Jagga Reddy: కేసీఆర్‌కు నష్టం జరగొద్దనే బండి సంజయ్‌ తొలగింపు: జగ్గారెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారాస అధినేత కేసీఆర్‌కు నష్టం జరగకూడదనే భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఆరోపించారు.

Published : 22 Feb 2024 16:47 IST

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారాస అధినేత కేసీఆర్‌కు నష్టం రాకూడదనే భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భాజపాకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని.. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బండి సంజయ్‌ను  అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు