Kejriwal: కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కేజ్రీవాల్కు సమయం లేదని, అందుకే తన భార్యను ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు.
దిల్లీ: మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ను (Kejriwal) ఉద్దేశించి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు ఆయనకు చాలా తక్కువ సమయమే ఉందని, అందుకే ఆ స్థానంలో భార్య సునీతను కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారని వ్యాఖ్యానించారు. పార్టీలోని ముఖ్య నేతలందర్నీ పక్కకు నెట్టి త్వరలోనే ఆమె సీఎం కుర్చీని అధిరోహిస్తారన్నారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సునీత, కేజ్రీవాల్ గతంలో రెవెన్యూ సర్వీసులో చేసినప్పుడు సహోద్యోగులు మాత్రమే కాదు. ప్రతీ ఒక్కర్నీ వారు తొక్కుకుంటూ వెళ్లిపోయారు. ఇప్పుడు ‘మేడం’ కీలక పదవి చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 9సార్లు సమన్లు జారీ చేస్తే.. కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదని హర్దీప్ అన్నారు. అందుకే ఈడీ అధికారులు ఆయన ఇంటికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. సమయం చాలా తక్కువగా ఉందన్న సంగతి కేజ్రీవాల్కు కూడా అర్థమైందని వ్యాఖ్యానించారు. మద్యం కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ కస్టడీని గురువారం దిల్లీ న్యాయస్థానం మరో నాలుగు రోజుల పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1న ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరుపరచాలని ఈడీ అధికారులను ఆదేశించింది. అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్) మాజీ అధికారి. 22 ఏళ్లపాటు ఆదాయపు పన్ను శాఖలో సేవలందించారు. భోపాల్లో శిక్షణ సమయంలో కేజ్రీవాల్తో పరిచయం ఏర్పడింది. ఆమె 1994 బ్యాచ్కు చెందినవారు కాగా.. కేజ్రీవాల్ 1995 బ్యాచ్కు చెందినవారు.
‘కూటమి’ కథ ముగిసింది..
మరోవైపు చట్టబద్ధమైన పన్నుల చెల్లింపులను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని పూరి విమర్శించారు. ప్రతిఒక్కరూ రిటర్నులు దాఖలు చేయాల్సిందేనని చెప్పారు. రూ.1,823 కోట్లు చెల్లించాలంటూ ఆదాయ పన్ను విభాగం ఇవాళ కాంగ్రెస్కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఆ మరుసటి రోజే 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1800 కోట్లకుపైగా డిమాండ్ నోటీసులను ఐటీ పంపించింది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా, దిల్లీలోని రామ్లీలా మైదానంలో మార్చి 31న ఇండియా కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై హర్దీప్ స్పందిస్తూ వాళ్ల సమయం ముగిసిందని, ఇక వారి గురించి మాట్లాడుకోవడం అనవసరమని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో భారతీయులు మృతి
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా