Chandra babu: ఇది నా జీవితంలో గర్వించదగ్గ రోజు
దేశ ప్రధానిగా నరేంద్రమోదీ పేరును తెలుగుదేశం పార్టీ తరఫున గర్వంగా సమర్థిస్తున్నానని, ఇది తన జీవితంలో అత్యంత గర్వించదగిన రోజని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు.
మోదీని ఎన్డీయే నేతగా ప్రకటించే సందర్భంగా చంద్రబాబు
భారతీయులు ప్రపంచ నాయకులుగా ఎదగడం చూస్తామని వ్యాఖ్య
ఆయన నాయకత్వంలో దేశం మరింత పురోగమిస్తుందని వ్యాఖ్య
ఈనాడు, దిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్రమోదీ పేరును తెలుగుదేశం పార్టీ తరఫున గర్వంగా సమర్థిస్తున్నానని, ఇది తన జీవితంలో అత్యంత గర్వించదగిన రోజని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. మానవతావాదం తప్పితే తనకు మరో వాదం తెలియదని తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ప్రకటించారని, దాన్ని ఇప్పుడు మోదీ సాకారం చేస్తున్నారని పేర్కొన్నారు. మోదీని ఎన్డీయే కూటమి నేతగా ఎన్నుకునేందుకు పాత పార్లమెంటు భవనం సెంట్రల్హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ప్రధాని మోదీ క్షణం విశ్రాంతి తీసుకోకుండా మూడు నెలలపాటు నిర్విరామంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఒకే ఉత్సాహం, స్ఫూర్తితో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి నిర్వహించిన మూడు బహిరంగ సభలు, ఒక రోడ్డుషో ఎన్నికల ఫలితాన్ని పూర్తిగా మార్చేశాయి. హోంమంత్రి అమిత్షా ఒకే ఒక శక్తిమంతమైన బహిరంగ సభతో పరిస్థితులను మార్చారు. రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డా, గడ్కరీలు వచ్చి బహిరంగ సభల్లో ప్రసంగించి కేంద్రం రాష్ట్రానికి అండగా ఉంటుందన్న విశ్వాసాన్ని కల్పించారు. దేశ చరిత్రలో ఇప్పుడు మనం సంక్లిష్టమైన కూడలిలో ఉన్నాం. మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పదేళ్లలో ఎన్నో గుర్తించదగిన పనులను ప్రారంభించింది. దానివల్ల దేశం అద్భుతమైన పురోగతి, మార్పు సాధించింది. మోదీ స్పష్టమైన దృక్పథం, అంకితభావం దేశాన్ని ప్రపంచశక్తి కేంద్రంగా మార్చింది. నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. ఎంతోమంది నాయకులను చూశా. కానీ ప్రపంచం గర్వించే స్థాయికి భారత్ను తీసుకెళ్లిన ఘనత మోదీకే దక్కుతుందని గర్వంగా చెబుతున్నా. ఆయన దేశానికి సాధించిపెట్టిన గొప్ప విజయమిది. ఆయన నాయకత్వంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. ఈసారి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయం. ఇదే సమయంలో ఆయన విజన్ 2047 పేరుతో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన నాయకత్వంలో దేశం ప్రపంచ ఒకటో/రెండో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్న పూర్తి విశ్వాసముంది. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా భారతీయులంతా అత్యధిక తలసరి ఆదాయం పొందుతున్నారు. సమీప భవిష్యత్తులో మోదీ నాయకత్వంలో భారతీయులంతా ప్రపంచ నాయకులుగా ఎదగడం చూస్తాం. ప్రభుత్వం, కార్పొరేట్, సేవల రంగంపరంగానూ మనం ప్రపంచానికి సేవలు అందించనున్నాం. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలను సమతౌల్యం చేసుకుంటూ వ్యవస్థను సమాంతరంగా నడపాలి. సమాజంలోని అన్ని స్థాయిల్లో ప్రజలకూ అభివృద్ధి ఫలాలు దక్కాలి. నేను గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూశా. కానీ ఇప్పుడు ఏదనుకుంటే దాన్ని సాధించగలిగే స్ఫూర్తిమంతమైన సమయంలో ఉన్నాం. మోదీకి ఉత్సాహం, దార్శనికత, అనుకున్న పనిని కచ్చితంగా అమలుచేసే శక్తిసామర్థ్యాలున్నాయి. తన ప్రభుత్వ విధానాలన్నింటినీ ఆయన స్పష్టంగా అమలు చేశారు. సరైన సమయంలో మోదీలాంటి సరైన నాయకుడు ఉండటం దేశానికి గొప్ప ఆస్తి. ఇది భారత్కు మంచి అవకాశం. దీన్ని కోల్పోతే ఎప్పటికీ చేజిక్కదు. ప్రపంచ దేశాలన్నీ 1-2% వృద్ధి రేటుతో సాగుతుంటే భారత్ మాత్రం పదేళ్లుగా అత్యధిక వృద్ధి రేటు సాధిస్తోంది. ఇది మరో 10, 20 ఏళ్లు కొనసాగుతుంది. మనకు అందివచ్చిన ఐటీ అవకాశాలను వినియోగించుకుంటున్నాం. యువశక్తి సాఫల్యాలను గమనిస్తున్నాం. ఇదివరకు ఎన్నడూలేని దూకుడుతో ముందడుగు వేయడానికి ప్రధాన కారణం మోదీ నాయకత్వమే. అందుకే ఎన్డీయే కూటమి తరఫున దేశ ప్రధానిగా మోదీ పేరును తెలుగుదేశం తరఫున గర్వంగా సమర్థిస్తున్నా. ఆయన నాయకత్వం వల్ల మనం పేదరికంలేని దేశంగా ఎదగడానికి అవకాశముంది. ఇది చరిత్రాత్మక ఘట్టం. తెలుగుదేశం పార్టీకి ఎన్డీయేతో తొలినుంచి అనుబంధముంది. ఈ ఎన్నికల్లో మాకు చరిత్రాత్మక విజయం లభించింది. ఏపీలో 95% సీట్లు గెలిచాం. గతంలో ఎన్నడూ ఇంతటి ఘనవిజయం లేదు. ఇది ఎన్డీయేపట్ల ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం. ఎలాంటి శషభిషలు లేకుండా పవన్కల్యాణ్, పురందేశ్వరిలతో కలిసి రాష్ట్రంలో మూడు పార్టీలు సమష్టిగా శ్రమించడంతో మంచి ఫలితాలు వచ్చాయి’ అని వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో కరచాలనం చేసి మోదీ ధన్యవాదాలు తెలిపారు.
దిల్లీలో తెదేపా అధినేత చంద్రబాబును కలిసిన ఆ పార్టీ ఎంపీలు, నేతలు
నడ్డా, అమిత్షాలతో చంద్రబాబు భేటీ
ఈనాడు, దిల్లీ: ఎన్డీయే నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎన్నుకున్న అనంతరం తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం రాత్రి భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్షాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర మంత్రివర్గ కూర్పుపై ఈ ఇద్దరు నేతలు.. భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తెలుసుకునే క్రమంలో చంద్రబాబుతో సమావేశమయ్యారు. జేపీ నడ్డా నివాసంలో సుమారు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో తెదేపా ప్రాధాన్యతల గురించి చంద్రబాబు వారికి వివరించినట్లు తెలుస్తోంది. సమావేశానంతరం ఇక్కడి 50-అశోక రోడ్డులోని నివాసానికి వచ్చిన చంద్రబాబు.. పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు