Kunamneni: కుమిలిపోం.. మా సత్తా ఏంటో చూపిస్తాం: కూనంనేని సాంబశివరావు
భారాస చేసిన తప్పుతో కుమిలిపోమని, తమ సత్తా ఏంటో చూపిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasivarao) వెల్లడించారు.
హైదరాబాద్: భారాస చేసిన తప్పుతో కుమిలిపోకుండా తమ సత్తా ఏంటో చూపిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasivarao) వెల్లడించారు. సమరశీల పోరాటాలు చేసి గ్రామగ్రామానా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. ఉమ్మడి 10 జిల్లాల్లోని 30 సీట్లలో సీపీఐకి 10 వేలకు పైగా ఓటు బ్యాంకు ఉందని తెలిపారు.
సెప్టెంబర్ 17న భారీ బహిరంగ సభ
‘‘సెప్టెంబర్ 17ను బంగారు అక్షరాలతో చరిత్రలో లిఖించాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. భారాస అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తామని గొప్పలు చెప్పారు. దీనిపై కేసీఆర్ తన విధానం స్పష్టం చేయాలి. చరిత్రను వక్రీకరించకుండా ఒక కమిటీ వేసి సమాజానికి అందించాలి. సెప్టెంబర్ 11 నుంచి మేం బస్సు యాత్ర చేస్తాం. హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించి సెప్టెంబర్ 17న ఎగ్జిబిషన్ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తాం. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా ముఖ్య అతిథిగా హాజరవుతారు.
కేసీఆర్ కనీసం రాజకీయ విలువలు పాటించలేదు
‘ఇండియా’ కూటమిలో చేరి మిత్ర ధర్మం పాటించలేదని ఒక పత్రికలో రాశారు. కేసీఆర్ మిత్ర ధర్మం పాటించారు కాబట్టే కంటి వెలుగు, భారాస, మునుగోడు సభకు తమను పిలిచామని చెబుతున్నారు. పొత్తు వద్దని ప్రకటించాలి తప్పితే ఒక్క సీటు ఇస్తానని ఎందుకు చెప్పాలి?‘ఇండియా’ కూటమిలో చేరి పొత్తు నుంచి వైదొలిగామని చెబుతున్న భారాస నాయకులు.. ఎందుకు ఒక్క సీటు ఇస్తామని సంప్రదింపులు జరిపారు. 2004లో కాంగ్రెస్, 2009లో తెదేపాతో కేసీఆర్ ఎందుకు పొత్తు పెట్టుకున్నారు. ఎవరూ బలంగా ఉంటే వాళ్లతో పొత్తు పెట్టుకుని, మమ్మల్ని విమర్శించడం హాస్యాస్పదం. వెన్నుపోటు ఎలా పొడవాలి.. అధికారంలోకి ఎలా రావాలన్నదే మీ పని. కేసీఆర్ కనీసం రాజకీయ విలువలు పాటించలేదు’’ అని కూనంనేని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!