Kadiyam Kavya: వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య
వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది.
దిల్లీ: వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుముందు కడియం కావ్యకు భారాస వరంగల్ లోక్సభ టికెట్ ఇవ్వగా.. ఆ పార్టీ నుంచి పోటీ చేసే ఉద్దేశం తనకు లేదంటూ ఆమె నిరాకరించారు. తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకుగానూ కాంగ్రెస్ ఇప్పటి వరకు 14 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీ నియమావళినే కాపాడుకోలేకపోయారు
కేవలం ఒక కుటుంబాన్ని ప్రోత్సహించడం కోసం కాంగ్రెస్ నేతలు తమ సొంత పార్టీ నియమావళిని రక్షించుకోవడంలోనూ విఫలమయ్యారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. -
ఇప్పటికే 310.. చివరి 2 దశలతో 400+
కేంద్రంలో ఎన్డీయే సర్కారు మరోసారి కొలువుదీరుతుందని, ఇప్పటికే 310 సీట్లు తమ ఖాతాలోకి వచ్చి ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా చెప్పారు. -
ప్రధాని మోదీ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు
హిందూ-ముస్లిం చీలిక తీసుకువచ్చి, విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రధాని మోదీ ప్రతిరోజూ ప్రయత్నిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. -
మిథున్ చక్రవర్తి రోడ్ షోపై రాళ్లదాడి
లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో సినీనటుడు, భాజపా నేత మిథున్ చక్రవర్తి రోడ్ షోపై కొందరు వ్యక్తులు రాళ్లు, బాటిళ్లతో దాడి చేశారు. -
సీఎంకు ఈటల క్షమాపణలు చెప్పాలి: ఎమ్మెల్యే సత్యం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా నేత ఈటల రాజేందర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటున్న వారికి వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలి
ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27న జరగనున్న నేపథ్యంలో ఆ రోజు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న ఓటు హక్కున్న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు. -
విపక్షాలది మోసగాళ్ల కూటమి
‘‘జంగిల్రాజ్ వారసుడు (తేజస్వీ యాదవ్ను ఉద్దేశించి) జూన్ 4 తర్వాత మోదీ విశ్రాంతి తీసుకుంటారని ప్రచారం చేస్తున్నారు. -
జవహర్రెడ్డి, రాజేంద్రనాథరెడ్డి కనుసన్నల్లోనే దాడులు
ఎన్నికల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన హింసాత్మక సంఘటనలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, పూర్వ డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, పూర్వ నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు కనుసన్నల్లోనే చోటుచేసుకున్నాయని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. -
ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత జగన్దే
ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత సీఎం జగన్దేనని తెదేపా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఆసుపత్రులకు రూ.1,500 కోట్ల బకాయిలు చెల్లించకుండా అస్మదీయ కాంట్రాక్టర్లకు సమర్పించుకున్నారని పేర్కొన్నారు. -
సందేశ్ఖాలీ మహిళల దుస్థితి చూసి నా హృదయం ముక్కలైంది
అమాయక మహిళలను భాజపా తన రాజకీయ క్రీడలకు పావులుగా వినియోగించుకుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీ ఆరోపించారు. -
సంక్షిప్త వార్తలు(5)
ఆధునిక భారత నిర్మాణానికి అద్భుతమైన పునాదులు వేసిన గొప్ప దార్శనికుడు రాజీవ్గాంధీ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తీవ్రవాదుల రాక్షస చర్యలకు ఆయన బలైపోయిన విషాద ఘటన ఇప్పటికీ గుండెను కలచివేస్తూనే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. -
ఓట్ల కోసం తమిళుల్ని కించపరుస్తారా?
ఒడిశాలోని పూరీ జగన్నాథుని ఆలయ రత్న భాండాగారం తాళాలు తమ రాష్ట్రానికి చేరి ఉంటాయని ప్రధాని మోదీ చెప్పడంపై తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ అభ్యంతరం వ్యక్తంచేశారు. -
విజయం దిశగా ఇండియా కూటమి: కేజ్రీవాల్
దేశ రాజధాని దిల్లీ ప్రజలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాకిస్థానీలుగా అభివర్ణించారంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
రైతన్న ‘మద్దతే’ కీలకం!
రైతన్నల ఆందోళన, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంలో కుదుపు, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల కూటమి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)ల పోరాటం మధ్య మరోసారి హరియాణాలో 10కి 10 సీట్ల మ్యాజిక్ను పునరావృతం చేయాలని భాజపా తలపోస్తోంది. -
ఎన్డీయేకు రాను రాను మరింత మద్దతు : మోదీ
భాజపా సారథ్యంలో బలమైన ఎన్డీయే సర్కారు కేంద్రంలో రావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, ఎన్డీయే కూటమికి మద్దతు రోజురోజుకూ మరింత బలోపేతం అవుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. -
ఎన్నికలయ్యాక సన్నాలకే బోనస్ అనడం మోసగించడమే
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే ఇస్తామనడం రైతులను దగా చేయడమేనని మాజీ మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. -
నవ భారత సృష్టికర్త రాజీవ్గాంధీ
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ నవభారత నిర్మాణ సృష్టికర్త అని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు తెజస మద్దతు
శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వనున్నట్లు తెజస ప్రకటించింది. ఇటీవల కాంగ్రెస్ రాసిన లేఖ మేరకు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ మంగళవారం తెలిపారు. -
కేసీఆర్ తప్పిదాలతోనే ఈ ఇబ్బందులు: కోదండరెడ్డి
కేసీఆర్ సర్కారు చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విమర్శించారు. -
జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని బీజేవైఎం ఆందోళన
జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో హైదరాబాద్ గన్పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. -
భారాస చేసిన తప్పులు కాంగ్రెస్ చేయొద్దు
తెలంగాణలో భారాస చేసిన తప్పులతోనే భాజపా బలం పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవే తప్పులు చేసి ఆ పార్టీ మరింత బలపడే పరిస్థితి తీసుకురావద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు.