Telangana BJP: కమలం.. పదవుల బలం
భాజపా జాతీయ నాయకత్వం కేంద్ర మంత్రిత్వశాఖల్లో రాష్ట్రానికి ప్రాధాన్యమివ్వడంపై పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు భాజపా కీలక నేతలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతోపాటు ముఖ్యశాఖలు కేటాయించడంతో కమలం వర్గాలు ఆనందంతో ఉన్నాయి.
కేంద్ర మంత్రిత్వ శాఖల్లో రాష్ట్రానికి ప్రాధాన్యం
ఓట్లు.. సీట్లు పెరిగిన నేపథ్యం
పార్టీ బలోపేతానికి దోహదపడుతుందంటున్న నేతలు
ఈటల రాజేందర్కూ కీలక పదవి?
ఈనాడు, హైదరాబాద్: భాజపా జాతీయ నాయకత్వం కేంద్ర మంత్రిత్వశాఖల్లో రాష్ట్రానికి ప్రాధాన్యమివ్వడంపై పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు భాజపా కీలక నేతలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతోపాటు ముఖ్యశాఖలు కేటాయించడంతో కమలం వర్గాలు ఆనందంతో ఉన్నాయి. రాష్ట్రంలో పార్టీకి ఓట్లు, సీట్లు పెరిగిన నేపథ్యంలో ఇలా ప్రాధాన్యమివ్వడం పార్టీ సంస్థాగతంగా మరింత పటిష్ఠం కావడానికి దోహదపడుతుందని కాషాయ నేతలు పేర్కొంటున్నారు. గత ఐదేళ్లలో తొలుత హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కిషన్రెడ్డికి తర్వాత ప్రాధాన్యం పెరిగి శాఖల మార్పుతోపాటు క్యాబినెట్ మంత్రిగా ప్రమోషన్ లభించింది. పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను ఆయన నిర్వహించారు. ఇప్పుడు కూడా క్యాబినెట్ హోదా ఇవ్వడంతోపాటు ప్రధానమైన బొగ్గు, గనుల మంత్రిత్వశాఖను కేటాయించడం విశేషం. భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కి కేంద్రమంత్రి పదవి దక్కడం ఇదే తొలిసారి. కీలకమైన హోంశాఖలో సంజయ్ని భాగస్వామిగా చేయడం రాష్ట్ర పార్టీకి ప్రధాని, అగ్రనేత అమిత్షా ఇస్తున్న ప్రత్యేక గుర్తింపుగా విశ్లేషిస్తున్నారు. నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు 8 స్థానాలు, 13 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఐదు నెలల అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో 8 మంది ఎంపీలు గెలవడంతోపాటు 35 శాతం ఓట్లను సొంతం చేసుకుంది. తాజా ఫలితాలపై భాజపా జాతీయ నాయకత్వం సంతృప్తి చెందినట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ప్రకటించారు.
మరికొందరు నేతలకు పార్టీ పదవులు
పార్టీ పదవుల్లో రాష్ట్ర నేతలకు ఇప్పటికే సముచిత ప్రాధాన్యం లభించింది. భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత కె.లక్ష్మణ్ ఉన్నారు. ఆయనను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసి కీలకమైన పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా కూడా నియమించారు. బండి సంజయ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యనేత డి.కె.అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో ముఖ్యనేతలు ఎంపీలుగా ఎన్నికవడంతో పార్టీ పదవుల్లో కీలక మార్పులకు జాతీయ నాయకత్వం శ్రీకారం చుట్టనుంది. కేంద్ర మంత్రి పదవులను ఆశించిన వారిలో మల్కాజిగిరి, నిజామాబాద్, మహబూబ్నగర్ ఎంపీలు ఈటల రాజేందర్, డి.అర్వింద్, డి.కె.అరుణ కూడా ఉన్నారు. కిషన్రెడ్డి మళ్లీ క్యాబినెట్ మంత్రిగా నియమితులైన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ సోమవారం భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలను విశ్లేషిస్తూ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఈటల ముందున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. బండి సంజయ్ కేంద్రమంత్రి కావడంతో ఆయన నిర్వహిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని మరో నేతకు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి కూడా పార్టీ పదవుల్లో ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్