Kadiyam Kavya: వరంగల్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య

వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానం ఖరారు చేసింది.

Updated : 10 Apr 2024 16:07 IST

దిల్లీ: వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుముందు కడియం కావ్యకు భారాస వరంగల్‌ లోక్‌సభ టికెట్‌ ఇవ్వగా.. ఆ పార్టీ నుంచి పోటీ చేసే ఉద్దేశం తనకు లేదంటూ ఆమె నిరాకరించారు. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగానూ కాంగ్రెస్‌ ఇప్పటి వరకు 14 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని