Nitish: భాజపాతో మళ్లీ జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలు : నీతీశ్
భాజపాతో (BJP) మళ్లీ కలిసి పనిచేసే ప్రసక్తే లేదని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (Nitish Kumar) స్పష్టం చేశారు. దానికి బదులు చనిపోవడమే మేలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (Nitish Kumar) భాజపాపై ఉన్న అసంతృప్తిని మరోసారి బయటపెట్టారు. భాజపాతో మళ్లీ కలిసి పనిచేసే అంశాన్ని తోసిపుచ్చిన ఆయన.. వారితో జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలని వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సమయంలో తమ నుంచి కాషాయ పార్టీనే లాభపడిందన్న నీతీశ్.. వారికి దూరంగా ఉండే ఓ వర్గం ఓట్లతోనూ భాజపా ప్రయోజనం పొందిందని చెప్పారు. ప్రజామోదం లేని ముఖ్యమంత్రితో మళ్లీ కలిసి పనిచేసే ప్రసక్తే లేదంటూ బిహార్ భాజపా శ్రేణులు చేస్తోన్న ప్రకటనలపై నీతీశ్ కుమార్ ఈవిధంగా స్పందించారు.
బిహార్లో వచ్చే ఎన్నికల్లో 40లోక్సభ స్థానాలకు గాను 36 చోట్ల గెలుస్తామని భాజపా చెప్పడంపైనా నీతీశ్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్తోపాటు ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్లపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని.. 2017లో ఎన్డీఏలోకి వచ్చి తప్పిదం చేశానని నీతీశ్ కుమార్ ఉద్ఘాటించారు.
‘జేడీయూతో కలిసి పనిచేస్తామంటూ వచ్చే వదంతులను పార్టీ కేడర్లో కట్టడి చేశాం. అయితే, లోలకం మాదిరిగా ఊగిసలాడే అలవాటు ముఖ్యమంత్రికి (నీతీశ్) ఉంది. మరోసారి ఆయన చేతిలో మోసపోయేందుకు సిద్ధంగా లేము’ అని భాజపా బిహార్ చీఫ్ సంజయ్ జైశ్వాల్ ఇటీవల పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు ప్రజామోదం లేదని.. ద్రోహం చేసే అలవాటున్న ఆయనతో జట్టు కట్టే ప్రసక్తే లేదన్నారు. ఇదే విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బిహార్ సీఎం నీతీశ్ కుమార్ స్పందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ