india alliance: ఇండియా అలయన్స్ పుంజుకుందిలా..!
ఇండియా కూటమి ఈసారి అంచనాలకు మించి పుంజుకొంది. ఇది భాజపాకు ఓ రకంగా షాక్. ఫలితంగా ఆ పార్టీ మ్యాజిక్ మార్కును అందుకోలేకపోయింది. కూటమి సర్వశక్తులు ఒడ్డి ఓ వ్యూహం ప్రకారం ముందుకువెళ్లడంతో ఫలితాలు మెరుగుపడ్డాయని చెప్పాలి.
ఇంటర్నెట్డెస్క్: హిందీ బెల్ట్లో బలంగా ఉన్న భాజపాను ఎదుర్కోవాలంటే బలమైన కూటమి అవసరాన్ని ప్రతిపక్షాలు ఏడాది క్రితమే గుర్తించాయి. దీంతో గతేడాది జూన్లో తొలిసారి ఓ వేదికపై కలిసిన ఈ పార్టీలు యూపీఏ పేరిట కాకుండా.. ఇండియా కూటమి (india alliance)గా ఏర్పడ్డాయి. తమిళనాడులో డీఎంకేకు ఎదురులేకపోవడం.. కేరళలో భాజపా అత్యంత బలహీనంగా ఉండటంతో .. యూపీలో కమలదళానికి కళ్లెం వేయడంపై దృష్టిపెట్టాయి. భాజపాను నిలువరించేందుకు ఒక్క సీటు ఇవ్వకపోయినా పొత్తు పెట్టుకొనేందుకు సిద్ధమని కాంగ్రెస్ నాయకులు ఒక దశలో వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్లో సామాజిక సమీకరణలు..
ఉత్తరప్రదేశ్లో ఈసారి ఇండియా కూటమి ఏకంగా 45 స్థానాలతో మెజార్టీ సీట్లను దక్కించుకొంది. ఈ దెబ్బ మొతం ఎన్డీఏ కూటమిపైనే పడింది. యాదవ పార్టీగా ముద్ర పడిన సమాజ్వాదీ దాని నుంచి బయటపడటానికి తీవ్రంగా ప్రయత్నించింది. 64 చోట్ల టికెట్ల పంపిణీలో కేవలం ఐదుగురు మాత్రమే ఆ కులస్తులకు టికెట్లు ఇచ్చింది. మిగిలిన 27 యాదవేతర ఓబీసీలకు, 11 స్థానాల్లో అగ్రవర్ణాలు, ముస్లింలకు నాలుగు, ఖత్రీలకు ఒకటి కేటాయించింది. 15 మంది దళితులు ఉన్నారు. మరోవైపు భాజపా పోటీ చేసిన 75 సీట్లలో 34 అగ్రవర్ణాలకు కేటాయించింది. ఇక 25 ఓబీసీలకు ఇచ్చింది.
యూపీలో విభిన్నమైన ప్రచార శైలి..
ఇరుపక్షాల ప్రచారశైలిలు భిన్నంగా ఉన్నాయి. ఎన్డీఏ కూటమి భారీ ర్యాలీలు ఆర్భాటానికి ప్రాధాన్యమిస్తే.. ఇండియా అలయన్స్ హడావుడికి దూరంగా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలు, సంఘాలతో కలిసి ప్రచారం చేసింది. మరోవైపు ప్రియాంకాగాంధీ కూడా అమేఠీ, రాయబరేలీ నగరాల్లో స్ట్రీట్ కార్నర్ సభలను నిర్వహించింది. ఫలితంగా పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాల్లో సమాజ్వాదీ పార్టీ అత్యధిక సీట్లు సాధించింది. చివరికి గతంలో భాజపా బలంగా ఉన్న బూందేల్ ఖండ్లో విజయాలు నమోదు చేసింది.
ఉల్లి సమస్య దెబ్బ కొట్టిందా..
ఇండియా కూటమి బలంగా ఎదిగిన ప్రాంతాల్లో మహారాష్ట్ర ఒకటి. ఇక్కడ 12 లోక్సభ నియోజకవర్గాల్లో ఉల్లిపాయ పంట ప్రధాన ఆదాయవనరు. దీనిని ఆనియన్ బెల్ట్ అంటారు. గతంలో ఈ స్థానాలు మొత్తంలో ఏకపక్షంగా ఎన్డీఏకు దక్కాయి . కానీ, ఈసారి వీటిల్లో ఏడు సీట్లు ఇండియా అలయన్స్ పక్షానికి మొగ్గాయి. 2023 నుంచి కేంద్రం ఉల్లి ఎగుమతుల పాలసీల్లో తరచూ మార్పులు చేస్తుండటంతో రైతులు, వ్యాపారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఫలితంగా ఇక్కడ ఎగుమతుల్లో అత్యంత కీలకమైన దిందోరీ సీటు శరద్పవార్ పార్టీ పక్షానికి మొగ్గగా.. ఇక నాసిక్ సీటు శివసేన ఉద్ధవ్ వర్గానికి వెళ్లింది. మరోవైపు శివసేన, ఎన్సీపీని చీల్చడాన్ని మహారాష్ట్ర ఓటర్లలోకి కూటమి బలంగా తీసుకెళ్లింది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న శరద్పవార్పై భాజపా ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఆయనకు సానుభూతిని తీసుకొచ్చాయి.
పార్టీలో చేరికలపై ప్రజల్లోకి వెళ్లి..
ప్రతిపక్ష పార్టీ నేతలను అధికార పక్షం ఆకర్షించడాన్ని ఇండియా కూటమి బలంగానే ప్రచారం చేసింది. ముఖ్యంగా ఆదర్శ్ కుంభకోణంలో ఉన్న అశోక్ చవాన్ వంటివారిని కూడా చేర్చుకోవడంతో భాజపా చెడ్డపేరు తెచ్చుకొంది. ఇక ఆప్ ‘వాషింగ్ మిషిన్ బ్లాక్ మ్యాజిక్’ పేరిట ప్రచారం కూడా ప్రారంభించింది. దాదాపు 100 మందికిపైగా ప్రతిపక్ష నేతలను చేర్చుకోవడం ఇండియా కూటమికి ప్రచార ఆయుధంగా మారింది.
ఇండియా కూటమి ధరలు, నిరుద్యోగం, రిజర్వేషన్లు..
ఈ ఎన్నికల్లో ప్రచారానికి ఇండియా అలయన్స్ నిర్దిష్టమైన అంశాలను ఎంచుకొంది. అధికార పక్షంపై విమర్శలు చేస్తూనే.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలను బలంగా ప్రచారం చేసింది. మరోవైపు 2019లో జాతీయ భద్రత వలే ఈసారి భాజపా వద్ద కచ్చితమైన ప్రధాన ప్రచారాస్త్రం ఏమీ లేదు. దీంతో కమలదళ ఎన్నికల పోరు కొంచెం గాడి తప్పింది. మంగళ సూత్రాలు, తిరిగే ఆత్మ (శరద్పవార్), ఓబీసీ రిజర్వేషన్లలో కోత వంటి అంశాలను ఏకంగా ప్రధాని ప్రస్తావించడం చేటు చేశాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో మైనార్టీల్లోని కొన్ని వర్గాలు యూపీలో భాజపాకు అండగా నిలిచాయి. కానీ, తాజా వ్యాఖ్యలు వారిని ఆ పార్టీకి దూరం చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక