Modi: ‘పాలే లేవు .. నెయ్యి కోసం కొట్లాట’: విపక్ష కూటమిపై మోదీ ఎద్దేవా
విపక్ష కూటమిలో నేతలు ప్రధాన మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారని మోదీ (Modi) వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
చండీగఢ్: సార్వత్రిక ఎన్నికల సమరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రధాని మోదీ (Modi) విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. విపక్ష ‘ఇండియా’ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆయన హరియాణాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.
విపక్ష కూటమి గురించి మాట్లాడుతూ.. ఆవు ఇంకా పాలు ఇవ్వనేలేదు. కానీ, అక్కడ నెయ్యి కోసం ఘర్షణ మొదలైందని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి పదవిని ఉద్దేశించి ఆయన ఈ మాటన్నారు. అలాగే ఐదు సంవత్సరాలకు ఐదుగురు పీఎంలు అని వారే చర్చించుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ ఎన్నికల్లో మీ ఓటు ప్రధానిని ఎన్నుకోవడంతో పాటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీకు ఒక వైపు మీరు పరీక్షించిన సేవకుడు మోదీ ఉన్నాడు.. అవతలివైపు ఉన్న కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారో తెలీదు. ఇండియా బ్లాక్లో కులతత్వం, మతతత్వం, బంధుప్రీతి ఎక్కువ. మోదీ ఉన్నంతకాలం దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను ఎవరూ దోచుకోలేరు. హరియాణా ప్రజలు నాపై ఎంతో ప్రేమను కురిపించారు. మీతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది’’ అంటూ మోదీ మాట్లాడారు.
‘ఇండియా’ కూటమి క్యాన్సర్ కంటే భయంకరం
‘‘1962లో మనం చైనా చేతిలో ఓటమి చవిచూశాం. ఆ ఓటమికి వారు(కాంగ్రెస్) సైన్యాన్ని బాధ్యుల్ని చేశారు. మన మిలిటరీని కించపరిచే అవకాశాల కోసం ఆ పార్టీ ఇప్పటికీ ఎదురుచూస్తోంది. పశ్చిమ్ బెంగాల్లో రాత్రికిరాత్రి ముస్లింలకు ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేశారు. వాటిని అందుకున్నవారిలో చొరబాటుదారులు కూడా ఉన్నారు. ఇప్పుడు అవి చెల్లవని కోర్టు తీర్పు ఇచ్చింది’’ అని దుయ్యబట్టారు. విపక్ష పార్టీలు అధికారంలోకి వస్తే.. తమ హయాంలో జరిగిన అభివృద్ధి ఫలాలను వారి ఓటు బ్యాంకుకు అప్పగిస్తారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది: హోంమంత్రి అనిత
వైకాపా ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. -
భారీ మెజార్టీతో నాపై బాధ్యత మరింత పెరిగింది: ‘ప్రజా దర్బార్’లో లోకేశ్
మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహించినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశామన్నారు. -
క్యాబినెట్లో యువతకు ప్రాధాన్యాన్ని స్వాగతిస్తున్నాం: యనమల రామకృష్ణుడు
‘‘రాష్ట్ర మంత్రివర్గంలో యువతకు ప్రాధాన్యం కల్పిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్గం కూర్పులో 50% కంటే ఎక్కువమంది యువతకు మంత్రి పదవులు ఇచ్చారు’’ అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. -
నాడు డీజీపీ కార్యాలయం గేటు బయటే అడ్డగించారు.. నేడు ప్రొటోకాల్తో లోపలికి..
‘‘మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై డీజీపీకి వినతిపత్రం ఇద్దామని వెళ్తే కార్యాలయం గేటు లోపలకు కూడా అనుమతించకుండా రోడ్డుపైనే అడ్డగించారు. హెడ్కానిస్టేబుల్కు ఇచ్చి వెళ్లిపోవాలంటూ జులుం చూపారు. ఇదే డీజీపీ కార్యాలయం లోపలకు ప్రొటోకాల్తో నన్ను తీసుకెళ్లే రోజు ఒకటి వస్తుందని అప్పుడే వారికి చెప్పా. -
ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తా
రాష్ట్రానికి ఐటీ, ఎలక్ట్రానిక్ కంపెనీలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని రాష్ట్ర ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. స్టాన్ఫర్డ్లో చదువుకొన్న తనకు గ్రామీణ విద్యావ్యవస్థను బలోపేతం చేసే అవకాశం రావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. -
సంపన్న రాష్ట్రంగా చేద్దాం
‘మంత్రివర్గంలో మీతోపాటు సహచర మంత్రులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఎన్డీయే నాయకత్వంలో సమాజంలోని అన్ని వర్గాల పురోగతి, శ్రేయస్సు, సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి సమష్టిగా కృషి చేద్దాం. -
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు?
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును నియమించే అవకాశముంది. ఆయన ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించారు. -
గృహ నిర్మాణాల పూర్తికి కృషి చేస్తాం: మంత్రి పార్థసారథి వెల్లడి
అసంపూర్తిగా ఉన్న పేదల గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సచివాలయంలో శాఖాపరమైన బాధ్యతలను శుక్రవారం రాత్రి స్వీకరించారు. -
జగన్పై చర్యలు తప్పవు: గోరంట్ల
వైకాపా అయిదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. -
పెద్దిరెడ్డి పాపాల నిగ్గు తేల్చాలి
అధికారాన్ని అడ్డం పెట్టుకొని గత ఐదేళ్లలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక అక్రమాలు.. అరాచకాలకు పాల్పడ్డారని బీసీవై పార్టీ అధ్యక్షుడు బి.రామచంద్రయాదవ్ ఆరోపించారు. -
పార్లమెంటులో ఎవరికైనా అంశాల వారీగా మద్దతు
‘పార్లమెంటులో ఎన్డీయే అయినా, ఇంకెవరికైనా అంశాలవారీగానే మన మద్దతు ఉంటుంది. పార్టీ విధివిధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలి’ అని వైకాపా ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ స్పష్టం చేశారు. ‘రాజ్యసభలో 11, లోక్సభలో 4 మొత్తంగా పార్లమెంటులో మనకు 15మంది ఎంపీలున్నారు. -
శాసనమండలి వద్దన్న వారికే.. నేడు ఆ వ్యవస్థతో అవసరం వచ్చింది
శాసనమండలి వద్దన్న వారికే నేడు ఆ వ్యవస్థతో అవసరం ఏర్పడిందని.. జగన్ను ఉద్దేశించి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం మండలి సభ్యులతోనే వారు సమావేశాలు నిర్వహించుకుంటున్నారని పేర్కొన్నారు. -
రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి: వర్ల రామయ్య
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే సవిత మంత్రి పదవి దక్కించుకోవడం హర్షణీయమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. -
రెండో రోజూ సచివాలయంలో సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు వరుసగా రెండో రోజూ సచివాలయానికి రావడంతో సందడి నెలకొంది. ఆయన్ను కలిసేందుకు నేతలు, సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీఎంగా గురువారం బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. ద్వితీయ విఘ్నం ఉండకూడదని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయానికి వచ్చారు. -
సీనియర్ల సేవల్ని వినియోగించుకుంటాం
మంత్రివర్గంలో చోటు కల్పించలేని సీనియర్ నాయకుల సేవల్ని వేరే రూపంలో వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం సీనియర్ నాయకులు కొందరు చంద్రబాబును సచివాలయంలో కలిశారు. -
ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే ప్రజావిశ్వాసం కోల్పోయిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ఛుగ్ విమర్శించారు. -
దేశవిదేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆహ్వానిస్తామని సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. -
ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగుపరుస్తాం
పేద ప్రజలు, రైతాంగానికి చిత్తశుద్ధితో సేవలందించే అవకాశం పౌర సరఫరాల శాఖ ద్వారా తనకు దక్కిందని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. -
ముమ్మరంగా పని చేయాలని అమిత్షా చెప్పారు
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి హాజరైన వేదికపై కేంద్ర మంత్రి అమిత్షా.. తమిళనాడు భాజపా నాయకురాలు తమిళిసై సౌందరరాజన్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వైరల్ అయిన వీడియోలపై ఆమె స్పందించారు. -
రైతన్నకు అండగా ఉంటాం: వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
విత్తనం నుంచి విక్రయం వరకు అన్నదాతకు అండగా ఉంటామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో రైతన్నకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. -
రాష్ట్ర ప్రభుత్వ హామీలు నీటి మూటలే
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన కాంగ్రెస్ పార్టీ, 190 రోజులు దాటినా ఆచరణలో విఫలమైందని ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
అనుచిత వ్యాఖ్యలు చేసి.. యూటర్న్ తీసుకున్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త
-
వైకాపా ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది: హోంమంత్రి అనిత
-
మళ్లీ ‘మెలోడీ’ మూమెంట్.. మోదీ, మెలోనీ మరో సెల్ఫీ వైరల్
-
అనంతలో దుండగుల దుశ్చర్య.. ఓటమి అక్కసుతో తాగునీటి ట్యాంకులో పురుగుల మందు
-
తెలుగు ఐఏఎస్ కృష్ణతేజ సేవలు అభినందనీయం: డిప్యూటీ సీఎం పవన్
-
వాళ్ల స్టార్డమ్ను దృష్టిలో పెట్టుకొనే కల్కి రూపొందించా: నాగ్ అశ్విన్