Mallikarjun Kharge: భాజపా చేతికి పగ్గాలొద్దు
భాజపా తమను పాలించకూడదనేది ప్రజల ఆకాంక్ష అని, అది నెరవేరేలా సరైన సమయంలో తగిన అడుగులు వేయాలని ఇండియా కూటమి నిర్ణయించుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.
ప్రజల మనోభీష్టం ఇదే
తగిన సమయంలో ‘సరైన’ అడుగులు వేస్తాం
మరికొన్ని పార్టీలు మాతో చేతులు కలపాలి
ఇండియా కూటమి నేతల తొలిభేటీలో ఖర్గే
దిల్లీ: భాజపా తమను పాలించకూడదనేది ప్రజల ఆకాంక్ష అని, అది నెరవేరేలా సరైన సమయంలో తగిన అడుగులు వేయాలని ఇండియా కూటమి నిర్ణయించుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో పనితీరు మెరుగుపరచుకున్న తర్వాత కూటమి పక్షాలతో బుధవారం సాయంత్రం ఆయన తన నివాసంలో తొలిసారి సమావేశమయ్యారు. దాదాపు రెండుగంటలసేపు ఇది కొనసాగింది. అనంతరం ఖర్గే విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రస్తుతం తాము ఎలాంటి ప్రయత్నం చేయడంలేదని, మోదీ నేతృత్వంలోని ఫాసిస్టు పాలనపై పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ‘..కచ్చితంగా ఈసారి తీర్పు మోదీకి, ఆయన తరహా రాజకీయాలకు వ్యతిరేకంగా వచ్చినదే. వ్యక్తిగతంగానూ ఆయనకు భారీ రాజకీయ నష్టమిది. నైతికంగానైతే స్పష్టంగా ఆయన ఓడిపోయారు. అయినా ప్రజాతీర్పును కాలరాయడానికే ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం రాజ్యాంగం కల్పించిన నిబంధనలకు, రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన విలువలకు కట్టుబడి ఉండే అన్ని పక్షాలనూ మా కూటమి ఆహ్వానిస్తోంది. ప్రజావాంఛ నెరవేర్చడానికి అవసరమైన చర్యలు చేపడుతుంది. దీనిపై ఏకగ్రీవంగా నిర్ణయించింది’ అని చెప్పారు. భాగస్వామ్య పక్షాలన్నీ ఎన్నికల్లో ఐక్యంగా, దృఢ సంకల్పంతో, చక్కగా పోరాడాయని కొనియాడుతూ వాటికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలపై ఇండియా కూటమి నేతలు కీలకమైన సమాలోచనలకు శ్రీకారం చుట్టారు. మాజీ భాగస్వాములైన తెదేపా, జేడీయూ వంటి పార్టీల నుంచి మద్దతు పొందడానికి ఎంతమేరకు అవకాశం ఉంటుందనేది వారు ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో భాజపా 240 సీట్లు సాధించగా 99 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయేకి 293 సీట్లతో మెజారిటీ ఉండగా, విపక్ష కూటమి 234 వద్ద ఆగిపోయింది. దీంతో సంఖ్యాబలాన్ని పెంచుకునే అవకాశాలపై ఇండియా కూటమి దృష్టిసారించింది. సమావేశంలో ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు- సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకా గాంధీ; తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, టి.ఆర్.బాలు (డీఎంకే); ఝార్ఖండ్ సీఎం చంపయీ సోరెన్, కల్పనా సోరెన్ (జేఎంఎం); శరద్పవార్, సుప్రియా సూలే (ఎన్సీపీ-ఎస్పీ); అఖిలేశ్ యాదవ్, రాంగోపాల్ యాదవ్ (ఎస్పీ); సంజయ్సింగ్, రాఘవ్ చడ్డా (ఆప్); సంజయ్ రౌత్, అరవింద్ సావంత్ (శివసేన యూబీటీ); ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), అభిషేక్ బెనర్జీ (తృణమూల్), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ) పాల్గొన్నారు.
తెదేపా, జేడీయూపై ఇంకా చర్చించలేదు: పవార్
కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మద్దతు కోసం తెదేపా, జేడీయూలను సంప్రదించాలా అనే విషయం ఇంకా చర్చించుకోలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్పవార్ అంతకుముందు విలేకరులకు చెప్పారు. నరేంద్ర మోదీ సర్కారు పనితీరుపై ఓటర్లలో ఆగ్రహం, అసంతృప్తి ఉన్నాయని చెప్పారు. ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలా, వద్దా అనేది తెదేపా అధినేత చంద్రబాబు, జేడీయూ అగ్రనేత నీతీశ్కుమార్ నిర్ణయించుకోవాలని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. ‘‘నిరంకుశవాదితో చేతులు కలిపి ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేయాలా వద్దా అనేది చంద్రబాబు, నీతీశ్ తేల్చుకోవాలి. వారు అలా వెళ్తారని నేనైతే అనుకోవడం లేదు. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని మోదీ ఏర్పాటుచేయలేరు’’ అని రౌత్ పేర్కొన్నారు.
వేచి చూడండి: తేజస్వి
విపక్ష కూటమిలో తెదేపా, జేడీయూ చేరుతాయా లేదా అనే విషయంలో వేచి చూడాలని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కోరారు. ఈ ఎన్నికల్లో కింగ్మేకర్లా బిహార్ అవతరించిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
29న దిల్లీ జంతర్మంతర్లో మహిళా ధర్నా
మహిళా రిజర్వేషన్ చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందినా మోదీ ప్రభుత్వం అమలు చేయనందుకు, ఈ చట్టంలో ఓబీసీ వర్గాల మహిళలను చేర్చనందుకు నిరసనగా ఈ నెల 29న దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?