Kamal Nath: అరుదైన సన్నివేశం.. సీఎం చౌహాన్‌ను కలిసిన కమల్‌నాథ్‌

సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌, మాజీ సీఎం కమల్‌నాథ్‌ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.

Updated : 04 Dec 2023 22:27 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కమల్‌నాథ్‌ కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అపూర్వ విజయం సాధించినందుకు గాను ఆయనకు అభినందనలు తెలిపారు. నవంబర్‌ 17న మధ్యప్రదేశ్‌ ఎన్నికలు జరిగే వరకు మాటల తూటాలు పేల్చుకున్న ఇరువురు నేతలూ సోమవారం ఇలా కలుసుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఇరువురు నేతలూ పరస్పరం పుష్పగుచ్ఛాలు ఇచ్చుకున్నారు. నవ్వుతూ కరచాలనం చేసుకుంటూ పరస్పరం పలకరించుకున్నారు. కమల్‌నాథ్‌తో పాటు ఆయన తనయుడు నకుల్‌ నాథ్‌.. సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు అభినందనలు తెలిపారు.

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 163 సీట్లతో అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈసారి అధికారంలోకి వస్తామని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు ఇక్కడ నిరాశే ఎదురైంది. కేవలం 66 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని