Kishan Reddy: తెలంగాణలో మాకు డబుల్‌ డిజిట్ సీట్లు ఖాయం: కిషన్‌రెడ్డి

ప్రజల ఆశీర్వాదం భాజపాకు ఉంది.. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Updated : 04 Jun 2024 08:59 IST

హైదరాబాద్‌: ప్రజల ఆశీర్వాదం భాజపాకు ఉంది.. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. అమ్మవారి ఆశీస్సులతో భాజపా భారీ విజయం సాధించబోతుందన్నారు. జూన్‌ రెండో వారంలో మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలో తమకు డబుల్ డిజిట్ సీట్లు వస్తాయన్నారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారని చెప్పారు. పూర్తి ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరగాలని ఆకాంక్షించారు. భాజపాకు అత్యధిక స్థానాలు వస్తాయని భావిస్తున్నామన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ను మోదీ పోల్స్ అన్న రాహుల్.. ఇంకా నయం రీ ఎగ్జిట్ పోల్స్ చేయాలని డిమాండ్ చేయలేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు