DK Shivakumar: బాధపడటం లేదు.. ఇంకా చాలా ప్రయాణం మిగిలివుంది..
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ను కాంగ్రెస్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీనిపై డీకే స్పందిస్తూ.. కోర్టు తీర్పు మాదిరి అధిష్ఠానం నిర్ణయాన్ని తాను పాటించాల్సిందేనన్నారు.
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM)గా పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah)ను కాంగ్రెస్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మొదటి నుంచి సీఎం పదవి రేసులో ఉన్న డీకే శివకుమార్ (DK Shivakumar)కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. ఈ పరిణామంపై డీకే స్పందిస్తూ.. మనమంతా ఓ కోర్టు తీర్పును స్వీకరించినట్లుగానే తానూ పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని శిరసావహిస్తున్నట్లు చెప్పారు. అధిష్ఠానం నిర్ణయం విషయంలో బాధపడటం లేదని.. ఇంకా చాలా దూరం ప్రయాణం మిగిలి ఉందన్నారు.
‘సీఎం ఎంపిక అంశాన్ని మొదటినుంచి అధిష్ఠానానికే వదిలేశాం. వారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నేను హైకమాండ్ నిర్ణయాన్ని పాటించాల్సిందే. వ్యక్తిగత ప్రయోజనాలకన్నా పార్టీ ప్రయోజనాలే ముఖ్యం’ అని శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ‘సీఎం ఎంపిక విషయంలో పార్టీ అధిష్ఠాన నిర్ణయం తుదితీర్పు లాంటిది. మనలో చాలా మంది కోర్టులో వాదిస్తూ ఉంటారు. చివరకు న్యాయమూర్తి చెప్పినదాన్ని వింటాం. అదే విధంగా ఇక్కడ నేను పార్టీ హైకమాండ్ తీర్పును అంగీకరిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు.
‘ఒకవేళ కర్ణాటకలో కాంగ్రెస్ గెలవకపోతే పరిస్థితి ఏమై ఉండేది? కానీ, మేం గెలిచాం. కాబట్టి, దాని ఫలాలను అందుకోవాలి. ఇది నా ఒక్కడి విజయం కాదు.. లక్షలాది మంది కార్యకర్తల శ్రమ ఇందులో ఉంది. వారి వైపునుంచి కూడా ఆలోచించాలి. ప్రజలు ఇంతటి భారీ విజయాన్ని అందించినప్పుడు.. కచ్చితంగా ఆనందపడాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఇదే మా ప్రధాన అజెండా’ అని తెలిపారు. ఇదిలా ఉండగా.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతోపాటు రాష్ట్ర పీసీసీ అధ్యక్ష బాధ్యతలను కూడా ఆయనే నిర్వహిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన