Pawan Kalyan: రాజకీయాల్లోనూ ‘పవర్’ స్టార్!
సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవన్కల్యాణ్ ‘పవర్’స్టార్గా నిలిచారు. అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్ మాదిరి... ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకున్న వాళ్లే రాజకీయాల్లో హీరో అని నిరూపించారు.
తగ్గి నెగ్గిన పవన్కల్యాణ్
బలాలు, బలహీనతలపై స్పష్టమైన అంచనా
ఆవేశం ఎంతో ఓర్పూ అంతే
ప్రజారాజ్యాన్ని మించిన విజయం
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసం నుంచి విజయవాడకు బయలుదేరే ముందు పవన్ కల్యాణ్కు హారతి ఇస్తున్న ఆయన భార్య అన్నా. చిత్రంలో పవన్ కుమారుడు అకీరా నందన్
ఈనాడు-అమరావతి: సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవన్కల్యాణ్ ‘పవర్’స్టార్గా నిలిచారు. అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్ మాదిరి... ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకున్న వాళ్లే రాజకీయాల్లో హీరో అని నిరూపించారు. అవసరమైనప్పుడు ఆవేశాన్ని ప్రదర్శించినా అంతే మొత్తంలో ఓర్పును ప్రదర్శిస్తూ రెండింటినీ సమన్వయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఒక తారలా వెలుగొందారు. అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నా జగన్ ప్రభుత్వం దురంహకారంతో వ్యవహరించినా తెలివైన ఎత్తుగడలతో దీటుగా ఎదుర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం సాధించిన 18 స్థానాల కన్నా అధిక సీట్లు గెలుచుకుని జనం మనసుల్లోనూ రాజకీయస్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. తొలిసారి తన పరివారంతో శాసనసభలో అడుగుపెడుతున్నారు.
కామన్మ్యాన్ బంధువు
2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయ కార్యకలాపాల్లోకి అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ 18 స్థానాలు గెలుపొందింది. ఆ తర్వాత అనేక ఆటుపోట్లు ఎదుర్కొని చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అప్పటి పరిస్థితులతో సంఘర్షణ పడ్డ పవన్కల్యాణ్ తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తన అన్నయ్య చిరంజీవికి ఇష్టం లేకపోయినా తిరిగి జనసేన పేరుతో పార్టీని ప్రారంభించి 2014 ఎన్నికల్లోనే భాజపా, తెలుగుదేశం పార్టీలకు మద్దతు పలికారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా.. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనుభవజ్ఞుడైన పాలకుడు చంద్రబాబు అవసరాన్ని గుర్తించి మద్దతు తెలిపారు. ఎన్నికల్లో ఈ పార్టీల విజయానికి ప్రచారమూ చేశారు. నాడు ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటయ్యేందుకు తన వంతు పాత్ర పోషించారు. 2019 ఎన్నికల నాటికి ఆయన తెదేపా, భాజపాలను వీడి బయటకు వచ్చారు. కమ్యూనిస్టు పార్టీలతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఆ ఎన్నికల్లో 160కు పైగా స్థానాల్లో జనసేన పోటీ చేసింది. పవన్కల్యాణ్ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాలు రెండింటిలోనూ ఓడిపోయారు. ఈ ఓటమిని సైతం తట్టుకొని కొద్ది రోజుల్లోనే మళ్లీ పోరాటం ప్రారంభించి ఈ స్థాయి విజయాన్ని సాధించారు. కామన్మ్యాన్ ఆలోచనకు తగ్గట్లుగా తాను నడుచుకుంటానని చెప్పే పవన్కల్యాణ్ జనం నాడి పట్టుకోవడంలో సఫలమయ్యారు.
తొలుత భాజపాతో పొత్తు
రాజకీయంగా అడుగులు వేయడంలో పవన్కల్యాణ్ ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. భవిష్యత్తు ముఖచిత్రాన్ని ముందే అంచనా వేసిన ఆయన 2020 జనవరిలోనే భాజపాతో పొత్తు ప్రకటించారు. దిల్లీ వెళ్లి భాజపా పెద్దలతో మాట్లాడి వచ్చిన పవన్.. సంక్రాంతి పండుగ రోజుల్లోనే తాను భాజపాతో బేషరతుగా పొత్తు పెట్టుకుంటున్నట్లు విజయవాడలో ప్రకటించారు. పవన్కల్యాణ్ అభిమాన గణం, యువతీ యువకులు ఆయనకు అనునిత్యం అండగా నిలిచారు. ఒక వైపు పార్టీ క్రియాశీల సభ్యత్వం పెంచుకోవడం, పార్టీ శిక్షణ కార్యక్రమాలు.. మరోవైపు ప్రభుత్వ విధానాలపై వ్యతిరేక పోరాటాలు నిర్వహించారు.
ముందస్తు అంచనాలు..
ప్రజారాజ్యం పార్టీ కాలం నుంచి రాజకీయాలను చాలా దగ్గరి నుంచి పరిశీలిస్తున్న పవన్కల్యాణ్కు తన బలాలు, బలహీనతలపై చాలా స్పష్టమైన లెక్కలు ఉన్నాయి. 2019 ఎన్నికల ఫలితాలు ఆయనకు మంచి అనుభవాన్ని అందించాయి. ఎక్కడ పర్యటనకు వెళ్లినా మధ్యతరగతి వర్గాలు, వివిధ వృత్తుల వారితో మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చే నైపుణ్యమూ ఆయన సొంతం. దేశంలోని అనేక రాజకీయ పార్టీల ఉత్థాన పతనాలపై, వారి రాజకీయ సిద్ధాంతాలపై జనసేన అధిపతికి స్పష్టమైన అవగాహన ఉంది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రజాభిమానాన్ని కోల్పోయిందని చాలా ముందే అంచనా వేశారు. అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని 2021లోనే ఇప్పటం సభలో పవన్కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఆ పరిణామంతో నాడే రాష్ట్ర రాజకీయం కొత్త మలుపు తిరిగింది. విశాఖ వెళ్లిన తనను పోలీసులు అడ్డుకున్నప్పుడు, ఇప్పటం గ్రామస్థులు జనసేన సభకు స్థలం ఇవ్వడంతో వారి ఇళ్లు కూల్చినప్పుడు, చంద్రబాబు అరెస్టు సమయంలో తాను మంగళగిరి వస్తోంటే రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు నిలువరించినప్పుడు పవన్ ఆవేశంగా స్పందించారు. రాజకీయాల్లో ఎప్పుడు ఎంత దూకుడుగా వెళ్లాలో అంతే దూకుడు ప్రదర్శించారు.
బలాలు, బలహీనతలపై పక్కా లెక్క
రాజకీయాల్లోనూ టైమింగ్ చాలా ముఖ్యం. చంద్రబాబు అరెస్టు సమయంలో రాజమహేంద్రవరం జైలులో ఆయన్ని పరామర్శించి తెదేపాతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్ ప్రకటించిన తీరు నాడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. చంద్రబాబు అరెస్టుతో నాటి ప్రజాగ్రహాన్ని సరిగ్గా గుర్తించి.. జనసేన అధిపతి తీసుకున్న నిర్ణయం రాజకీయ ఉద్దండులను ఆశ్చర్యపరిచింది. భాజపాతో సంబంధం లేకుండానే నాడు తెదేపాతో పొత్తు ప్రకటించారు. ఆ తర్వాత భాజపాను కూడా ఈ పొత్తులోకి తీసుకురావడానికి పవన్కల్యాణ్ దిల్లీలోనూ, విజయవాడలోనూ కృషి చేశారు. తొలుత జనసేనకు 24 శాసనసభ స్థానాలు, 3 లోక్సభ స్థానాలు ఇచ్చేలా తెదేపాతో పొత్తు కుదిరింది. ఆ తర్వాత భాజపా పెద్దలు పొత్తు కుదుర్చుకునేందుకు రాగా.. వారి డిమాండ్ నెరవేర్చేందుకు పవన్ మూడు శాసనసభ స్థానాలు, ఒక లోక్సభ స్థానాన్ని త్యాగం చేశారు. చివరికి తన సోదరుడు నాగబాబు పోటీ చేయాలనుకున్న అనకాపల్లి స్థానాన్ని భాజపా కోసం వదులుకున్నారు. కేవలం 21 స్థానాలకే పరిమితమయ్యే విషయంలో ఇంటా, బయటా విమర్శలు వస్తే దీటుగా ఎదుర్కొన్నారు.
జనసేనానికి ఘన స్వాగతం
గన్నవరం విమానాశ్రయంలో జనసేనాని పవన్ దంపతులకు స్వాగతం పలుకుతున్న నాయకులు
గన్నవరం గ్రామీణం, హైదరాబాద్, న్యూస్టుడే: ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం సాయంత్రం విజయవాడ చేరుకున్నారు. సతీమణి అన్నా లెజ్నోవా, కుమారుడు అకీరా నందన్, సినీనటుడు సాయిధరమ్ తేజ్లతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చారు. జనసైనికులు, అభిమానులు, తెదేపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో మంగళగిరి బయలుదేరి వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం