K Kesavarao: సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ

సీఎం రేవంత్‌రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు.

Updated : 29 Mar 2024 12:41 IST

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరతానని గురువారం ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మర్యాదపూర్వకంగా సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ తదితరులు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించినట్లు సమాచారం. త్వరలో తన కుమార్తె, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మితో కలిసి కేకే కాంగ్రెస్‌లో చేరనున్నారు.

ఇటీవల కేశవరావు ఇంటికి వెళ్లిన దీపా దాస్‌మున్షీ.. కేకేతోపాటు ఆయన కుమార్తెను పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వారు భారాసను వీడి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం అప్పటి నుంచే జరుగుతోంది. తాజాగా గురువారం కేకే నిర్ణయంతో అది ఖరారైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని