CPI Narayana: జగన్కు ఈ విషయం అర్థంకాక ఎగిరెగిరి పడుతున్నారు: సీపీఐ నారాయణ
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్రానికి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్రానికి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. కేసీఆర్ ఎన్డీయేలో కలుస్తారన్న విషయాన్ని మోదీ ఇప్పుడు ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. ప్రధాని ఇంత దిగజారి మాట్లాడతారనుకోలేదన్నారు. మోదీ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే మోదీని ఎలా నమ్మలేదో.. కేసీఆర్ను కూడా అలానే అనుమానించాల్సి ఉంటుందని నారాయణ వ్యాఖ్యానించారు. పసుపు బోర్డు ప్రకటన చనిపోయే ముందు తులసి తీర్థం పోసినట్లు ఉందన్నారు.
‘‘మోదీ చెప్పాల్సిన అసలు రహస్యం ఏపీలో విలువైన ఇసుక బీచ్లు అదానీకి అప్పగించిన విషయం. లిక్కర్ స్కాంలో ఉన్న భారాస, వైకాపా.. భాజపాతో కలిసిపోయాయి. మిగతా వాళ్లను జైల్లో ఉంచుతున్నారు. రూ.వేల కోట్ల తిన్న వాళ్లు బయట ఉన్నారు. రూ.వందల కోట్ల అవినీతి పేరుతో చంద్రబాబును జైల్లో పెట్టారు. ఆయన్నుఅక్రమ పద్ధతిలో అరెస్టు చేశారు.. అది సరికాదు. ఆయనేం దేశం వదిలి పారిపోయే వ్యక్తి కాదు.
కేంద్రంలో మోదీ, ఏపీలో జగన్ ప్రతిపక్ష నేతలను మానసికంగా ఇబ్బందులు పెట్టేలా వారిపై కేసులు పెడుతున్నారు. చంద్రబాబును దెబ్బకొడితే భాజపాకు బూస్ట్ అవుతుందనేది మోదీ ప్లాన్. ఎన్నో కేసులు ఉన్న జగన్ను పక్కన పెట్టేయడం ఆయనకు పెద్ద పనేం కాదు. జగన్కు ఈ విషయం అర్థంకాక ఎగిరెగిరి పడుతున్నారు. కక్షపూరితంగా కేసులు పెట్టడం సరికాదు. దేశంలో నిజమైన కూటమి అంటే భాజపా - భారాస- ఎంఐఎం. మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే దేశం ఉత్తర భారత్, దక్షిణ భారత్ అంటూ విడిపోయే ప్రమాదం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు నిశ్చితార్థం వరకే వచ్చింది. ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఏపీలో ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి. మా పార్టీకి సంబంధించి అక్కడ పొత్తులపై ఇప్పుడేం ఆలోచించలేదు’’ అని నారాయణ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?