Lok Sabha Polls: అనంత్నాగ్ నుంచి ఆజాద్ పోటీ చేయట్లేదు: డీపీఏపీ ప్రకటన
లోక్సభ ఎన్నికల్లో అనంత్నాగ్- రాజౌరి సీటు నుంచి కేంద్ర మాజీమంత్రి ఆజాద్ పోటీ చేయట్లేదని ఆయన స్థాపించిన డీపీఏపీ పార్టీ ప్రకటించింది.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, డెమోక్రటిక్ ప్రోగ్రసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చీఫ్ గులాంనబీ ఆజాద్ అనంత్నాగ్-రాజౌరి సీటు నుంచి పోటీ చేయట్లేదని ఆ పార్టీ ప్రకటించింది. ఆజాద్ తొలుత ఈ సీటు నుంచి బరిలో నిలుస్తారని ఏప్రిల్ 2న వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని కారణాల వల్ల ఆయన పోటీ చేయడం లేదని, ఇక్కడినుంచి మహ్మద్ సలీం పర్రేను బరిలోకి దించుతున్నట్లు డీపీఏపీ కశ్మీర్ ప్రొవిన్షియల్ అధ్యక్షుడు మహ్మద్ అమీన్ భట్ తెలిపారు. బుధవారం జరిగిన డీపీఏపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆజాద్ తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు సమాచారం. అయితే, ఈ సీటు నుంచేనా? లేదా పూర్తిగా ఈ లోక్సభ ఎన్నికలకే దూరంగా ఉంటారా? అనే అంశంపై మాత్రం స్పష్టత లేదు. మరోవైపు, ఈ సీటు నుంచి పీడీపీ అభ్యర్థిగా మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, ‘ఇండియా’ కూటమి నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత మియాన్ అల్తాఫ్ అహ్మద్ బరిలో నిలుస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.