AP Election Results: పొత్తు సూపర్హిట్
వైకాపా అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే ఏకైక ఎజెండాగా పనిచేసిన తెదేపా, జనసేన, భాజపాల పొత్తు సూపర్హిట్ అయింది. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్కల్యాణ్ల ధాటికి ఎన్నికల కురుక్షేత్రంలో వైకాపా కకావికలమైంది.
ఒకే మాట..ఒకే బాటగా కదిలిన తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు
ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ల ధాటికి వైకాపా విలవిల
ఈనాడు, అమరావతి: వైకాపా అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే ఏకైక ఎజెండాగా పనిచేసిన తెదేపా, జనసేన, భాజపాల పొత్తు సూపర్హిట్ అయింది. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్కల్యాణ్ల ధాటికి ఎన్నికల కురుక్షేత్రంలో వైకాపా కకావికలమైంది. ఇప్పటివరకు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విజయాన్ని కూటమి సొంతం చేసుకుంది. 2014లో తెదేపా, జనసేన, భాజపా కలిసికట్టుగా సాధించిన దానికంటే ఈ సారి అఖండ విజయాన్ని అందిపుచ్చుకుంది. వైకాపాను కూకటివేళ్లతో పెకలించి వేసింది. సామాజికవర్గాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధిపొందాలనే వైకాపా ఎత్తుగడను చిత్తు చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వైకాపాను దాదాపుగా ఊడ్చిపారేసింది. అగ్రనేతల మొదలు క్షేత్రస్థాయిలో కార్యకర్తల వరకు ఒకే మాట, ఒకే బాటగా సాగారు. ఇవన్నీ ఫలించి పొత్తు దిగ్విజయమైంది.
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే పొత్తు పొడుపు....
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, విధ్వంసకాండపై మొదట చంద్రబాబు, పవన్కల్యాణ్ కృష్ణార్జునుల్లా సమరశంఖం పూరించారు. రెండు పార్టీల మధ్య పొత్తు రాత్రికి రాత్రే సాధ్యమవలేదు. అనేక విస్తృత సమావేశాల తర్వాత వారు ఒక నిర్ణయానికి వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే రెండు పార్టీల మధ్య పొత్తుకు అంకురార్పణ జరిగింది. మండల, జిల్లాపరిషత్ ఎన్నికల్లో కొన్ని చోట్ల కింది స్థాయిలో కార్యకర్తలు అవగాహనతో కలిసి పనిచేశారు. వైకాపా నిర్బంధాలను ఎదిరించి చాలా చోట్ల గెలిచారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్కల్యాణ్లు ‘వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్’ నినాదంలో భాగంగా ఓట్లు చీలకూడదనే సంకేతాలను క్యాడర్కు ఇస్తూ వచ్చారు. అయితే చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పొత్తులో కీలక మలుపు. ఆయన జైల్లో ఉండగా ములాఖత్లో భాగంగా కలిసేందుకు వెళ్లిన పవన్...బయటకు వచ్చి అనూహ్యంగా పొత్తును ప్రకటించారు. ఆ తర్వాత అది విస్తృతమైంది. వైకాపా ప్రభుత్వంపై ఇరు పార్టీల కార్యకర్తలు కలిసి పోరాటం చేశారు. కార్యకర్తల మధ్య ఎక్కడా ఇసుమంతైనా పొరపచ్చాలు రాకుండా అధినేతలు కీలకంగా వ్యవహరించారు. అయితే చివరి నిమిషం దాకా భాజపా పొత్తులోకి వస్తుందా? రాదా అనే సందిగ్ధత కొనసాగింది. షెడ్యూలు వెలువడటానికి కొన్ని రోజుల ముందు భాజపా కూడా కలిసొచ్చింది. భాజపా కూడా తమతో కలిసి వచ్చేలా పవన్ విశేష కృషి చేశారు. ఈ సందర్భంగా భాజపా వారి బలానికి మించి ఎక్కువ సీట్లు అడిగినా...విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు.
విస్తృత చర్చలు... సంప్రదింపులు...
పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో విస్తృత చర్చలు, సంప్రదింపులు కొనసాగించారు. మొదట శ్రీకాకుళం నియోజకవర్గాన్ని భాజపాకు కేటాయించారు. ఆ తర్వాత అనేక సమీకరణాలను బేరీజు వేసుకుని విజయావకాశాలకు అనుగుణంగా శ్రీకాకుళంలో తెదేపా పోటీ చేసే ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని భాజపాకు ఇచ్చారు. విజయనగరం లోక్సభ నియోజకవర్గం విషయంలోనూ అంతే. మొదట దీన్ని భాజపాకు కేటాయించారు. ఆ తర్వాత చర్చలు, సంప్రదింపులూ జరిపి తెదేపా ఆ స్థానంలో పోటీ చేసింది. అనపర్తి శాసనసభ నియోజకవర్గం విషయంలోనూ తొలుత పీటముడి పడింది. చివరికి తెదేపాకు చెందిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భాజపాలో చేరి ఆ పార్టీ తరఫునే పోటీ చేశారు. ఇలా విస్తృత ప్రయోజనాల దృష్ట్యా అనేక మార్పులు జరిగాయి.
జగన్ అరాచకాలపై విరుచుకుపడుతూ...
ఏపీలో భాజపా 10 శాసనసభ, ఆరు లోక్సభ స్థానాల్లోనే పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాని మోదీ అసాధారణ రీతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షోలను నిర్వహించారు. తొలి సభలో ఆయన జగన్ను విమర్శించకపోవడంతో దాన్ని వైకాపా నేతలు ఎత్తిచూపారు. ఆ తర్వాత పాల్గొన్న సభల్లో మోదీ నేరుగా జగన్నే టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వ అవినీతి, ఇసుక, మద్యం దందాలు, భూముల దోపిడీ వంటి అంశాలపై ఘాటైన విమర్శలు చేశారు. దీంతో ఆ పార్టీ నేతలకు ఊపిరి ఆడని పరిస్థితి ఎదురైంది. నరసరావుపేట లోక్సభ స్థానం పరిధిలో భాజపా అభ్యర్థులెవరూ పోటీలో లేనప్పటికీ..చిలకలూరిపేటలో జరిగిన ఎన్డీయే సభకు ప్రధాని హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా ఎన్నికల ప్రచారంలో తొలి నుంచే జగన్ అవినీతిపై, వైకాపా విధ్వంస పాలనపై విరుచుకుపడ్డారు. వైకాపా నేతల గుండెల్లో వణుకు పుట్టించారు. అగ్రనేతలైన నితిన్ గడ్కరీ, రాజ్నాథ్సింగ్లూ ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్కల్యాణ్లు సైతం పదునైన విమర్శలతో వైకాపాను గడగడలాడించారు.
అద్భుతమైన సమన్వయం...
ఒకసారి పొత్తు కుదిరాక ఆ పార్టీ నేతలెవరూ వెనుదిరిగి చూడలేదు. సీట్ల సర్దుబాటు, మ్యానిఫెస్టో, ఉమ్మడి ఎన్నికల ప్రచారం మొదలు అన్ని అంశాల్లోనూ అద్భుతమైన సమన్వయంతో ముందుకు దూసుకెళ్లారు. చంద్రబాబు, పవన్కల్యాణ్లు ఉమ్మడిగా విస్తృతంగా ప్రచారం చేశారు. అంతేకాకుండా జనసేన పోటీ చేసే తెనాలి వంటి ముఖ్య స్థానాల్లో పవన్కల్యాణ్తో కలిసి కాకుండా చంద్రబాబు ఒక్కరే ప్రచారం నిర్వహించారు. అదే విధంగా రేపల్లె, పొన్నూరు వంటి చోట్ల తమ పార్టీ అభ్యర్థులు పోటీలో లేకపోయినా..పవన్కల్యాణ్ అక్కడ ప్రచారం చేశారు. తిరుపతి లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో తెదేపా బరిలో లేకున్నా....పవన్కల్యాణ్తో కలిసి చంద్రబాబు ప్రచారంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం, రైల్వేకోడూరు ఎన్నికల ప్రచారానికి ఇద్దరూ కలిసి వెళ్లారు. ప్రధాని మోదీ నిర్వహించిన సభల్లోనూ వీరు పాల్గొన్నారు. ఇది మూడు పార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసేందుకు ఉపయోగపడింది. మ్యానిఫెస్టో తయారీలోనూ జనసేన ప్రతిపాదించిన అంశాలను తెదేపా చేర్చింది. ఉమ్మడిగా ఇరు పార్టీల నేతలు దానిని విడుదల చేశారు. ఇందులో భాజపా భాగస్వామి కాకపోవడంపై అపోహలు సృష్టించేందుకు వైకాపా నేతలు ప్రయత్నించినా...భాజపా సహ ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్సింగ్ తిప్పికొట్టారు. ఇలా ప్రతి అంశంలో ఎంతో సమన్వయంతో ముందుకు వెళ్లడం కలిసొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ తెలిపారు. -
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్