Kejriwal: మళ్లీ భాజపా గెలిస్తే.. ఆ నేతలు కటకటాల్లోకే..: కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు

దేశంలో మరోసారి భాజపా అధికారంలోకి వస్తే పలువురు కీలక నేతల్ని జైలుకు పంపుతుందని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

Published : 18 May 2024 00:04 IST

భీవాండి: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ దిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భీవాండిలో జరిగిన సభలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతోన్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా మరోసారి గెలిచి అధికారంలోకి వస్తే ఎన్సీపీ (ఎస్‌పీ) అధ్యక్షుడు, కేంద్ర మాజీమంత్రి శరద్‌ పవార్‌, శివసేన (యూబీటీ) చీఫ్‌, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను కటకటాల్లోకి నెడుతుందని వ్యాఖ్యానించారు. పేద ప్రజలకు ఉన్నతస్థాయి విద్యను అందించడం, మెరుగైన వైద్య వ్యవస్థను నిర్మించడం వల్లే తనను అరెస్టు చేయించి జైలుకు పంపారని ఆరోపించారు.  

మెజార్టీ రాకపోతే.. ‘ప్లాన్‌ బి’ ఉందా..? అమిత్‌ షా సమాధానమిదే..

తానేమీ తన కోసం ఓట్లు అడగడం లేదని.. దేశాన్ని రక్షించేందుకు అభ్యర్థిస్తున్నానని భీవాండిలో ప్రజలతో అన్నారు. బీజేపీ గెలవదు గానీ.. ఒకవేళ జూన్ 4న గెలిస్తే మాత్రం సుప్రియాసూలే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేలను జైలుకు పంపుతుందని వ్యాఖ్యానించారు. జైలులో ఉన్న సమయంలో మధుమేహంతో బాధపడుతున్న తనకు 15 రోజుల పాటు మందులు ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని ఈసందర్భంగా కేజ్రీవాల్‌ ఆరోపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని