Janasena: మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన
జనసేన పార్టీ మరో అభ్యర్థిని ప్రకటించింది. విశాఖపట్నం దక్షిణ శాసనసభ స్థానం జనసేన అభ్యర్థిగా సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖరారు చేశారు.
విశాఖ: జనసేన పార్టీ మరో అభ్యర్థిని ప్రకటించింది. విశాఖపట్నం దక్షిణ శాసనసభ స్థానం జనసేన అభ్యర్థిగా సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన.. ఆదివారం ఉదయం పార్టీ ముఖ్యులతో వివిధ అంశాలపై చర్చించారు. ప్రచార కార్యక్రమాలు, కూటమిలో భాగంగా పార్టీల మధ్య సమన్వయం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ క్రమంలో విశాఖ దక్షిణ స్థానం అభ్యర్థిని ప్రకటించారు. భాజపా, తెదేపాతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 19 అసెంబ్లీ స్థానాలకు, రెండు ఎంపీ స్థానాలలకు అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. అవనిగడ్డ, పాలకొండ శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఇప్పటివరకు ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థులు..
- పిఠాపురం- పవన్ కల్యాణ్
- నెల్లిమర్ల - లోకం మాధవి
- అనకాపల్లి - కొణతాల రామకృష్ణ
- కాకినాడ రూరల్ - పంతం నానాజీ
- రాజానగరం - బత్తుల బలరామకృష్ణ
- తెనాలి - నాదెండ్ల మనోహర్
- నిడదవోలు - కందుల దుర్గేష్
- పెందుర్తి - పంచకర్ల రమేష్ బాబు
- యలమంచిలి - సుందరపు విజయ్ కుమార్
- పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ
- రాజోలు - దేవ వరప్రసాద్
- తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్
- భీమవరం - పులపర్తి ఆంజనేయులు
- నరసాపురం - బొమ్మిడి నాయకర్
- ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు
- పోలవరం - చిర్రి బాలరాజు
- తిరుపతి - అరణి శ్రీనివాసులు
- రైల్వే కోడూరు - డా.యనమల భాస్కరరావు
- విశాఖపట్నం దక్షిణం: వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్
లోక్సభ అభ్యర్థులు
- మచిలీపట్నం- వల్లభనేని బాలశౌరి
- కాకినాడ- తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు