CPI: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాం: కూనంనేని

ప్రభుత్వాన్ని కూలుస్తామని కొందరు నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. 

Published : 21 Jan 2024 16:12 IST

హైదరాబాద్‌: ప్రభుత్వాన్ని కూలుస్తామని కొందరు నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రజాతీర్పును అగౌరవపరచడం సరికాదన్నారు. కరెంట్‌ బిల్లులు చెల్లించవద్దనడం పద్ధతేనా? అని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు ఒకట్రెండు స్థానాలు మాత్రమే వస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో స్నేహధర్మం పాటించి తాము కోరిన ఐదు నియోజకవర్గాల్లో ఒక సీటు ఇవ్వాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని