Kishan Reddy: మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం: కిషన్‌రెడ్డి

జూన్‌ 8 లేదా 9న ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణం చేస్తారని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Published : 08 Apr 2024 18:09 IST

చేవెళ్ల: జూన్‌ 8 లేదా 9న భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణం చేస్తారని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి, సమైక్యత కోసం భాజపాకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మోదీ వచ్చాక మత కలహాలు, కర్ఫ్యూలు లేవని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో అన్నీ దిగుమతి చేసుకునే వాళ్లమన్న ఆయన... ప్రస్తుతం విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలో అన్ని రంగాల్లోనూ అవినీతి చేశారని విమర్శించారు. ఆర్టికల్‌ 370 పేరుతో ఎన్నో దారుణాలు చేశారని, భాజపా ప్రభుత్వం దానిని తొలగించిందని గుర్తు చేశారు. రాహుల్‌ గాంధీ దేశాభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సెక్యులర్‌ పేరుతో దేవాలయాలను కాంగ్రెస్ నాశనం చేసిందని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు