BJP: భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
భారతదేశపు సంపన్న మహిళ సావిత్రి జిందాల్ (Savitri Jindal), బిజేడీ నుంచి 6 సార్లు ఎంపీగా ఎన్నికైన భర్తృహరి భాజపాలో చేరారు.
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ముంగిట భారతదేశపు సంపన్న మహిళ, హరియాణా (Haryana) మాజీ మంత్రి సావిత్రి జిందాల్ (Savitri Jindal) కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరారు. హస్తం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆమె.. గురువారం సీఎం నాయబ్ సింగ్ సైనీ, మాజీ ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఆమె తనయుడు, ప్రముఖ వ్యాపారవేత్త నవీన్ జిందాల్ (Naveen Jindal) కాంగ్రెస్ను వీడి, భాజపాలో చేరిన రోజుల వ్యవధిలోనే సావిత్రి కూడా అదే పార్టీలో చేరారు.
కుటుంబ సభ్యుల సలహా మేరకు తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన ఆమె.. గత పదేళ్లుగా ఆదరాభిమానాలు చూపించిన హిస్సార్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. భూపేంద్ర సింగ్ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా పని చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి కమల్ గుప్త చేతిలో పరాజయం పాలయ్యారు. ఫోర్బ్స్ తాజా సంపన్నుల జాబితా ప్రకారం.. సావిత్రి జిందాల్ (దివంగత పారిశ్రామిక వేత్త, మాజీ మంత్రి ఓపీ జిందాల్ సతీమణి)కి 29.1 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. భారత దేశంలో అత్యంత సంపన్న మహిళ ఆమెనే.
బీజేడీకి షాక్.. భాజపా గూటికి భర్తృహరి
సార్వత్రిక ఎన్నికల ముంగిట ఒడిశాలో అధికార బిజు జనతాదళ్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కటక్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన భర్తృహరి మెహతాబ్ భాజపాలో చేరారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. తాజా లోక్సభ ఎన్నికల్లో భాజపా ఆయనకు టికెట్ కేటాయించే అవకాశముంది. 2019 ఎన్నికల్లో భాజపా నుంచి బరిలోకి దిగిన ప్రకాశ్ మిశ్రాను.. మెహతాబ్ భారీ మెజార్టీతో ఓడించారు.
1998లో తొలిసారి ఎంపీగా ఎన్నికైన మెహతాబ్.. 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఉత్తమ చర్చ చేసినందుకు గుర్తింపుగా 2017 నుంచి 2020 వరకు నాలుగేళ్లపాటు ఆయనకు ‘సంసద్ రత్న’ అవార్డు వరించింది. బీజేడీలో అసురశక్తులు పెరిగిపోయాయని, అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించాలన్న ధ్యేయంతో ఏర్పడిన ఆ పార్టీ విలువలకు సమాధి కట్టిందన్న భర్తృహరి వ్యాఖ్యలు బీజేడీలో ఇటీవల చర్చనీయాంశమయ్యాయి. అంతలోనే ఆయన పార్టీ మారడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.