదారులు చెల్లించిన జీఎస్టీకి, రవాణా చేసిన పరిమాణం లెక్కలు చూస్తే.. 2.30 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా తరలించినట్లు తేల్చారు. వీరిపై 38 కేసులు నమోదు చేశారు.
- ఇతర జిల్లాలకు చెందిన ట్రాన్సిట్ ఫామ్స్ కొనుగోలు చేసి, వాటి ద్వారా 1.12 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఖనిజాన్ని తరలించినట్లు వెలుగు చూసింది. వీటిపై 22 కేసులు నమోదు చేశారు.
- 9 లీజుల్లో 2.11 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా తవ్వి తరలించినట్లు బయటపడింది.
- 14 మంది లీజుదారులు.. 2.18 లక్షల మెట్రిక్ టన్నుల మేర తవ్వి, వాటికి పనిచేయని లీజుల పేరిట ట్రాన్సిట్ ఫామ్స్ను తీసుకొని రవాణా చేశారని తేలింది.
- 14 లీజుల్లో కొలతలు వేస్తే.. 16.34 లక్షల మెట్రిక్ టన్నులు అక్రమంగా తరలిపోయినట్లు గుర్తించారు.
- వీటన్నింటికి కలిపి 111 కేసులు నమోదు చేసిన అధికారులు రూ.253.87 కోట్ల మేర జరిమానాలు విధించారు.
- ఎటువంటి లీజులు లేనిచోట్ల తవ్వకాలు చేస్తున్న వారిపై 109 కేసులు నమోదు చేశారు. వీరికి 13.22 లక్షల జరిమానా వేశారు.
- పర్మిట్లు లేకుండా లారీల్లో తరలిస్తున్న క్వార్ట్జ్ను పట్టుకొని 55 కేసులు నమోదు చేయగా, వీరికి 1.67 కోట్ల జరిమానా విధించారు.
- 1.07 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని సీజ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!