Congress: పోరాడినా బోణీ కొట్టని కాంగ్రెస్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి 2014లో, 2019లో... ఇప్పుడు 2024లోనూ ఒక్క సీటు కూడా దక్కలేదు. ఈసారి ఒకట్రెండు సీట్లయినా సాధించుకోవాలన్న కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి.
వరుసగా మూడోసారీ తీవ్ర నిరాశే
కడప ఎంపీ నియోజకవర్గంలో 1,41,039 ఓట్లతో తృతీయ స్థానంలో షర్మిల
కర్నూలు, నెల్లూరులో కాస్త ఉనికి చాటుకున్న పార్టీ
ఈనాడు, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి 2014లో, 2019లో... ఇప్పుడు 2024లోనూ ఒక్క సీటు కూడా దక్కలేదు. ఈసారి ఒకట్రెండు సీట్లయినా సాధించుకోవాలన్న కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. 156 శాసనసభ, 23 లోక్సభ స్థానాల్లో పోటీ చేసినా ఒక్కచోటా బోణీ కొట్టలేదు. మూడు లోక్సభ, మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు 50 వేల నుంచి లక్షకుపైగా ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు దక్కిన ఊరట ఇదే. విభజిత ఏపీలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకమైన నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల ముందు వై.ఎస్.షర్మిల రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక ఆ పార్టీకి జవసత్వాలొచ్చాయి. ఈ ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిల 1,41,039 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. కర్నూలు, తిరుపతి, నెల్లూరు, రామహేంద్రవరం లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన రాంభూపాల్ యాదవ్కు 70,373, చింతామోహన్కు 65,523, కొప్పుల రాజుకు 54,844, గిడుగు రుద్రరాజుకు 32,508 ఓట్లు వచ్చాయి. ముక్కోణపు పోటీల్లో శాసనసభ నియోజకవర్గాలైన చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ 41,859 ఓట్లు, మడకశిరలో సుధాకర్ 17,380 ఓట్లను సాధించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ షర్మిలకు మద్దతుగా కడపలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు.
కడప గడ్డపై వైకాపాకు ముచ్చెమటలు
కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన షర్మిల వైకాపాకు ముచ్చెమటలు పట్టించినా... ఫలితాల్లో మూడో స్థానానికి పరిమితమయ్యారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్రెడ్డికి సీఎం జగన్ మరోసారి టికెట్ ఇవ్వడం షర్మిలకు ఆగ్రహం కలిగించింది. అవినాష్ ఓటమే లక్ష్యంగా బరిలో దిగారు. ఆమెకు దివంగత వివేకా కుమార్తె సునీత తోడై ప్రచారం చేశారు. వీరిద్దరి ప్రచారం కడప లోక్సభ నియోజకవర్గంలోని వైకాపా శిబిరంలో కలకలం సృష్టించింది. వివేకా హత్య కేసులో నిందితులను సీఎం జగన్ కాపాడుతున్నారని, ఇవి న్యాయానికి, నేరానికి జరుగుతున్న ఎన్నికలంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి జగన్ తాకట్టు పెట్టారని జగన్పై ఘాటైన విమర్శలు చేశారు. కడపలో స్టీల్ప్లాంట్ ఏర్పాటులో వైఫల్యాన్ని ఎండగట్టారు. షర్మిల చేసిన విమర్శలు, ఆరోపణలపై సీఎం జగన్, కడప ఎంపీ అభ్యర్థి అవినాష్రెడ్డిలు ఎన్నికల సభల్లో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. సీఎం సతీమణి భారతి కడప లోక్సభ నియోజకవర్గంలో ప్రచారం చేయాల్సి వచ్చింది. షర్మిల తర్వాత అత్యధికంగా కర్నూలులో పోటీ చేసిన రాంభూపాల్ యాదవ్కు 70,373 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ముస్లిం ఓటర్లు ఆయనకు మద్దతివ్వడంతో భారీ సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయి. నెల్లూరు నుంచి పోటీ చేసిన కొప్పుల రాజుకు 54,844 ఓట్లు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో గతంలో కలెక్టర్గా పని చేసినప్పుడు ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రజలు ఓట్లేశారు. కాకినాడ, బాపట్ల నుంచి పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం 41,673, ఎం.ఎం.పళ్లంరాజు 21,109 ఓట్లతో మూడో స్థానాల్లో నిలిచారు. మిగిలినచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు.
ముక్కోణపు పోటీలో మూడో స్థానానికి...
శాసనసభకు పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో కాంగ్రెస్ ప్రయోగాలు చేసినా ఫలించలేదు. కాంగ్రెస్ నుంచి పలువురు పార్టీ టికెట్లు ఆశించినా వారిని పక్కన పెట్టి వైకాపా నుంచి బయటకొచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యమిచ్చారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, తిరుపతి జిల్లా పూతలపట్టులో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఏలూరు జిల్లా చింతలపూడిలో ఎమ్మెల్యే ఎలీజా పోటీ చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి మాజీ ఎమ్మెల్యే మురళి, ప్రకాశం జిల్లా చీరాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, సత్యసాయి జిల్లా మడకశిరలో సుధాకర్ పోటీ చేశారు. చీరాల, మడకశిరలో త్రిముఖ పోటీలో కాంగ్రెస్కు విజయావకాశాలపైనా పెద్దఎత్తున చర్చ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీలైన కూటమి, వైకాపా అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. మడకశిరలో సుధాకర్కు మద్దతుగా మొదట ప్రచారం చేసిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి చివరి క్షణంలో మిన్నకుండిపోయారు. దీంతో 17,380 ఓట్లతో సుధాకర్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చినా విజయం వరించలేదు. వైకాపా నుంచి వచ్చి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సిటింగ్ ఎమ్మెల్యేలు ఆర్థర్కు 7,949 ఓట్లు, ఎంఎస్ బాబుకు 2,820, ఎలీజాకు 4,958 ఓట్లు వచ్చాయి. ఇండియా కూటమిలో భాగంగా 18 శాసనసభ, మరో రెండు లోకసభ నియోజకవర్గాల్లో సీపీఎం, సీపీఐల అభ్యర్థులకు మద్దతిచ్చినా ప్రతికూల ఫలితాలొచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!